ఒక సినిమా తీసి దాన్ని విడుదల చేసే క్రమంలో ప్రమోషన్ ఎంత కీలక పాత్ర పోషిస్తుందో చూస్తున్నాం. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ దేశమంతా తిరగాల్సి వచ్చింది. మహేష్ బాబు మొదటిసారి స్టేజి మీద డాన్స్ చేసే భాగ్యం కలిగించింది. తారలు థియేటర్లు షాపింగ్ మాళ్లు స్వయంగా చుట్టేసి మరీ ప్రచారం చేస్తున్నారు. అలాంటిది ఏ మాత్రం బజ్ లేని ఒక చిన్న మూవీని రిలీజ్ చేస్తున్నప్పుడు అది వచ్చిందన్న సంగతి ప్రేక్షకులకు తెలిసేలా ఏదో ఒకటి చేయాలి. లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం.
కొద్దోగొప్పో మంచి క్యాస్టింగ్ ఉన్న శేఖర్ కే మొదటి రోజు ఓపెనింగ్స్ లేవు. అలాంటిది దానికి పోటీగా వచ్చిన డేగల బాబ్జీని పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. తమిళంలో మంచి విజయం సాధించి పార్తీబన్ కు నేషనల్ అవార్డు తీసుకొచ్చిన ఉత్త సెరిప్పు సైజ్ 7 అఫీషియల్ రీమేక్ ఇది. ఇందులో ఆయన తప్ప వేరే ఆర్టిస్టులు ఉండరు. కేవలం డబ్బింగ్ రూపంలో గొంతులు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి. అక్కడ కమర్షియల్ గానూ దాని బడ్జెట్ కు తగ్గట్టు బాగానే ఆడింది. మరి మన నిర్మాతలు తెలుగులో ఏ నమ్మకంతో ఆడుతుందని తీసుకొచ్చారో బండ్ల గణేష్ ని ఒప్పించేసి మొత్తానికి చకచకా షూటింగ్ పూర్తి చేసి హాలు దాకా తెచ్చారు.
కానీ కనీస ప్రచారం లేకపోవడంతో డేగల బాబ్జీ వసూళ్లు నామమాత్రంగా వచ్చాయి. స్క్రీన్లు కూడా అంతంత మాత్రంగా దక్కాయి. కొన్ని జిల్లా కేంద్రాల్లో అసలు రిలీజ్ కూడా కాలేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు సపోర్ట్ చేస్తారనుకుంటే అదీ జరగలేదు. అయినా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో మసాలా స్పీచులు ఇచ్చినంత మాత్రాన పొలోమని మొదటిరోజే వచ్చేస్తారా. దీనికి తోడు చూసిన కొద్దోగొప్పో ఆడియన్స్ కూడా పెదవి విరుస్తున్నారు. ఏదో ఓటిటి అంటే ఓకే కానీ ఇలా బండ్లన్నని సోలోగా అంతసేపు బిగ్ స్క్రీన్ మీద చూడలేకపోయామంటున్నారు.
This post was last modified on May 21, 2022 6:39 am
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…