‘సర్కారు వారి పాట’ బుకింగ్స్ కొద్దిగా డ్రాప్ అయ్యాయి. టీంతో పాటు మహేష్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ అన్నట్టుగా చెప్పుకున్నారు. కానీ గ్రౌండ్ కెళ్ళి చూస్తే సినిమా ఆ రేంజ్ హిట్ సాధించలేదు. తాజాగా సినిమా రిలీజై పది రోజులు గడవకుండానే తెలంగాణాలో మోస్తరుగా బుకింగ్స్ పడిపోయాయి. ఇక ఆంధ్రాలో కూడా ఫుల్స్ పడట్లేదు. 40 , 50 పర్సెంట్ మాత్రమే థియేటర్స్ ఫిల్ అవుతున్నాయి. ఈ క్రమంలో మళ్ళీ మహేష్ రంగంలోకి దిగాడు.
ఫ్యాన్స్ మీట్ అంటూ సినిమా గురించి ఓ ఇంటరాక్షన్ పెట్టుకున్నాడు. కీర్తి , పరశురాం కూడా పాల్గొన్నారు. అక్కడ ఫ్యాన్స్ సినిమా గురించి, మహేష్ అందం గురించి కన్వర్షన్ జరిగింది. ఆ వీడియోని తాజాగా మీడియాకిచ్చి డ్రాప్ అవుతున్న బుకింగ్ ని మళ్ళీ లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక మహేష్ రిలీజ్ కి ముందు సినిమా ప్రమోషన్స్ లో ఎంత చురుగ్గా పాల్గొంటాడో రిలీజ్ తర్వాత కూడా అంతే ఉత్సాహంతో పార్టిసిపెంట్ చేస్తాడు.
‘భరత్ అనే నేను’,మహర్షి’ సినిమాలకు కూడా ఇలాగే ఇంటరాక్షన్ పెట్టుకొని పోస్ట్ రిలీజ్ ఆ సినిమాలను మళ్ళీ ప్రమోట్ చేశాడు మహేష్. ‘భరత్ అనే నేను’ పోస్ట్ ప్రమోషన్ కోసం అప్పట్లో కేటీఆర్ ని తీసుకొచ్చారు. ‘మహర్షి’ కి రైతులు, ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ ఇంటరాక్షన్ కి యూట్యూబర్స్ కం ఫ్యాన్స్.
ఏదేమైనా సినిమా రిలీజ్ తర్వాత స్టార్ హీరోలు దాన్ని పెద్దగా పట్టించుకోరు. టీం ఇన్వైట్ చేస్తే సక్సెస్ మీట్ కి వచ్చి నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు. కానీ ఓ స్టార్ హీరో ఇలా రిలీజ్ తర్వాత డ్రాప్ అవుతున్న బుకింగ్స్ ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ పబ్లిసిటీ చేయడం అంటే అది ఒక్క మహేష్ కే చెల్లింది. మరి మహేష్ మళ్ళీ రంగంలో దిగి సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు కనుక ప్రేక్షకుల చూపు ఆకట్టుకొని బుకింగ్స్ జోరందుకునే అవకాశం ఉంది.
This post was last modified on May 21, 2022 9:04 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…