దిల్ రాజు.. టాలీవుడ్లో కొమ్ములు తిరిగిన నిర్మాత, డిస్ట్రిబ్యూటర్. అంత పెద్ద నిర్మాత ఇటీవల ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. గత ఆరు నెలల నుంచి సినిమాల పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నానని.. ఒక వర్గం ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయంలో విశ్లేషకులు, మీడియా వాళ్లు ముందు నుంచే హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా టాలీవుడ్ మేల్కోలేదు.
అసలే కొవిడ్ ప్రభావంతో థియేటర్లకు వచ్చే అలవాటు తప్పి, ఓటీటీలకు అలవాటు పడి కొంత శాతం థియేటర్కు వచ్చే ప్రేక్షకులు తగ్గిపోగా.. టికెట్ల ధరల ప్రభావం కూడా పడి ఆ శాతం ఇంకా పెరిగిపోయింది. ఈ విషయాన్ని దిల్ రాజు త్వరగానే గుర్తించి.. ఈ ప్రకటన చేసినట్లున్నారు. ఐతే ఇలా థియేటర్లకు రావడం మానేసిన, తగ్గించిన ప్రేక్షకులను మళ్లీ ఇటు వైపు రప్పించేవి ఏవన్నదే ఇప్పుడు చర్చ. ముందుగా కనిపిస్తున్న సమాధానం.. ఎఫ్-3.
థియేటర్లకు రావడం తగ్గించేసిన ప్రేక్షకుల్లో ఎక్కువ శాతం ఫ్యామిలీ ఆడియన్సే. ఓటీటీల్లో చౌకగా వినోదం వస్తుండటం, చూడ్డానికి బోలెడంత కంటెంట్ అందుబాటులో ఉండటం, అదే సమయంలో సినీ వినోదం ఖరీదైపోవడం, తమ అభిరుచికి తగ్గ సినిమాలు రాకపోవడం.. ఇవీ ఆ వర్గం ప్రేక్షకులు థియేటర్లకు దూరం కావడానికి ప్రధాన కారణాలు. ఐతే అసలే రేట్లు పెరిగిపోగా.. పెద్ద సినిమాలకు తొలి వారం, పది రోజులు అదనంగా వడ్డిస్తుండటం ప్రేక్షకుల ఆగ్రహానికి కారణమైంది. ఐతే ఎఫ్-3 సినిమాకు అదనపు రేట్లు లేవు. సాధారణ స్థాయిలో కొంచెం ఎక్కువ స్థాయిలోనే రేట్లు ఉన్నప్పటికీ.. అందుకు సరిపడా వినోదం అందిస్తే ప్రేక్షకులు చూస్తారు.
ఇక గత రెండేళ్లలో ఫ్యామిలీ ఆడియన్స్ను పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేసే సినిమాలు రాలేదనే చెప్పాలి. చివరగా అలా అన్ని రకాలుగా వారిని అలరించిన సినిమా అల వైకుంఠపురములో అనే చెప్పాలి. ఎఫ్-3 పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం, దీనికి ప్రమోషన్లు గట్టిగా చేసి అంచనాలు పెంచడం, ట్రైలర్ కూడా ఆకర్షణీయంగా ఉండడంతో కుటుంబ ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు నడిచే అవకాశాలున్నాయి. రేట్లు ఇంకొంచెం రీజనబుల్గా ఉంటే బాగుండేదన్న అభిప్రాయం ఉంది కానీ.. సినిమాకు మంచి టాక్ వస్తే థియేటర్లకు ఫ్యామిలీ ఆడియన్స్తో కళకళలాడే అవకాశాలున్నాయి.
This post was last modified on May 24, 2022 7:15 am
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…