ప్రస్తుతం సర్కారు వారి పాట ఫలితాన్ని ఆస్వాదిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ సెట్లో అడుగు పెట్టాల్సి ఉంటుంది. స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధంగా ఉంది. హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. తమన్ స్వరాలు సమకూర్చే బాధ్యతను తీసుకున్నాడు. అతడు లాంటి ఎవర్ గ్రీన్ సూపర్ హిట్, ఖలేజా లాంటి క్లాసిక్ మెమరీ ఇచ్చిన కాంబినేషన్ కావడంతో అభిమానుల అంచనాలు మాములుగా లేవు. అందులోనూ అల వైకుంఠపురములో తర్వాత వస్తున్న త్రివిక్రమ్ మూవీ ఇది.
లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇందులో మరో హీరోకి స్కోప్ ఉందట. ఏదో సుశాంత్ తరహాలో చిన్నది కాకుండా చెప్పుకోదగ్గ ప్రాధాన్యత ఉంటుందని వినికిడి. దీనికి గాను ఇద్దరు ముగ్గురితో సంప్రదింపులు జరుగుతున్నాయట. అందులో మొదటి పేరు న్యాచురల్ స్టార్ నానిది వినిపిస్తోంది. తన క్యారెక్టర్ నచ్చితే మల్టీ స్టారర్ చేసేందుకు నాని మొహమాట పడడు. అందుకే నాగార్జునతో దేవదాస్ సాధ్యమయ్యింది. పైగా ఇది మాటల మాంత్రికుడి సినిమా. తనను ఎలా వాడుకోవాలో ఆయనకు బాగా తెలుసనే నమ్మకం ఉంటుంది.
అయితే ఇదంతా ప్రాధమిక దశలోనే ఉన్న చర్చల సారాంశం. ఇంకా ఫైనల్ కాలేదు. ఈ కారణంగానే రెగ్యులర్ షూటింగ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదని తెలిసింది. లాక్ చేసుకున్నాక అనౌన్స్ మెంట్ రావొచ్చు. ఒకవేళ నాని నో అంటే నెక్స్ట్ ఆప్షన్ ఎవరో చూడాలి. సర్కారు వారి పాట వసూళ్ల సంగతి ఎలా ఉన్నా ఫైనల్ రిజల్ట్ పట్ల అభిమానులు ఏమంత సంతృప్తిగా లేరు. ముఖ్యంగా డివైడ్ టాక్ రావడం, అయిదో రోజు నుంచే కలెక్షన్లు తగ్గిపోవడం ఇబ్బంది పెట్టాయి. అందుకే త్రివిక్రమ్ సినిమా మీద మాములు ఆశలు పెట్టుకోవడం లేదు.
This post was last modified on May 19, 2022 1:38 pm
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…