Movie News

మహేష్ మళ్ళీ రంగంలోకి దిగాడు

‘సర్కారు వారి పాట’ బుకింగ్స్ కొద్దిగా డ్రాప్ అయ్యాయి. టీంతో పాటు మహేష్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ అన్నట్టుగా చెప్పుకున్నారు. కానీ గ్రౌండ్ కెళ్ళి చూస్తే సినిమా ఆ రేంజ్ హిట్ సాధించలేదు. తాజాగా సినిమా రిలీజై పది రోజులు గడవకుండానే తెలంగాణాలో మోస్తరుగా బుకింగ్స్ పడిపోయాయి. ఇక ఆంధ్రాలో కూడా ఫుల్స్ పడట్లేదు. 40 , 50 పర్సెంట్ మాత్రమే థియేటర్స్ ఫిల్ అవుతున్నాయి. ఈ క్రమంలో మళ్ళీ మహేష్ రంగంలోకి దిగాడు.

ఫ్యాన్స్ మీట్ అంటూ సినిమా గురించి ఓ ఇంటరాక్షన్ పెట్టుకున్నాడు. కీర్తి , పరశురాం కూడా పాల్గొన్నారు. అక్కడ ఫ్యాన్స్ సినిమా గురించి, మహేష్ అందం గురించి కన్వర్షన్ జరిగింది. ఆ వీడియోని తాజాగా మీడియాకిచ్చి డ్రాప్ అవుతున్న బుకింగ్ ని మళ్ళీ లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక మహేష్ రిలీజ్ కి ముందు సినిమా ప్రమోషన్స్ లో ఎంత చురుగ్గా పాల్గొంటాడో రిలీజ్ తర్వాత కూడా అంతే ఉత్సాహంతో పార్టిసిపెంట్ చేస్తాడు.

‘భరత్ అనే నేను’,మహర్షి’ సినిమాలకు కూడా ఇలాగే ఇంటరాక్షన్ పెట్టుకొని పోస్ట్ రిలీజ్ ఆ సినిమాలను మళ్ళీ ప్రమోట్ చేశాడు మహేష్. ‘భరత్ అనే నేను’ పోస్ట్ ప్రమోషన్ కోసం అప్పట్లో కేటీఆర్ ని తీసుకొచ్చారు. ‘మహర్షి’ కి రైతులు, ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ ఇంటరాక్షన్ కి యూట్యూబర్స్ కం ఫ్యాన్స్.

ఏదేమైనా సినిమా రిలీజ్ తర్వాత స్టార్ హీరోలు దాన్ని పెద్దగా పట్టించుకోరు. టీం ఇన్వైట్ చేస్తే సక్సెస్ మీట్ కి వచ్చి నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు. కానీ ఓ స్టార్ హీరో ఇలా రిలీజ్ తర్వాత డ్రాప్ అవుతున్న బుకింగ్స్ ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ పబ్లిసిటీ చేయడం అంటే అది ఒక్క మహేష్ కే చెల్లింది. మరి మహేష్ మళ్ళీ రంగంలో దిగి సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు కనుక ప్రేక్షకుల చూపు ఆకట్టుకొని బుకింగ్స్ జోరందుకునే అవకాశం ఉంది.

This post was last modified on May 21, 2022 9:04 pm

Share

Recent Posts

`అయోధ్య‌`కు రాజ‌కీయ గ్ర‌హ‌ణం వీడిన‌ట్టేనా?!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత రామ‌జ‌న్మ‌భూమి అయోధ్యలో ఉన్న బాల‌రామ‌య్య ఆల‌యానికి రాజ‌కీయ గ్ర‌హ‌ణం వీడిన‌ట్టేనా? ఇక‌, ఆల‌యానికి రాజకీయ ప్ర‌భావం,…

1 hour ago

సూర్య ఛెప్పిన కార్తి ‘పొటాటో చిప్స్’ కథ

సౌత్ ఇండియన్ సినిమాలో మోస్ట్ సెలబ్రేటెడ్ సినీ బ్రదర్స్‌లో సూర్య-కార్తి ద్వయం ముందు వరుసలో ఉంటుంది. వీళ్లిద్దరూ తండ్రి శివకుమార్…

2 hours ago

హీరో దర్శకత్వపు కల… అదెప్పుడు నెరవేరునో

టాలీవుడ్ కామెడీని కొత్త పుంతలు తొక్కించిన వాళ్ళలో జంధ్యాల, రేలంగి నరసింహరావు, సింగీతం శ్రీనివాసరావు తర్వాత ఈవివి సత్యనారాయణ తనకంటూ…

4 hours ago

సాక్షిలో రెండో పేజీకి చేరిన రాజన్న

ఇవ్వాళ సెప్టెంబర్ 2 వ తేదీ. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం 2009 సెప్టెంబర్…

4 hours ago

తెలంగాణా బీజేపీలో కారు లొల్లి

తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…

5 hours ago

ఓజి యునివర్స్ ఊహించనంత పెద్దగా

ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2.…

6 hours ago