సీనియర్ హీరో రాజశేఖర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. శేఖర్. మలయాళ హిట్ జోసెఫ్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఆయన భార్య జీవిత దర్శకత్వం వహించారు. శేఖర్ విడుదల ముంగిట రాజశేఖర్ మాట్లాడుతూ.. సినిమానే తమకు బతుకు తెరువు అని.. ఈ సినిమాను విజయవంతం చేసి తాను అప్పుల పాలు కాకుండా చూడాలని ప్రేక్షకులకు విన్నవించడం తెలిసిందే. కాగా.. ఈ సినిమాకు ఆశించినంత మంచి టాక్ కానీ, ఓపెనింగ్స్ కానీ రాలేదు. ఇది రాజశేఖర్, జీవితలకు నిరాశ కలిగించే విషయమే.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసమని జీవిత తన వద్ద అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వనందుకు గాను పరంధామరెడ్డి అనే ఫైనాన్షియర్ కోర్టును ఆశ్రయించారు. కాగా.. 48 గంటల్లోపు రూ.65 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్గా జీవిత సమర్పించని పక్షంలో శేఖర్ సినిమాకు సంబంధించిన సర్వ హక్కులను ఎటాచ్ చేస్తూ.. ఆ సినిమాను ఎక్కడా ప్రసారం చేయకుండా నిలుపుదల చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లుగా పరంధామరెడ్డి మీడియాకు వెల్లడించారు. దీనిపై రాజశేఖర్ కానీ, జీవిత కానీ స్పందించలేదు. ఐతే ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన బీరం సుధాకర్ రెడ్డి.. పరంధామరెడ్డి ప్రకటనపై రెస్పాండయ్యారు.
శేఖర్ సినిమాకు నిర్మాత జీవిత కాదని, తాను అని, తన సినిమాకు ఎవరైనా నష్టం కలిగిస్తే ఊరుకునేది లేదని సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. హీరోగా నటించిన రాజశేఖర్కు, దర్శకురాలిగా బాధ్యతలు నిర్వర్తించిన జీవితకు తాను పూర్తిగా పారితోషకాలు ఇచ్చేశానని, ఈ సినిమా వాళ్లిద్దరిదీ అనుకుని ఎవరో కోర్టుకు వెళ్లారని, తన సినిమాకు వారు నష్టం కలిగిస్తే.. ఏదైనా జరిగితే.. తాను పరువునష్టందావా కేసు వేస్తానని.. తాను నష్టపోయిన మొత్తాన్ని వాళ్ల నుంచి రాబడతానని.. తన సినిమాను ఎవరికీ అమ్మకూడదని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. మరి ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.
This post was last modified on May 22, 2022 7:39 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…