అదేంటో బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. చిరంజీవి సినిమా బెనిఫిట్ షోకి హౌస్ ఫుల్స్ పడలేదు. మహేష్ బాబు మూవీ రెండో వారంలో స్ట్రగుల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ రీమేక్ అతికష్టం మీద బ్రేక్ ఈవెన్ చేరుకుంది. ఒక కన్నడ డబ్బింగ్ చిత్రం మన ప్యాన్ ఇండియా మల్టీ స్టారర్ ని దాటేసింది. ఇవేవీ ఊహించినవి కాదు. అనుకున్నది ఒకటి అయినది ఒకటి తరహాలో ఎదురైన పోకడలు. కొన్ని మరీ విచిత్రంగా ఇమేజ్ ఉన్న హీరో నటించి ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉన్నా విడుదల కాని అయోమయంలో పడ్డాయి.
అందులో శర్వానంద్ ఒకే ఒక జీవితం ఉంది. ఎప్పుడో అయిదు నెలల క్రితం టీజర్ వచ్చింది. నాలుగున్నర మిలియన్స్ వ్యూస్ ని బట్టి దీని మీద ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారని అర్థమయ్యింది. కానీ ట్రైలర్ ఊసు లేదు. ఆ మధ్య మదర్ సెంటిమెంట్ సాంగ్ ఒకటి వదిలారు. తర్వాత మళ్ళీ గప్ చుప్. శ్రీకార్తీక్ దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ కం టైం ట్రావెల్ ఎంటర్ టైనర్ లో రీతూ వర్మ హీరోయిన్. కొంచెం గ్యాప్ తర్వాత అక్కినేని అమల ఇందులో ఓ కీలక పాత్ర పోషించారు. తమిళంలోనూ ఒకేసారి రిలీజ్ కు ప్లాన్ చేశారు
ఇదంతా బాగానే ఉంది కానీ ఒకే ఒక జీవితం ఎప్పుడు వస్తుందో అంతు చిక్కడం లేదు. శర్వానంద్ మార్కెట్ గత కొన్నేళ్లుగా డౌన్ లో ఉంది. వరస డిజాస్టర్లు తన థియేట్రికల్ బిజినెస్ మీద తీవ్ర ప్రభావం చూపించాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న శ్రీకారం, ఆడవాళ్ళు మీకు జోహార్లు లాంటి మంచి సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. కోలీవుడ్ లో సంచలనం సృష్టించిన 96 ఇక్కడ జానుగా దెబ్బతింది. డ్రీం వారియర్ లాంటి పెద్ద బ్యానర్ ఉన్నా ఒకే ఒక జీవితానికి మోక్షం ఎప్పుడో కాలమే సమాధానం చెప్పాలి. అసలే ఆగస్ట్ దాకా ప్రతి శుక్రవారం కొత్త సినిమాల రిలీజులతో కిక్కిరిసిపోతోంది. మరి శర్వాకు స్పేస్ దొరికేదెప్పుడో.
This post was last modified on May 23, 2022 9:03 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…