హిందీలో తమిళంలో సూపర్ హిట్ షోగా పేరు తెచ్చుకుని భారీగా ఫాలోయింగ్ పెంచుకున్న బిగ్ బాస్ తెలుగులోనే చాలా పురిటి నొప్పులు పడింది. స్థిరంగా ఒక యాంకర్ లేక రేటింగ్స్ లో కిందా మీద పడుతూ ఎట్టకేలకు అయిదు సీజన్లు పూర్తి చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్, నానిలు దాన్ని నడిపించిన తీరు ఎలా ఉన్నప్పటికీ నాగార్జున తన చేతుల్లోకి తీసుకున్నాక టిఆర్పిలో ఒక స్టాండర్ నెస్ కనిపించింది. అయినా కూడా ఇదేమి బ్లాక్ బస్టర్ అని చెప్పుకునే రేంజ్ లో కాదు కానీ ఉన్నంతలో డీసెంట్ గా పాపులారిటీని పెంచుకుంది.
సరే టీవీలో అయ్యింది కదా ఓటిటిలో ప్రయోగం చేద్దామని డిస్నీ హాట్ స్టార్ వేదికగా ఇరవై నాలుగు గంటల గేమ్ షో అనే నినాదంతో ఫిబ్రవరి చివరిలో మొదలుపెట్టారు. హడావిడి అయితే గట్టిగానే చేశారు కానీ మధ్యలో సాంకేతిక సమస్యలు, ప్రోగ్రాంని ట్వంటీ ఫోర్ బై సెవన్ ఫార్మాట్ లో లైవ్ తో వచ్చిన ఇబ్బందులు కొంత నెగటివ్ గా మారాయి. ఎట్టకేలకు వాటినో కొలిక్కి తెచ్చి ఇవాళ ఫైనల్ ఎపిసోడ్ తో ముగింపు పలికారు. బిందు మాధవి విన్నర్ గా నిలిచి 25 లక్షలు గెలుచుకోగా అఖిల్, శివలు రెండు మూడు స్థానాల్లో నిలిచారు.
ఇక ఈ బిగ్ బాస్ ఓటిటి నాన్ స్టాప్ షో హిట్టా ఫట్టా అనే ప్రశ్న వేసుకుంటే ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాలను అందుకోలేదనే చెప్పాలి. దీనికి వ్యూస్ ఎన్ని వచ్చాయో హాట్ స్టార్ చెబితే తప్ప డేటా బయటికి రాదు. అదే శాటిలైట్ అయితే రేటింగ్స్ సులభంగా తెలిసిపోయేది. రెగ్యులర్ గా టీవీలో టెలికాస్ట్ అవుతున్నప్పుడు వచ్చినంత స్పందన సోషల్ మీడియాలో ఈ ఓటిటి బిగ్ బాస్ కు కనిపించలేదు. నాగార్జున యాంకరింగ్ చేసిన గ్రాండ్ ఫినాలేతో పాటు మరికొన్ని ఎపిసోడ్స్ తప్ప ప్రేక్షకులు ఎగబడి చూసినవి తక్కువే. మరి దీనికి కొనసాగింపు డిజిటల్ గా చేస్తారా లేదో చూడాలి. ఇదేమో కానీ బిగ్ బాస్ 6 ఉంటుందని మాత్రం నాగ్ హింట్ ఇచ్చేశారు.
This post was last modified on May 22, 2022 7:25 am
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…