కరోనా వల్ల లెక్కలన్నీ తారుమారు అయిపోయాయి. లాక్ డౌన్ కి ముందున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. థియేటర్లు తెరవడం లేదు. తెరచినా సినిమా విడుదల చేయడానికి ఏ నిర్మాతా రెడీగా లేడు. ఉన్నా.. సినిమా కొనే బయ్యరే లేడు. ఇది వరకు కొన్న సినిమాల్ని కూడా మాకొద్దు… అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేయండి అంటూ తిరిగి లాగేసుకుంటున్నారు. రెడ్, క్రాక్, సోలో బ్రతుకే సో బెటరు చిత్రాలు ఇదే సమస్యని ఎదుర్కొంటున్నాయి.
ఈ మూడు సినిమాలకు సంబంధించిన థియేటరికల్ రైట్స్ ముందే సేల్ అయిపోయాయి. బయ్యర్లు అడ్వాన్సులు ఇచ్చేశారు. క్రాక్ సినిమాని అన్ని ఏరియాల్లో కలిపి 20 కోట్లకు కొనేశారు. అందుకు సంబంధించిన అడ్వాన్సులూ ఇచ్చేశారు. 16 కోట్లకు సోలో బ్రతుకే సో బెటరు అమ్ముడైంది. రెడ్ కీ మంచి రేటు దక్కింది. అయితే ఇప్పుడు బయ్యర్లు ఈ సినిమాల్ని వదులుకోవడానికి రెడీ అయ్యారు. మాకు ఈ సినిమాలొద్దు అని నిర్మాతలకు తెగేసి చెప్పేశార్ట. కావాలంటే కమీషన్ పద్ధతిన మీ సినిమాల్ని విడుదల చేస్తాం కానీ, కొనలేం – అంటున్నార్ట.
కరోనా రోజు రోజుకీ విస్తరిస్తున్న నేపథ్యంలో థియేటర్లు తెరచుకోవడానికి అనుమతులు రావడం కష్టంగా మారింది. ఒకవేళ థియేటర్లు తెరచుకున్నా, జనం వస్తారో, రారో అనే భయాలు ఎలాగూ ఉన్నాయి. సీట్ల సంఖ్య కుదిస్తే – థియేటర్ల రాబడి పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే బయ్యర్లు ఏమాత్రం రిస్క్ తీసుకోవడానికి ఇష్ట పడడం లేదని తేలిపోయింది. ఈ మూడు సినిమాలే కాదు. ఇది వరకే బిజినెస్ పూర్తయిన మరిన్ని సినిమాలకూ ఇదే సమస్య ఎదురయ్యే అవకాశాలు పుష్కలం. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు విడుదల చేయాలంటే ఆ రిస్కు నిర్మాతే భరించాలేమో.
ఈ రోజుల్లో పెద్ద సినిమాలకే ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. అలాంటపుడు చిన్న స్థాయి సినిమాలను జనాల్లోకి…
మొన్నటిదాకా రాయలసీమ అంటే కరువు సీమ కిందే లెక్క. ఏ రాజకీయ పార్టీ అదికారంలోకి వచ్చినా… రాయలసీమ ఓట్లను గంపగుత్తగా…
గోదావరి జిల్లాల రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తీర్పు ఇస్తే రాష్ట్రంలో…
ఒక సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ అంటే సాధారణంగా క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. అందుకే పుష్ప 2, కెజిఎఫ్ 2,…
తెలంగాణలో జనసేన అధినేత పవన్కల్యాణ్.. ఈ నెల 2న నిర్వహించ తలపెట్టిన తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి…
దర్శకుడు సురేందర్ రెడ్డి పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. కారణం పవన్ కళ్యాణ్ అంగీకారం వస్తే సినిమా మొదలుపెట్టాలి. ఈ…