Movie News

నాకు 60 థియేటర్స్ మాత్రమే ఉన్నాయి

డిస్ట్రిబ్యూషన్ రంగం నుండి అగ్ర నిర్మాతగా ఎదిగిన దిల్ రాజు నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. బడా సినిమాల రిలీజ్ విషయంలోనూ టికెట్ ఇష్యూ లోనో ఇలా ఏదొక మేటర్ లో రాజు గారి పేరు ఎక్కువగా వినబడుతుంది. ఇటివలే బడా సినిమాలకు సంబంధించి టికెట్ రేట్ పెరగడానికి దిల్ రాజే కారణమంటూ అందరూ మాట్లాడుకున్నారు. ఇక ప్రతీ సారి దిల్ రాజే చేశాడంటూ గ్రౌండ్ తెలియకుండా తన గురించి నెగిటివ్ గా మాట్లాడుకోవడం అస్సలు నచ్చట్లేదని చెప్పుకున్నారు దిల్ రాజు.

తాజాగా F3 ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన దిల్ రాజు తనకి నైజాంలో కేవలం అరవై థియేటర్స్ మాత్రమే ఉన్నాయని ఇవి తెలియకుండా నైజాం థియేటర్స్ అన్నీ రాజు కిందే ఉన్నాయని చెప్పుకోవడం తప్పని అన్నారు. ఇక టికెట్ రేటు పెరగడం వెనుక చాలా మంది ఉంటారని ముఖ్యంగా ఆ సినిమా నిర్మాత మీదే టికెట్ రేటు పెంచడం తగ్గించడం అనేది ఉంటుందని డిస్ట్రి బ్యూటర్ గా తన పాత్ర చాలా తక్కువని చెప్పుకున్నారు.

ఇక F3 లాంటి క్రేజీ ప్రాజెక్ట్ ను పెట్టుకొని సాధారణ టికెట్ రేటుకే సినిమా చూపించడానికి రీజన్ ఉందని, ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి సినిమా చూడాలని అలాగే టికెట్ రేటు పెరగడం ఇండస్ట్రీకి కూడా ఎఫెక్ట్ అవుతుందని ఇలాగే చూస్తూ ఉంటే డేంజర్ జోన్ లోకి వెళ్లిపోతామని అందుకే ముందుగా తనే ఈ నిర్ణయం తీసుకొని ముందడుగు వేశానని తెలిపారు. అలాగే ఎవరైనా నిర్మాత నేను డిస్ట్రి బ్యూట్ చేసే సినిమాల రేటు పెంచమని అడిగేందుకు వీలు లేకుండా చేసే ప్రయత్నమిదని అన్నారు. ఏదేమైనా సినిమా ప్రమోషన్స్ లో సినిమా గురించి కాకుండా తనను తిట్టుకుంటూ ప్రతీ సారి బురద జల్లే వారి మీద తన ఫ్రస్ట్రేషన్ చూపించారు దిల్ రాజు.

This post was last modified on May 19, 2022 5:19 pm

Share

Recent Posts

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

36 minutes ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

38 minutes ago

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

2 hours ago

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

3 hours ago

గుంటూరు మేయర్ సీటు ఎవరికి

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…

3 hours ago

వైసీపీ ఇలా చేస్తే.. విజ‌య‌వాడ మొత్తం టీడీపీదే..!

వ్యూహాల క‌లిమి.. నాయ‌కుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవ‌స‌రం. ఈ విష‌యంలో వైసీపీ చేస్తున్న వ్వ‌వ‌హారం.. పార్టీని దుంప‌నాశ‌నం…

3 hours ago