బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ చనిపోయి పది రోజులు అయిపోయింది. అతడిది ఆత్మహత్య అనే అందరూ మొదట్నుంచి భావిస్తున్నారు. ప్రాథమికంగా పోలీసులు చెప్పింది కూడా ఇదే. ఐతే కొన్ని రోజుల తర్వాత మీడియాలో సుశాంత్ మరణానికి సంబంధించి రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. సోషల్ మీడియాలో అయితే సుశాంత్ మరణం మీద ఎన్నో సందేహాలతో విశ్లేషణలు కనిపించాయి. అతడిది ఆత్మహత్య కాదని.. ప్రి ప్లాన్డ్ మర్డర్ అని.. చనిపోవడానికి కొన్ని గంటల ముందు కూడా సుశాంత్ హుషారుగా ఉన్నాడని, బయటికి కూడా వెళ్లొచ్చాడని.. మృతదేహాన్ని చూస్తే ఆత్మహత్య చేసుకున్నట్లుగా లేదని.. అనేక అనుమానాలున్నాయని.. ఇలా ఎన్నో సందేహాలు వినిపించాయి. ఐతే సుశాంత్ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వైద్యులు మాత్రం ఈ ప్రచారాలన్నింటినీ కొట్టిపారేశారు. సుశాంత్ది ఆత్మహత్య అని నిర్ధారించారు.
సుశాంత్ది హై ప్రొఫైల్ కేసు కావడంతో ఏకంగా ఐదుగురు వైద్యులు అతడి మృత దేహానికి పోస్టు మార్టం నిర్వహించారు. ఆ ఐదుగురూ కలిసి అతడిది ఆత్మహత్యే అని నిర్ధరిస్తూ పోస్టుమార్టం తుది నివేదిక మీద సంతకాలు కూడా చేశారు. సుశాంత్ మృతికి సంబంధించి అనుమానాస్పద రీతిలో ఏం జరగలేదని, అతని శరీరంపై ఎలాంటి గాయాలు లేవని తుది నివేదికలో వెల్లడైంది. ఉరి వేసుకోవడం వల్ల ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై సుశాంత్ మరణించాడని.. ఊపిరాడకపోవడమే మృతికి కారణమని ఇందులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. సుశాంత్ మృతి కేసులో ఫోరెన్సెక్ ప్రక్రియను వేగవంతం చేయాలని బాంద్రా పోలీసులు డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్కు లేఖ రాశారు. ఈ కేసులో పోలీసులు 23 మంది స్టేట్మెంట్స్ను రికార్డ్ చేశారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న బిల్డింగ్ సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు ఇప్పటికే పరిశీలించారు. సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో అతను పెంచుకుంటున్న పెంపుడు కుక్క మరో గదిలో ఉందని.. అది ప్రస్తుతం బతికే ఉందని పోలీసులు స్పష్టం చేశారు.
This post was last modified on June 24, 2020 10:01 pm
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…