తమ కుటుంబ సభ్యుల గురించి సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నటి, దర్శకురాలు జీవిత రాజశేఖర్. ముఖ్యంగా తన కూతుళ్ల గురించి యూట్యూబ్లో దారుణమైన థంబ్ నైల్స్ పెడుతున్నారని ఆమె మండిపడ్డారు. “మా మీద వచ్చినన్ని వార్తలు ఇంకెవరి మీదా రావేమో. మొన్నా మధ్య నా కూతురు బాయ్ ఫ్రెండ్తో దుబాయ్కి వెళ్లిందని తప్పుడు ప్రచారం చేశారు. ఒకసారి శివాత్మిక అంటారు. ఇంకోసారి శివాని పేరు తెస్తారు. ప్రియుడితో పారిపోయిందని రాస్తారు.. యూట్యూబ్లో ఏదో థంబ్ నైల్ పెడతారు. వార్తల్లోనూ ఏదో హెడ్డింగ్ ఉంటుంది. తీరా ఓపెన్ చేసి చూస్తే అక్కడున్న మేటర్కి, టైటిల్కి సంబంధం ఉండదు. మా కుటుంబం అంతా కలిసి దుబాయికి వెళ్తే.. మా అమ్మాయి తన లవర్తో దుబాయ్కి వెళ్లిందని రాస్తారు. ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తే చాలా జీవితాలు ప్రభావితం అవుతాయి” అని జీవిత వ్యాఖ్యానించారు.
తన దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన ‘శేఖర్’ విడుదల నేపథ్యంలో మీడియాను కలిసిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘గరుడవేగ’ సినిమాకు సంబంధించిన ఆర్థిక వివాదం గురించి మీడియా వాళ్లు అడగ్గా.. ఆ వ్యవహారం కోర్టులో ఉందని, కానీ ఈలోపే తమ గురించి ఏదేదో రాసేస్తున్నారని.. నిజంగా తాము తప్పు చేశామంటే రోడ్డు మీద నిలబెట్టినా భరిస్తామని.. కానీ నిజాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేయొద్దని ఆమె కోరారు.
‘శేఖర్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఒక కులాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన నేపథ్యంలో జీవిత స్పందించారు. తాను ఒకలా చెబితే జనాలు మరోలా అర్థం చేసుకున్నారని.. ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని జీవిత అన్నారు. తన కూతురు డబ్బుల విషయంలో అస్సలు రాజీ పడదని చెబుతూ.. “కోమటిదాని లెక్క” అనే మాటను ‘శేఖర్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో జీవిత వాడడం దుమారం రేపి, ఆర్యవైశ్యుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…