Movie News

మహేష్ మళ్ళీ రంగంలోకి దిగాడు

‘సర్కారు వారి పాట’ బుకింగ్స్ కొద్దిగా డ్రాప్ అయ్యాయి. టీంతో పాటు మహేష్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ అన్నట్టుగా చెప్పుకున్నారు. కానీ గ్రౌండ్ కెళ్ళి చూస్తే సినిమా ఆ రేంజ్ హిట్ సాధించలేదు. తాజాగా సినిమా రిలీజై పది రోజులు గడవకుండానే తెలంగాణాలో మోస్తరుగా బుకింగ్స్ పడిపోయాయి. ఇక ఆంధ్రాలో కూడా ఫుల్స్ పడట్లేదు. 40 , 50 పర్సెంట్ మాత్రమే థియేటర్స్ ఫిల్ అవుతున్నాయి. ఈ క్రమంలో మళ్ళీ మహేష్ రంగంలోకి దిగాడు.

ఫ్యాన్స్ మీట్ అంటూ సినిమా గురించి ఓ ఇంటరాక్షన్ పెట్టుకున్నాడు. కీర్తి , పరశురాం కూడా పాల్గొన్నారు. అక్కడ ఫ్యాన్స్ సినిమా గురించి, మహేష్ అందం గురించి కన్వర్షన్ జరిగింది. ఆ వీడియోని తాజాగా మీడియాకిచ్చి డ్రాప్ అవుతున్న బుకింగ్ ని మళ్ళీ లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక మహేష్ రిలీజ్ కి ముందు సినిమా ప్రమోషన్స్ లో ఎంత చురుగ్గా పాల్గొంటాడో రిలీజ్ తర్వాత కూడా అంతే ఉత్సాహంతో పార్టిసిపెంట్ చేస్తాడు.

‘భరత్ అనే నేను’,మహర్షి’ సినిమాలకు కూడా ఇలాగే ఇంటరాక్షన్ పెట్టుకొని పోస్ట్ రిలీజ్ ఆ సినిమాలను మళ్ళీ ప్రమోట్ చేశాడు మహేష్. ‘భరత్ అనే నేను’ పోస్ట్ ప్రమోషన్ కోసం అప్పట్లో కేటీఆర్ ని తీసుకొచ్చారు. ‘మహర్షి’ కి రైతులు, ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ ఇంటరాక్షన్ కి యూట్యూబర్స్ కం ఫ్యాన్స్.

ఏదేమైనా సినిమా రిలీజ్ తర్వాత స్టార్ హీరోలు దాన్ని పెద్దగా పట్టించుకోరు. టీం ఇన్వైట్ చేస్తే సక్సెస్ మీట్ కి వచ్చి నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు. కానీ ఓ స్టార్ హీరో ఇలా రిలీజ్ తర్వాత డ్రాప్ అవుతున్న బుకింగ్స్ ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ పబ్లిసిటీ చేయడం అంటే అది ఒక్క మహేష్ కే చెల్లింది. మరి మహేష్ మళ్ళీ రంగంలో దిగి సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు కనుక ప్రేక్షకుల చూపు ఆకట్టుకొని బుకింగ్స్ జోరందుకునే అవకాశం ఉంది.

This post was last modified on May 21, 2022 9:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

37 minutes ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

2 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

3 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

3 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

5 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

6 hours ago