శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న భారీ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన సంగతులు ఆసక్తి రేపుతున్నాయి. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొత్తం మూడు పాత్రలు చేస్తుండగా, ఒకటి తండ్రి కాగా కొడుకులైన ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకరిది నెగటివ్ షేడ్స్ లో ఉంటుందట. ఇదే సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని కూడా రకరకాల వార్తలు వచ్చాయి. ఇదేదీ యూనిట్ నుంచి అఫీషియల్ గా అందింది కాదు కానీ చిన్నపెద్ద వయసుల్లో ద్విపాత్రాభినయం మాత్రం నిజమే.
ఇది కాసేపు నిజమే అనుకున్నా చరణ్ ఇలాంటి క్యారెక్టర్స్ ద్వారా పెద్ద రిస్క్ కు సిద్ధ పడినట్టే. ఎందుకంటే ట్రిపుల్ రోల్ మన హీరోలకు అంతగా అచ్చిరాలేదు. చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు భారీ విజయాన్ని అందుకోలేక జస్ట్ ఆబోవ్ యావరేజ్ అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ లవకుశ కమర్షియల్ గా పాస్ అయ్యింది కానీ వసూళ్ల లెక్కలో టాప్ త్రీలోకి తీసుకోలేం. సూపర్ స్టార్ కృష్ణ రక్తసంబంధం చేశారు కానీ అది అప్పట్లో పెద్ద డిజాస్టర్. ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక్క దానవీరశూరకర్ణ మాత్రమే దీనికి మినహాయింపు.
ఆర్ఆర్ఆర్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ తర్వాత ఆచార్య రూపంలో పెద్దఫ్లాప్ అందుకున్న రామ్ చరణ్ అందులో చేసింది ప్రధాన పాత్ర కాకపోయినా చెప్పుకోదగ్గ స్పేస్ ఉండటంతో ఈ పరాజయం నాన్నతో పాటు తన ఖాతాలోనూ వచ్చేసింది. అందుకే శంకర్ ప్రాజెక్ట్ మీద అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పెద్ద వయసు చరణ్ తాలూకు పార్ట్ పూర్తి చేశారు. ప్రస్తుతం కియారా అద్వానీతో కలిసి కాలేజీ సన్నివేశాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం, కార్తీక్ సుబ్బరాజ్ కథ అందించారు.
This post was last modified on May 24, 2022 1:18 pm
ఫ్లాపుల పరంపరకు తెరదించుతూ.. ఈ ఏడాది కపుల్ ఫ్రెండ్లీ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు యువ కథానాయకుడు సంతోష్ శోభన్.…
ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, ఆ పార్టీ తరఫున ఎంపీగా కూడా గెలిచిన రఘురామ కృష్ణం రాజు తర్వాత…
వైసీపీ అధినేత జగన్.. రాష్ట్రంలోని ఓ వర్గం మీడియాపై తరచుగా విమర్శలు చేయడంతోపాటు.. వాటిని గేలి కూడా చేస్తుంటారు. ఆయన…
ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న తమిళ స్టార్ హీరో ధనుష్, అగ్ర కథానాయిక నయనతార.. కొన్ని కారణాల వల్ల శత్రువులుగా…
ఎప్పుడు ఎవరి కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. తమిళ కుర్రాడు ప్రదీప్ రంగనాథన్కు... నాలుగేళ్ల ముందు వరకు తమిళనాడులోనే…
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత ఈ నెలలో…