ఈసారి కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో చాలామంది ఇండియన్ హీరోయిన్లు పాల్గొన్నారు. ఐతే కేన్స్కు బాగా అలవాటు పడ్డ ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొనే లాంటి బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లను మించి.. పూజా హెగ్డే బాగా హైలైట్ అయిందక్కడ. తనదైన అందం, స్టైలింగ్, ప్రెజెన్స్తో పూజా అందరి చూపులనూ కట్టిపడేసింది. ఇదంతా చూసి పూజా ప్రిపరేషన్ సూపర్ అని అందరూ కొనియాడారు.
కానీ వాస్తవం ఏంటంటే.. కేన్స్కు వెళ్లే ముందు పూజాకు చేదు అనుభవం ఎదురైందట. ఆమె సన్నాహాలపై తీవ్ర ప్రభావం పడిందట. ఇండియా నుంచి రెండు బ్యాగులు తీసుకుని కేన్స్కు బయల్దేరగా.. ఎయిర్ పోర్టులో అభ్యంతరం చెప్పడం వల్ల ఒక బ్యాగ్ ఇక్కడే పెట్టేయాల్సి వచ్చిందట. ఇంకో బ్యాగ్తో విమానం ఎక్కగా.. ప్రయాణ మార్గంలో అది కూడా పోయిందట. దీంతో కేన్స్లో తళుక్కుమనేందుకు వెంట తెచ్చుకున్న వస్తువులేవీ లేకుండా ఉత్త చేతులతో నిలబడాల్సి వచ్చిందట పూజా.
ఫ్రాన్స్లో తాను పోగొట్టుకున్న బ్యాగులోనే బట్టలు, మేకప్, ఇతర సామగ్రి అన్నీ ఉన్నాయని.. ఇదంతా తాను రెడ్ కార్పెట్ మీద నడవడానికి కొన్ని గంటల ముందు జరిగిందని పూజా వెల్లడించింది.
జరిగిందాని పట్ల ఏడవడానికి కూడా టైం లేదని.. అప్పుడేం చేయాలో అర్థం కాలేదని.. ఐతే తన టీం సహకారంతో తేరుకున్నానని.. వెంటనే షాపింగ్ చేసి కేన్స్ కోసం కొత్త డ్రెస్ కొన్నానని.. తన టీం సభ్యులు మేకప్, ఇతర సామగ్రి అంతా తీసుకొచ్చారని.. జువెలరీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడం వల్ల మంచిదైదని.. మొత్తంగా అప్పటికప్పుడు సమకూర్చుకున్న వాటితోనే రెడీ అయి కేన్స్ ఫిలిం ఫెస్టివల్కు వెళ్లి రెడ్ కార్పెట్ మీద నడిచానని.. అక్కడ మంచి స్పందన రావడంతో హమ్మయ్య అనుకున్నానని పూజా వెల్లడించింది. ఈ హడావుడి వల్ల ఒక రోజంతా ఏమీ తినలేదని.. రెడ్ కార్పెట్ వాక్ తర్వాత తనతో పాటు టీం అంతా కలిసి డిన్నర్ చేసిందని, వాళ్లు అందించిన మద్దతును ఎప్పటికీ మరిచిపోలేనని పూజా తెలిపింది.
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…