తమ కుటుంబ సభ్యుల గురించి సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నటి, దర్శకురాలు జీవిత రాజశేఖర్. ముఖ్యంగా తన కూతుళ్ల గురించి యూట్యూబ్లో దారుణమైన థంబ్ నైల్స్ పెడుతున్నారని ఆమె మండిపడ్డారు. “మా మీద వచ్చినన్ని వార్తలు ఇంకెవరి మీదా రావేమో. మొన్నా మధ్య నా కూతురు బాయ్ ఫ్రెండ్తో దుబాయ్కి వెళ్లిందని తప్పుడు ప్రచారం చేశారు. ఒకసారి శివాత్మిక అంటారు. ఇంకోసారి శివాని పేరు తెస్తారు. ప్రియుడితో పారిపోయిందని రాస్తారు.. యూట్యూబ్లో ఏదో థంబ్ నైల్ పెడతారు. వార్తల్లోనూ ఏదో హెడ్డింగ్ ఉంటుంది. తీరా ఓపెన్ చేసి చూస్తే అక్కడున్న మేటర్కి, టైటిల్కి సంబంధం ఉండదు. మా కుటుంబం అంతా కలిసి దుబాయికి వెళ్తే.. మా అమ్మాయి తన లవర్తో దుబాయ్కి వెళ్లిందని రాస్తారు. ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తే చాలా జీవితాలు ప్రభావితం అవుతాయి” అని జీవిత వ్యాఖ్యానించారు.
తన దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన ‘శేఖర్’ విడుదల నేపథ్యంలో మీడియాను కలిసిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘గరుడవేగ’ సినిమాకు సంబంధించిన ఆర్థిక వివాదం గురించి మీడియా వాళ్లు అడగ్గా.. ఆ వ్యవహారం కోర్టులో ఉందని, కానీ ఈలోపే తమ గురించి ఏదేదో రాసేస్తున్నారని.. నిజంగా తాము తప్పు చేశామంటే రోడ్డు మీద నిలబెట్టినా భరిస్తామని.. కానీ నిజాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేయొద్దని ఆమె కోరారు.
‘శేఖర్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఒక కులాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన నేపథ్యంలో జీవిత స్పందించారు. తాను ఒకలా చెబితే జనాలు మరోలా అర్థం చేసుకున్నారని.. ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని జీవిత అన్నారు. తన కూతురు డబ్బుల విషయంలో అస్సలు రాజీ పడదని చెబుతూ.. “కోమటిదాని లెక్క” అనే మాటను ‘శేఖర్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో జీవిత వాడడం దుమారం రేపి, ఆర్యవైశ్యుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
This post was last modified on May 19, 2022 5:24 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…