బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ చనిపోయి పది రోజులు అయిపోయింది. అతడిది ఆత్మహత్య అనే అందరూ మొదట్నుంచి భావిస్తున్నారు. ప్రాథమికంగా పోలీసులు చెప్పింది కూడా ఇదే. ఐతే కొన్ని రోజుల తర్వాత మీడియాలో సుశాంత్ మరణానికి సంబంధించి రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. సోషల్ మీడియాలో అయితే సుశాంత్ మరణం మీద ఎన్నో సందేహాలతో విశ్లేషణలు కనిపించాయి. అతడిది ఆత్మహత్య కాదని.. ప్రి ప్లాన్డ్ మర్డర్ అని.. చనిపోవడానికి కొన్ని గంటల ముందు కూడా సుశాంత్ హుషారుగా ఉన్నాడని, బయటికి కూడా వెళ్లొచ్చాడని.. మృతదేహాన్ని చూస్తే ఆత్మహత్య చేసుకున్నట్లుగా లేదని.. అనేక అనుమానాలున్నాయని.. ఇలా ఎన్నో సందేహాలు వినిపించాయి. ఐతే సుశాంత్ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వైద్యులు మాత్రం ఈ ప్రచారాలన్నింటినీ కొట్టిపారేశారు. సుశాంత్ది ఆత్మహత్య అని నిర్ధారించారు.
సుశాంత్ది హై ప్రొఫైల్ కేసు కావడంతో ఏకంగా ఐదుగురు వైద్యులు అతడి మృత దేహానికి పోస్టు మార్టం నిర్వహించారు. ఆ ఐదుగురూ కలిసి అతడిది ఆత్మహత్యే అని నిర్ధరిస్తూ పోస్టుమార్టం తుది నివేదిక మీద సంతకాలు కూడా చేశారు. సుశాంత్ మృతికి సంబంధించి అనుమానాస్పద రీతిలో ఏం జరగలేదని, అతని శరీరంపై ఎలాంటి గాయాలు లేవని తుది నివేదికలో వెల్లడైంది. ఉరి వేసుకోవడం వల్ల ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై సుశాంత్ మరణించాడని.. ఊపిరాడకపోవడమే మృతికి కారణమని ఇందులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. సుశాంత్ మృతి కేసులో ఫోరెన్సెక్ ప్రక్రియను వేగవంతం చేయాలని బాంద్రా పోలీసులు డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్కు లేఖ రాశారు. ఈ కేసులో పోలీసులు 23 మంది స్టేట్మెంట్స్ను రికార్డ్ చేశారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న బిల్డింగ్ సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు ఇప్పటికే పరిశీలించారు. సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో అతను పెంచుకుంటున్న పెంపుడు కుక్క మరో గదిలో ఉందని.. అది ప్రస్తుతం బతికే ఉందని పోలీసులు స్పష్టం చేశారు.
This post was last modified on June 24, 2020 10:01 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…