కరోనా వల్ల లెక్కలన్నీ తారుమారు అయిపోయాయి. లాక్ డౌన్ కి ముందున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. థియేటర్లు తెరవడం లేదు. తెరచినా సినిమా విడుదల చేయడానికి ఏ నిర్మాతా రెడీగా లేడు. ఉన్నా.. సినిమా కొనే బయ్యరే లేడు. ఇది వరకు కొన్న సినిమాల్ని కూడా మాకొద్దు… అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేయండి అంటూ తిరిగి లాగేసుకుంటున్నారు. రెడ్, క్రాక్, సోలో బ్రతుకే సో బెటరు చిత్రాలు ఇదే సమస్యని ఎదుర్కొంటున్నాయి.
ఈ మూడు సినిమాలకు సంబంధించిన థియేటరికల్ రైట్స్ ముందే సేల్ అయిపోయాయి. బయ్యర్లు అడ్వాన్సులు ఇచ్చేశారు. క్రాక్ సినిమాని అన్ని ఏరియాల్లో కలిపి 20 కోట్లకు కొనేశారు. అందుకు సంబంధించిన అడ్వాన్సులూ ఇచ్చేశారు. 16 కోట్లకు సోలో బ్రతుకే సో బెటరు అమ్ముడైంది. రెడ్ కీ మంచి రేటు దక్కింది. అయితే ఇప్పుడు బయ్యర్లు ఈ సినిమాల్ని వదులుకోవడానికి రెడీ అయ్యారు. మాకు ఈ సినిమాలొద్దు అని నిర్మాతలకు తెగేసి చెప్పేశార్ట. కావాలంటే కమీషన్ పద్ధతిన మీ సినిమాల్ని విడుదల చేస్తాం కానీ, కొనలేం – అంటున్నార్ట.
కరోనా రోజు రోజుకీ విస్తరిస్తున్న నేపథ్యంలో థియేటర్లు తెరచుకోవడానికి అనుమతులు రావడం కష్టంగా మారింది. ఒకవేళ థియేటర్లు తెరచుకున్నా, జనం వస్తారో, రారో అనే భయాలు ఎలాగూ ఉన్నాయి. సీట్ల సంఖ్య కుదిస్తే – థియేటర్ల రాబడి పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే బయ్యర్లు ఏమాత్రం రిస్క్ తీసుకోవడానికి ఇష్ట పడడం లేదని తేలిపోయింది. ఈ మూడు సినిమాలే కాదు. ఇది వరకే బిజినెస్ పూర్తయిన మరిన్ని సినిమాలకూ ఇదే సమస్య ఎదురయ్యే అవకాశాలు పుష్కలం. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు విడుదల చేయాలంటే ఆ రిస్కు నిర్మాతే భరించాలేమో.
This post was last modified on June 24, 2020 8:25 pm
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…