ప్రస్తుతం సర్కారు వారి పాట ఫలితాన్ని ఆస్వాదిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ సెట్లో అడుగు పెట్టాల్సి ఉంటుంది. స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధంగా ఉంది. హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. తమన్ స్వరాలు సమకూర్చే బాధ్యతను తీసుకున్నాడు. అతడు లాంటి ఎవర్ గ్రీన్ సూపర్ హిట్, ఖలేజా లాంటి క్లాసిక్ మెమరీ ఇచ్చిన కాంబినేషన్ కావడంతో అభిమానుల అంచనాలు మాములుగా లేవు. అందులోనూ అల వైకుంఠపురములో తర్వాత వస్తున్న త్రివిక్రమ్ మూవీ ఇది.
లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇందులో మరో హీరోకి స్కోప్ ఉందట. ఏదో సుశాంత్ తరహాలో చిన్నది కాకుండా చెప్పుకోదగ్గ ప్రాధాన్యత ఉంటుందని వినికిడి. దీనికి గాను ఇద్దరు ముగ్గురితో సంప్రదింపులు జరుగుతున్నాయట. అందులో మొదటి పేరు న్యాచురల్ స్టార్ నానిది వినిపిస్తోంది. తన క్యారెక్టర్ నచ్చితే మల్టీ స్టారర్ చేసేందుకు నాని మొహమాట పడడు. అందుకే నాగార్జునతో దేవదాస్ సాధ్యమయ్యింది. పైగా ఇది మాటల మాంత్రికుడి సినిమా. తనను ఎలా వాడుకోవాలో ఆయనకు బాగా తెలుసనే నమ్మకం ఉంటుంది.
అయితే ఇదంతా ప్రాధమిక దశలోనే ఉన్న చర్చల సారాంశం. ఇంకా ఫైనల్ కాలేదు. ఈ కారణంగానే రెగ్యులర్ షూటింగ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదని తెలిసింది. లాక్ చేసుకున్నాక అనౌన్స్ మెంట్ రావొచ్చు. ఒకవేళ నాని నో అంటే నెక్స్ట్ ఆప్షన్ ఎవరో చూడాలి. సర్కారు వారి పాట వసూళ్ల సంగతి ఎలా ఉన్నా ఫైనల్ రిజల్ట్ పట్ల అభిమానులు ఏమంత సంతృప్తిగా లేరు. ముఖ్యంగా డివైడ్ టాక్ రావడం, అయిదో రోజు నుంచే కలెక్షన్లు తగ్గిపోవడం ఇబ్బంది పెట్టాయి. అందుకే త్రివిక్రమ్ సినిమా మీద మాములు ఆశలు పెట్టుకోవడం లేదు.
This post was last modified on May 19, 2022 1:38 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…