ఆచార్య సినిమా చూసినవాళ్లకు చిరంజీవి చరణ్ లు గుర్తుంటారో లేదో కానీ ధర్మస్థలి పాదఘట్టం పదాలు మాత్రం పీడకలలా వెంటాడుతూనే ఉంటాయి. డైలాగుల కన్నా ఎక్కువ ఈ రెండు మాటలే చెవుల్లో రక్తం వచ్చేలా అన్ని పాత్రలతో చెప్పించారంటే అతిశయోక్తి కాదు. అమెజాన్ ప్రైమ్ లో వచ్చాక ఈ పాయింట్ మీద సోషల్ మీడియాలో చాలా మీమ్స్ వచ్చాయి. అయితే ఈ షూటింగ్ కోసమని సెట్ వేసిన గుడి ఇప్పటిదాకా అలాగే ఉంచేశారు. ఎవరికైనా ఉపయోగపడుతుందేమోనని కోకాపేటలో అదలాగే ఉంది.
తాజాగా దీన్ని సల్మాన్ ఖాన్ ఉపయోగించుకోబోతున్నట్టు తెలిసింది. ఉన్న సెట్ కే కొన్ని మార్పులు చేసి దాన్ని గ్రామంగా మారుస్తారట. కభీ ఈద్ కభీ దీవాలి ప్రధానమైన షెడ్యూల్ ఇందులో చిత్రీకరించబోతున్నట్టు సమాచారం. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ఆమెకు అన్నయ్యగా విక్టరీ వెంకటేష్ నటించబోతున్నారని ఆల్రెడీ లీక్ వచ్చింది కానీ యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. నిప్పు లేనిదే పొగ రాదు కాబట్టి ఇది నిజమయ్యే అవకాశాలే ఎక్కువ. త్వరలో అనౌన్స్ మెంట్ రావొచ్చు.
గాడ్ ఫాదర్ షూట్ జరుగుతున్న సమయంలో చిరు సల్మాన్ ల మధ్య కభీ ఈద్ కభీ దీవాలికి సంబందించిన ప్రస్తావన వచ్చినప్పుడు మెగాస్టార్ ధర్మస్థలి సెట్ గురించి చెప్పారట. వెంటనే దాన్ని చూసిన కండల వీరుడికి, దర్శకుడు ఫర్హాద్ సాంజికి నచ్చేయడంతో మార్పులకు రెడీ అయ్యారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ నాన్ స్టాప్ గా పూర్తి చేయబోతున్నారు. వెంకీ, పూజా హెగ్డేలు ఉంటారు కాబట్టి తెలుగులోనూ దీనికి మంచి మార్కెట్ దక్కుతుంది.
This post was last modified on May 24, 2022 1:35 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…
అక్కినేని కుటుంబం నుంచి ఘనంగా అరంగేట్రం చేసిన కథానాయకుల్లో సుమంత్ ఒకడు. కానీ తన కెరీర్ పుంజుకోవడానికి చాలా టైం…
స్టార్ పవర్ అంటే మాటల్లో కొలిచేది కాదు. దాని సత్తా ఏ స్థాయిలో ఉంటుదంటే ఒక్కసారి ట్రేడ్ వర్గాలకు సైతం…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురం మీద సినిమా కంటే ఎక్కువగా మహేష్ బాబు ఆ మూవీ…
ఈ రోజుల్లో పెద్ద స్టార్లు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడం అన్నది దాదాపు అసాధ్యంగా మారిపోయింది. మిడ్ రేంజ్ హీరోలు…