కరోనా వల్ల లెక్కలన్నీ తారుమారు అయిపోయాయి. లాక్ డౌన్ కి ముందున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. థియేటర్లు తెరవడం లేదు. తెరచినా సినిమా విడుదల చేయడానికి ఏ నిర్మాతా రెడీగా లేడు. ఉన్నా.. సినిమా కొనే బయ్యరే లేడు. ఇది వరకు కొన్న సినిమాల్ని కూడా మాకొద్దు… అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేయండి అంటూ తిరిగి లాగేసుకుంటున్నారు. రెడ్, క్రాక్, సోలో బ్రతుకే సో బెటరు చిత్రాలు ఇదే సమస్యని ఎదుర్కొంటున్నాయి.
ఈ మూడు సినిమాలకు సంబంధించిన థియేటరికల్ రైట్స్ ముందే సేల్ అయిపోయాయి. బయ్యర్లు అడ్వాన్సులు ఇచ్చేశారు. క్రాక్ సినిమాని అన్ని ఏరియాల్లో కలిపి 20 కోట్లకు కొనేశారు. అందుకు సంబంధించిన అడ్వాన్సులూ ఇచ్చేశారు. 16 కోట్లకు సోలో బ్రతుకే సో బెటరు అమ్ముడైంది. రెడ్ కీ మంచి రేటు దక్కింది. అయితే ఇప్పుడు బయ్యర్లు ఈ సినిమాల్ని వదులుకోవడానికి రెడీ అయ్యారు. మాకు ఈ సినిమాలొద్దు అని నిర్మాతలకు తెగేసి చెప్పేశార్ట. కావాలంటే కమీషన్ పద్ధతిన మీ సినిమాల్ని విడుదల చేస్తాం కానీ, కొనలేం – అంటున్నార్ట.
కరోనా రోజు రోజుకీ విస్తరిస్తున్న నేపథ్యంలో థియేటర్లు తెరచుకోవడానికి అనుమతులు రావడం కష్టంగా మారింది. ఒకవేళ థియేటర్లు తెరచుకున్నా, జనం వస్తారో, రారో అనే భయాలు ఎలాగూ ఉన్నాయి. సీట్ల సంఖ్య కుదిస్తే – థియేటర్ల రాబడి పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే బయ్యర్లు ఏమాత్రం రిస్క్ తీసుకోవడానికి ఇష్ట పడడం లేదని తేలిపోయింది. ఈ మూడు సినిమాలే కాదు. ఇది వరకే బిజినెస్ పూర్తయిన మరిన్ని సినిమాలకూ ఇదే సమస్య ఎదురయ్యే అవకాశాలు పుష్కలం. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు విడుదల చేయాలంటే ఆ రిస్కు నిర్మాతే భరించాలేమో.
ముందు లీకైనట్టే ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం వాయిదా పడింది. జూలై 30 విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు…
టాలెంట్ ఉండి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలంటే ఎవరో ఒకరి దగ్గర శిష్యుడిగా చేరాలి. లేదా ఎవరైనా రిఫరెన్స్ తీసుకుని ప్రముఖ…
ఏపీలో విపక్షం వైసీపీ ఇటీవలి కాలంలో తిరిగి యాక్టివ్ మోడ్ లోకి వచ్చినట్టే కనిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రదాన…
టాలీవుడ్ లో జూన్ నెలలో పెద్ది, మా ఇంటి బంగారం తమ మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చాయి. తెలుగు రాష్ట్రాల…
రిషికొండ పాలెస్ లను వినియోగంలోకి తీసుకువచ్చే దిశగా ఎట్టకేలకు ఓ కీలక అడుగు అయితే.పడింది. సాగర నగరం విశాఖ పర్యాటక…
బాలీవుడ్ మూవీ అల్ఫా ఇవాళ విడుదలైన సంగతి తెలిసిందే. అలియా భట్ టైటిల్ రోల్ పోషించగా శార్వరి వాఘ్ మరో…