అదేంటో బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. చిరంజీవి సినిమా బెనిఫిట్ షోకి హౌస్ ఫుల్స్ పడలేదు. మహేష్ బాబు మూవీ రెండో వారంలో స్ట్రగుల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ రీమేక్ అతికష్టం మీద బ్రేక్ ఈవెన్ చేరుకుంది. ఒక కన్నడ డబ్బింగ్ చిత్రం మన ప్యాన్ ఇండియా మల్టీ స్టారర్ ని దాటేసింది. ఇవేవీ ఊహించినవి కాదు. అనుకున్నది ఒకటి అయినది ఒకటి తరహాలో ఎదురైన పోకడలు. కొన్ని మరీ విచిత్రంగా ఇమేజ్ ఉన్న హీరో నటించి ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉన్నా విడుదల కాని అయోమయంలో పడ్డాయి.
అందులో శర్వానంద్ ఒకే ఒక జీవితం ఉంది. ఎప్పుడో అయిదు నెలల క్రితం టీజర్ వచ్చింది. నాలుగున్నర మిలియన్స్ వ్యూస్ ని బట్టి దీని మీద ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారని అర్థమయ్యింది. కానీ ట్రైలర్ ఊసు లేదు. ఆ మధ్య మదర్ సెంటిమెంట్ సాంగ్ ఒకటి వదిలారు. తర్వాత మళ్ళీ గప్ చుప్. శ్రీకార్తీక్ దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ కం టైం ట్రావెల్ ఎంటర్ టైనర్ లో రీతూ వర్మ హీరోయిన్. కొంచెం గ్యాప్ తర్వాత అక్కినేని అమల ఇందులో ఓ కీలక పాత్ర పోషించారు. తమిళంలోనూ ఒకేసారి రిలీజ్ కు ప్లాన్ చేశారు
ఇదంతా బాగానే ఉంది కానీ ఒకే ఒక జీవితం ఎప్పుడు వస్తుందో అంతు చిక్కడం లేదు. శర్వానంద్ మార్కెట్ గత కొన్నేళ్లుగా డౌన్ లో ఉంది. వరస డిజాస్టర్లు తన థియేట్రికల్ బిజినెస్ మీద తీవ్ర ప్రభావం చూపించాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న శ్రీకారం, ఆడవాళ్ళు మీకు జోహార్లు లాంటి మంచి సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. కోలీవుడ్ లో సంచలనం సృష్టించిన 96 ఇక్కడ జానుగా దెబ్బతింది. డ్రీం వారియర్ లాంటి పెద్ద బ్యానర్ ఉన్నా ఒకే ఒక జీవితానికి మోక్షం ఎప్పుడో కాలమే సమాధానం చెప్పాలి. అసలే ఆగస్ట్ దాకా ప్రతి శుక్రవారం కొత్త సినిమాల రిలీజులతో కిక్కిరిసిపోతోంది. మరి శర్వాకు స్పేస్ దొరికేదెప్పుడో.
This post was last modified on May 23, 2022 9:03 pm
మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…
ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…
ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…
దేశంలో పురాతన, బ్రిటీష్ కాలం నాటి పేర్లను, ఊర్లను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం…
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి మహానగరంగా నిర్మించాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆదిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు.…