ఏడు అడుగులు నడిచి.. మంత్రోచ్ఛారణ మధ్య ఒకటైన జంట.. జీవితంలో తమకు ఎదురైన సవాళ్లను ఎదుర్కొని.. జంటగా జీవితాన్ని సాగించాలన్నది పాత చింతకాయ పచ్చడిగా మారటమే కాదు.. పెళ్లి చేసుకున్నామా? ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయా? విడిపోదామంతే.. అన్నట్లుగా ఇప్పుడు పరిస్థితి మారింది. మధ్యతరగతి వర్గాలతో పోలిస్తే.. ఎగువ మధ్యతరగతి వర్గాల్లో ఈ తీరు ఎక్కువగా ఉంది. ఇక.. గ్లామర్ ఇండస్ట్రీలో ఇది చాలా రోటీన్ వ్యవహారంగా మారింది. బాలీవుడ్ లో ఈ కల్చర్ ఎప్పటి నుంచో ఉన్నా.. ఇటీవల కాలంలో అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తరచూ ఏదో ఒక జంట విడిపోవటం.. మళ్లీ పెళ్లి చేసుకోవటం లాంటివి పరిపాటిగా మారిందని చెప్పాలి. తాజాగా బాలీవుడ్ కు చెందిన మరో జంట విడాకుల బాట పట్టింది.
బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ (అమీర్ ఖాన్ మేనల్లుడు) ఆయన సతీమణి అవంతిక మాలిక్ తో విడిపోయేందుకు సిద్ధమయ్యారు. దాదాపు ఎనిమిదేళ్లు ప్రేమించుకొని.. పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఏడేళ్ల ‘ఇమారా’ అనే కుమార్తె ఉంది. భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తటంతో పరస్పర అంగీకారంతో వారు విడిపోతున్నట్లుగా చెబుతున్నారు. 2008లో జానే తు యా జానే నా మూవీలో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఇమ్రాన్ తర్వాతి కాలంలో పలు సినిమాల్లో నటించాడు. అతడి చివరి సినిమా కట్టి బట్టి 2015లో విడుదలైంది. ఆ తర్వాత నుంచి అతడు సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.
ప్రేమించిన అవంతికను 2011లో పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. పెళ్లైన కొంతకాలం వారి వైవాహిక జీవితం సాఫీగా సాగినా.. ఆ తర్వాత విభేదాలు తలెత్తటంతో వారు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో సన్నిహితులు.. బంధువులు వీరిని కలిపేందుకు ఎంతగా ప్రయత్నించిన కుదర్లేదంటారు. సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వీరు 2019 నుంచి విడివిడిగా ఉన్నట్లు చెబుతున్నారు. తాజాగా వీరు విడాకులకు సిద్ధమైనట్లుగా చెబుతున్నారు.
This post was last modified on May 20, 2022 10:45 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…