‘సర్కారు వారి పాట’ బుకింగ్స్ కొద్దిగా డ్రాప్ అయ్యాయి. టీంతో పాటు మహేష్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ అన్నట్టుగా చెప్పుకున్నారు. కానీ గ్రౌండ్ కెళ్ళి చూస్తే సినిమా ఆ రేంజ్ హిట్ సాధించలేదు. తాజాగా సినిమా రిలీజై పది రోజులు గడవకుండానే తెలంగాణాలో మోస్తరుగా బుకింగ్స్ పడిపోయాయి. ఇక ఆంధ్రాలో కూడా ఫుల్స్ పడట్లేదు. 40 , 50 పర్సెంట్ మాత్రమే థియేటర్స్ ఫిల్ అవుతున్నాయి. ఈ క్రమంలో మళ్ళీ మహేష్ రంగంలోకి దిగాడు.
ఫ్యాన్స్ మీట్ అంటూ సినిమా గురించి ఓ ఇంటరాక్షన్ పెట్టుకున్నాడు. కీర్తి , పరశురాం కూడా పాల్గొన్నారు. అక్కడ ఫ్యాన్స్ సినిమా గురించి, మహేష్ అందం గురించి కన్వర్షన్ జరిగింది. ఆ వీడియోని తాజాగా మీడియాకిచ్చి డ్రాప్ అవుతున్న బుకింగ్ ని మళ్ళీ లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక మహేష్ రిలీజ్ కి ముందు సినిమా ప్రమోషన్స్ లో ఎంత చురుగ్గా పాల్గొంటాడో రిలీజ్ తర్వాత కూడా అంతే ఉత్సాహంతో పార్టిసిపెంట్ చేస్తాడు.
‘భరత్ అనే నేను’,మహర్షి’ సినిమాలకు కూడా ఇలాగే ఇంటరాక్షన్ పెట్టుకొని పోస్ట్ రిలీజ్ ఆ సినిమాలను మళ్ళీ ప్రమోట్ చేశాడు మహేష్. ‘భరత్ అనే నేను’ పోస్ట్ ప్రమోషన్ కోసం అప్పట్లో కేటీఆర్ ని తీసుకొచ్చారు. ‘మహర్షి’ కి రైతులు, ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ ఇంటరాక్షన్ కి యూట్యూబర్స్ కం ఫ్యాన్స్.
ఏదేమైనా సినిమా రిలీజ్ తర్వాత స్టార్ హీరోలు దాన్ని పెద్దగా పట్టించుకోరు. టీం ఇన్వైట్ చేస్తే సక్సెస్ మీట్ కి వచ్చి నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు. కానీ ఓ స్టార్ హీరో ఇలా రిలీజ్ తర్వాత డ్రాప్ అవుతున్న బుకింగ్స్ ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ పబ్లిసిటీ చేయడం అంటే అది ఒక్క మహేష్ కే చెల్లింది. మరి మహేష్ మళ్ళీ రంగంలో దిగి సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు కనుక ప్రేక్షకుల చూపు ఆకట్టుకొని బుకింగ్స్ జోరందుకునే అవకాశం ఉంది.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…