కరోనా వల్ల లెక్కలన్నీ తారుమారు అయిపోయాయి. లాక్ డౌన్ కి ముందున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. థియేటర్లు తెరవడం లేదు. తెరచినా సినిమా విడుదల చేయడానికి ఏ నిర్మాతా రెడీగా లేడు. ఉన్నా.. సినిమా కొనే బయ్యరే లేడు. ఇది వరకు కొన్న సినిమాల్ని కూడా మాకొద్దు… అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేయండి అంటూ తిరిగి లాగేసుకుంటున్నారు. రెడ్, క్రాక్, సోలో బ్రతుకే సో బెటరు చిత్రాలు ఇదే సమస్యని ఎదుర్కొంటున్నాయి.
ఈ మూడు సినిమాలకు సంబంధించిన థియేటరికల్ రైట్స్ ముందే సేల్ అయిపోయాయి. బయ్యర్లు అడ్వాన్సులు ఇచ్చేశారు. క్రాక్ సినిమాని అన్ని ఏరియాల్లో కలిపి 20 కోట్లకు కొనేశారు. అందుకు సంబంధించిన అడ్వాన్సులూ ఇచ్చేశారు. 16 కోట్లకు సోలో బ్రతుకే సో బెటరు అమ్ముడైంది. రెడ్ కీ మంచి రేటు దక్కింది. అయితే ఇప్పుడు బయ్యర్లు ఈ సినిమాల్ని వదులుకోవడానికి రెడీ అయ్యారు. మాకు ఈ సినిమాలొద్దు అని నిర్మాతలకు తెగేసి చెప్పేశార్ట. కావాలంటే కమీషన్ పద్ధతిన మీ సినిమాల్ని విడుదల చేస్తాం కానీ, కొనలేం – అంటున్నార్ట.
కరోనా రోజు రోజుకీ విస్తరిస్తున్న నేపథ్యంలో థియేటర్లు తెరచుకోవడానికి అనుమతులు రావడం కష్టంగా మారింది. ఒకవేళ థియేటర్లు తెరచుకున్నా, జనం వస్తారో, రారో అనే భయాలు ఎలాగూ ఉన్నాయి. సీట్ల సంఖ్య కుదిస్తే – థియేటర్ల రాబడి పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే బయ్యర్లు ఏమాత్రం రిస్క్ తీసుకోవడానికి ఇష్ట పడడం లేదని తేలిపోయింది. ఈ మూడు సినిమాలే కాదు. ఇది వరకే బిజినెస్ పూర్తయిన మరిన్ని సినిమాలకూ ఇదే సమస్య ఎదురయ్యే అవకాశాలు పుష్కలం. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు విడుదల చేయాలంటే ఆ రిస్కు నిర్మాతే భరించాలేమో.
This post was last modified on June 24, 2020 8:25 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…