తమ కుటుంబ సభ్యుల గురించి సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నటి, దర్శకురాలు జీవిత రాజశేఖర్. ముఖ్యంగా తన కూతుళ్ల గురించి యూట్యూబ్లో దారుణమైన థంబ్ నైల్స్ పెడుతున్నారని ఆమె మండిపడ్డారు. “మా మీద వచ్చినన్ని వార్తలు ఇంకెవరి మీదా రావేమో. మొన్నా మధ్య నా కూతురు బాయ్ ఫ్రెండ్తో దుబాయ్కి వెళ్లిందని తప్పుడు ప్రచారం చేశారు. ఒకసారి శివాత్మిక అంటారు. ఇంకోసారి శివాని పేరు తెస్తారు. ప్రియుడితో పారిపోయిందని రాస్తారు.. యూట్యూబ్లో ఏదో థంబ్ నైల్ పెడతారు. వార్తల్లోనూ ఏదో హెడ్డింగ్ ఉంటుంది. తీరా ఓపెన్ చేసి చూస్తే అక్కడున్న మేటర్కి, టైటిల్కి సంబంధం ఉండదు. మా కుటుంబం అంతా కలిసి దుబాయికి వెళ్తే.. మా అమ్మాయి తన లవర్తో దుబాయ్కి వెళ్లిందని రాస్తారు. ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తే చాలా జీవితాలు ప్రభావితం అవుతాయి” అని జీవిత వ్యాఖ్యానించారు.
తన దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన ‘శేఖర్’ విడుదల నేపథ్యంలో మీడియాను కలిసిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘గరుడవేగ’ సినిమాకు సంబంధించిన ఆర్థిక వివాదం గురించి మీడియా వాళ్లు అడగ్గా.. ఆ వ్యవహారం కోర్టులో ఉందని, కానీ ఈలోపే తమ గురించి ఏదేదో రాసేస్తున్నారని.. నిజంగా తాము తప్పు చేశామంటే రోడ్డు మీద నిలబెట్టినా భరిస్తామని.. కానీ నిజాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేయొద్దని ఆమె కోరారు.
‘శేఖర్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఒక కులాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన నేపథ్యంలో జీవిత స్పందించారు. తాను ఒకలా చెబితే జనాలు మరోలా అర్థం చేసుకున్నారని.. ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని జీవిత అన్నారు. తన కూతురు డబ్బుల విషయంలో అస్సలు రాజీ పడదని చెబుతూ.. “కోమటిదాని లెక్క” అనే మాటను ‘శేఖర్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో జీవిత వాడడం దుమారం రేపి, ఆర్యవైశ్యుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
This post was last modified on May 19, 2022 5:24 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…