ఈసారి కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో చాలామంది ఇండియన్ హీరోయిన్లు పాల్గొన్నారు. ఐతే కేన్స్కు బాగా అలవాటు పడ్డ ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొనే లాంటి బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లను మించి.. పూజా హెగ్డే బాగా హైలైట్ అయిందక్కడ. తనదైన అందం, స్టైలింగ్, ప్రెజెన్స్తో పూజా అందరి చూపులనూ కట్టిపడేసింది. ఇదంతా చూసి పూజా ప్రిపరేషన్ సూపర్ అని అందరూ కొనియాడారు.
కానీ వాస్తవం ఏంటంటే.. కేన్స్కు వెళ్లే ముందు పూజాకు చేదు అనుభవం ఎదురైందట. ఆమె సన్నాహాలపై తీవ్ర ప్రభావం పడిందట. ఇండియా నుంచి రెండు బ్యాగులు తీసుకుని కేన్స్కు బయల్దేరగా.. ఎయిర్ పోర్టులో అభ్యంతరం చెప్పడం వల్ల ఒక బ్యాగ్ ఇక్కడే పెట్టేయాల్సి వచ్చిందట. ఇంకో బ్యాగ్తో విమానం ఎక్కగా.. ప్రయాణ మార్గంలో అది కూడా పోయిందట. దీంతో కేన్స్లో తళుక్కుమనేందుకు వెంట తెచ్చుకున్న వస్తువులేవీ లేకుండా ఉత్త చేతులతో నిలబడాల్సి వచ్చిందట పూజా.
ఫ్రాన్స్లో తాను పోగొట్టుకున్న బ్యాగులోనే బట్టలు, మేకప్, ఇతర సామగ్రి అన్నీ ఉన్నాయని.. ఇదంతా తాను రెడ్ కార్పెట్ మీద నడవడానికి కొన్ని గంటల ముందు జరిగిందని పూజా వెల్లడించింది.
జరిగిందాని పట్ల ఏడవడానికి కూడా టైం లేదని.. అప్పుడేం చేయాలో అర్థం కాలేదని.. ఐతే తన టీం సహకారంతో తేరుకున్నానని.. వెంటనే షాపింగ్ చేసి కేన్స్ కోసం కొత్త డ్రెస్ కొన్నానని.. తన టీం సభ్యులు మేకప్, ఇతర సామగ్రి అంతా తీసుకొచ్చారని.. జువెలరీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడం వల్ల మంచిదైదని.. మొత్తంగా అప్పటికప్పుడు సమకూర్చుకున్న వాటితోనే రెడీ అయి కేన్స్ ఫిలిం ఫెస్టివల్కు వెళ్లి రెడ్ కార్పెట్ మీద నడిచానని.. అక్కడ మంచి స్పందన రావడంతో హమ్మయ్య అనుకున్నానని పూజా వెల్లడించింది. ఈ హడావుడి వల్ల ఒక రోజంతా ఏమీ తినలేదని.. రెడ్ కార్పెట్ వాక్ తర్వాత తనతో పాటు టీం అంతా కలిసి డిన్నర్ చేసిందని, వాళ్లు అందించిన మద్దతును ఎప్పటికీ మరిచిపోలేనని పూజా తెలిపింది.
This post was last modified on May 21, 2022 7:02 am
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…