తమ కుటుంబ సభ్యుల గురించి సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నటి, దర్శకురాలు జీవిత రాజశేఖర్. ముఖ్యంగా తన కూతుళ్ల గురించి యూట్యూబ్లో దారుణమైన థంబ్ నైల్స్ పెడుతున్నారని ఆమె మండిపడ్డారు. “మా మీద వచ్చినన్ని వార్తలు ఇంకెవరి మీదా రావేమో. మొన్నా మధ్య నా కూతురు బాయ్ ఫ్రెండ్తో దుబాయ్కి వెళ్లిందని తప్పుడు ప్రచారం చేశారు. ఒకసారి శివాత్మిక అంటారు. ఇంకోసారి శివాని పేరు తెస్తారు. ప్రియుడితో పారిపోయిందని రాస్తారు.. యూట్యూబ్లో ఏదో థంబ్ నైల్ పెడతారు. వార్తల్లోనూ ఏదో హెడ్డింగ్ ఉంటుంది. తీరా ఓపెన్ చేసి చూస్తే అక్కడున్న మేటర్కి, టైటిల్కి సంబంధం ఉండదు. మా కుటుంబం అంతా కలిసి దుబాయికి వెళ్తే.. మా అమ్మాయి తన లవర్తో దుబాయ్కి వెళ్లిందని రాస్తారు. ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తే చాలా జీవితాలు ప్రభావితం అవుతాయి” అని జీవిత వ్యాఖ్యానించారు.
తన దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన ‘శేఖర్’ విడుదల నేపథ్యంలో మీడియాను కలిసిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘గరుడవేగ’ సినిమాకు సంబంధించిన ఆర్థిక వివాదం గురించి మీడియా వాళ్లు అడగ్గా.. ఆ వ్యవహారం కోర్టులో ఉందని, కానీ ఈలోపే తమ గురించి ఏదేదో రాసేస్తున్నారని.. నిజంగా తాము తప్పు చేశామంటే రోడ్డు మీద నిలబెట్టినా భరిస్తామని.. కానీ నిజాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేయొద్దని ఆమె కోరారు.
‘శేఖర్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఒక కులాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన నేపథ్యంలో జీవిత స్పందించారు. తాను ఒకలా చెబితే జనాలు మరోలా అర్థం చేసుకున్నారని.. ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని జీవిత అన్నారు. తన కూతురు డబ్బుల విషయంలో అస్సలు రాజీ పడదని చెబుతూ.. “కోమటిదాని లెక్క” అనే మాటను ‘శేఖర్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో జీవిత వాడడం దుమారం రేపి, ఆర్యవైశ్యుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
This post was last modified on May 19, 2022 5:24 pm
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయాలపై జనసేన పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ నాగబాబుకు ఇంకా మక్కువ పోలేదని…
సాధారణంగా జనావాసాలు ఉండే నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆయా కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది…
పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అని చెప్పుకోదగ్గ సినిమాల్లో తొలిప్రేమ స్థానం చాలా ప్రత్యేకం. అప్పట్లో…
తమిళనాడు ఎన్నికల తేదీ వచ్చేయడంతో కోలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్ల ప్రకటనలు ఊపందుకోబోతున్నాయి. స్థానిక రాజకీయా పార్టీల ప్రాబల్యం తీవ్రంగా…
ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజై రెండు నెలలు దాటేసింది. ఓటిటిలో వచ్చింది. శాటిలైట్ లోనూ అదరగొట్టింది. కానీ ఇప్పటిదాకా చిరంజీవి…