సహజంగా హిందీలో ఎక్కువగా కనిపించే కామెడీ ఫ్రాంచైజీని తెలుగులో ‘ఎఫ్ 3’తో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు అనీల్ రావిపూడి. మూడేళ్ళ క్రితం సంక్రాంతికి విడుదలై బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘ఎఫ్ 2’ కి ఫ్రాంచైజీ రాసుకొని ‘F3’ రెడీ చేసుకున్నాడు అనిల్. సేమ్ కాస్టింగ్ తో కొందరిని యాడ్ చేసుకొని సినిమా చేశాడు. దర్శకుడు అనిల్ మీద ఉన్న కాన్ఫిడెంట్ తో దిల్ రాజు కూడా ఈ సినిమాకు సంబంధించి మొత్తం భాద్యతను దర్శకుడి మీదే పెట్టేశాడు.
‘ఎఫ్ 2’ లో భార్యల వలన భర్తలకు వచ్చే ఫ్రస్ట్రేషన్ చూపించి ఆడియన్స్ కి ఫన్ అందించాడు అనిల్. దర్శకుడిగా హిలేరియస్ ఎంటర్టైనర్ డెలివరీ చేసి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. దాంతో వెంటనే మహేష్ బాబు సినిమా చాన్స్ అందుకొని స్టార్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ బాలయ్యతో సినిమా చేయబోతున్నాడు. బాలయ్య కూడా తన అప్ కమింగ్ డైరెక్టర్ సక్సెస్ కోసం టెన్షన్ పడుతున్నాడు. ఈ సక్సెస్ అనిల్ కి చాలా ఇంపార్టెంట్. ‘ఎఫ్ 2’ తో ఆ రేంజ్ సక్సెస్ అందుకున్న అనిల్ ఇప్పుడు ‘ఎఫ్ 3’ తో ఆ మేజిక్ రిపీట్ చేస్తాడా ? లేదా ? అనే సందేహంతో ఇటు ఇండస్ట్రీ అటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
నిజానికి అనిల్ రావిపూడి సినిమాల్లో పెద్ద కథ ఏమి ఉండదు. చిన్న లైన్ తీసుకొని దాని చుట్టూ ఆకట్టుకునే స్క్రీన్ ప్లే , తన స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్ మెంట్ క్రియేట్ చేసి హిట్లు కొడుతున్నాడు. ఇప్పటి వరకూ అనిల్ రావిపూడి ఆరు సినిమాలు డైరెక్ట్ చేశాడు. అందులో అన్ని హిట్లే. ఫ్రాంచైజీ ప్రెజర్ తో పాటు ఫ్లాప్ లేని డైరెక్టర్ అనే బిరుదు కూడా అనిల్ ని ఇప్పుడు భయపెట్టే అంశాలే. ఏదేమైనా అనిల్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. ‘ఎఫ్ 3’ ట్రైలర్ కూడా హిట్టయింది. మొదటి రోజు మార్నింగ్ షోకి ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా ఈ ఫన్ ఫ్రాంచైజీ చూసేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కట్టడం ఖాయం. మరి అనిల్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ సాధిస్తాడో చూడాలి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…