డిస్ట్రిబ్యూషన్ రంగం నుండి అగ్ర నిర్మాతగా ఎదిగిన దిల్ రాజు నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. బడా సినిమాల రిలీజ్ విషయంలోనూ టికెట్ ఇష్యూ లోనో ఇలా ఏదొక మేటర్ లో రాజు గారి పేరు ఎక్కువగా వినబడుతుంది. ఇటివలే బడా సినిమాలకు సంబంధించి టికెట్ రేట్ పెరగడానికి దిల్ రాజే కారణమంటూ అందరూ మాట్లాడుకున్నారు. ఇక ప్రతీ సారి దిల్ రాజే చేశాడంటూ గ్రౌండ్ తెలియకుండా తన గురించి నెగిటివ్ గా మాట్లాడుకోవడం అస్సలు నచ్చట్లేదని చెప్పుకున్నారు దిల్ రాజు.
తాజాగా F3 ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన దిల్ రాజు తనకి నైజాంలో కేవలం అరవై థియేటర్స్ మాత్రమే ఉన్నాయని ఇవి తెలియకుండా నైజాం థియేటర్స్ అన్నీ రాజు కిందే ఉన్నాయని చెప్పుకోవడం తప్పని అన్నారు. ఇక టికెట్ రేటు పెరగడం వెనుక చాలా మంది ఉంటారని ముఖ్యంగా ఆ సినిమా నిర్మాత మీదే టికెట్ రేటు పెంచడం తగ్గించడం అనేది ఉంటుందని డిస్ట్రి బ్యూటర్ గా తన పాత్ర చాలా తక్కువని చెప్పుకున్నారు.
ఇక F3 లాంటి క్రేజీ ప్రాజెక్ట్ ను పెట్టుకొని సాధారణ టికెట్ రేటుకే సినిమా చూపించడానికి రీజన్ ఉందని, ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి సినిమా చూడాలని అలాగే టికెట్ రేటు పెరగడం ఇండస్ట్రీకి కూడా ఎఫెక్ట్ అవుతుందని ఇలాగే చూస్తూ ఉంటే డేంజర్ జోన్ లోకి వెళ్లిపోతామని అందుకే ముందుగా తనే ఈ నిర్ణయం తీసుకొని ముందడుగు వేశానని తెలిపారు. అలాగే ఎవరైనా నిర్మాత నేను డిస్ట్రి బ్యూట్ చేసే సినిమాల రేటు పెంచమని అడిగేందుకు వీలు లేకుండా చేసే ప్రయత్నమిదని అన్నారు. ఏదేమైనా సినిమా ప్రమోషన్స్ లో సినిమా గురించి కాకుండా తనను తిట్టుకుంటూ ప్రతీ సారి బురద జల్లే వారి మీద తన ఫ్రస్ట్రేషన్ చూపించారు దిల్ రాజు.
This post was last modified on May 19, 2022 5:19 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…