రేపు తారక్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ 30 అనౌన్స్ చేస్తూ వదిలిన చిన్న వీడియో బైట్ ఆన్ లైన్ లో ట్రెండ్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ వెయ్యి కోట్లు వసూలు చేసిన ఇండస్ట్రీ హిట్ అయినా విజయాన్ని చరణ్ తో పంచుకోవాల్సి రావడంతో తారక్ ఫ్యాన్స్ సోలో మూవీ కోసం ఎదురు చూస్తున్నారు.
చిరంజీవి చరణ్ కాంబోలో భారీ అంచనాలతో ఆచార్య బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ రూపంలో దారుణంగా నిరాశ పరిచినప్పటికీ జనతా గ్యారేజ్ కాంబినేషన్ కావడంతో ఈసారి కొరటాల శివ ఎలాంటి పొరపాటు చేయరనే ధీమాతో ఉన్నారు.
కాకపోతే ఇప్పుడు వదిలిన ప్రోమో, బ్యాక్ గ్రౌండ్ సెటప్ అంతా చూస్తుంటే గతంలో అల్లు అర్జున్ తో చేయబోతూ అఫీషియల్ గా ప్రకటించాక డ్రాప్ అయిన ప్రాజెక్టే గుర్తొస్తోంది. జూనియర్ గొంతులో మంచి పవర్ ఫుల్ డైలాగు కూడా చెప్పించారు. అవసరానికి మించిన ధైర్యం, అవసరమైనప్పుడు భయం రావడం గురించి బలమైన సంభాషణే ఉంది. టైటిల్ రివీల్ చేయలేదు కానీ చేతిలో ఆయుధాలతో సముద్రం, లైట్ హౌస్, ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు మొత్తానికి సెటప్ మాత్రం ఆసక్తికరంగా ఉంది.
అప్పుడు కారణాలు ఏవైనా బన్నీ తీసుకున్న నిర్ణయం కరెక్టో కాదో ఈ సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది. అనిరుద్ రవిచందర్ సంగీతం, రత్నవేలు ఛాయాగ్రహణం, సాబు సిరిల్ సౌండ్ డిజైన్ మొత్తానికి ప్యాన్ ఇండియా లెవెల్ లో ఉండాల్సిన టీమ్ ని పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్న కొరటాల శివ తన మీద పడ్డ ఆచార్య మరకను తుడుచుకోవాలంటే దీన్ని బ్లాక్ బస్టర్ చేసే తీరాలి. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్న ఈ క్రేజీ మూవీకి హీరోయిన్ కోసం ఇద్దరు బాలీవుడ్ ఆప్షన్స్ ని చూస్తున్నారు. ఇంకా ఫైనల్ కాలేదు.
This post was last modified on May 20, 2022 7:37 am
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…