కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న NTR30 కి సంబంధించి ఇంకా హీరోయిన్ ఫైనల్ అవ్వలేదు. కొరటాల అండ్ టీం ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ని లిస్టౌట్ చేశారు. అందులో ఎక్కువ మంది బాలీవుడ్ నుంచే ఉన్నారు. అవును ఈసారి ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని పెట్టే ఆలోచనలో ఉన్నాడు కొరటాల. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొందరు హీరోయిన్స్ ని అనుకున్నారు. అందులో కియరా అద్వానీ పేరు కూడా ఉంది. అయితే కియరా రామ్ చరణ్ -శంకర్ సినిమాకు సైన్ చేయడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింది.
ప్రస్తుతం కొరటాల దీపిక పదుకొనే ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఇటివలే ఆమెకి స్క్రిప్ట్ పంపించి చర్చలు జరిపారట. ప్రస్తుతం దీపిక ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ కే’ సినిమా చేస్తుంది. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వనుంది. అందుకే కొరటాల ఎన్టీఆర్30 కి ఆమెను ఫిక్స్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. ప్రస్తుతానికయితే దీపికా ఇంకా ప్రాజెక్ట్ ఫైనల్ చేయలేదు. ఇంకా డిస్కషన్ స్టేజిలో ఉంది.
‘జనతా గ్యారేజ్’ తర్వాత కాస్త గ్యాప్ తో వస్తున్న ఈ కాంబో సినిమా మీద భారీ అంచనాలున్నాయి. పైగా ఈసారి పాన్ ఇండియా లెవెల్ కంటెంట్ అంటూ ఎనౌన్స్ మెంట్ తోనే ఎగ్జైట్ మెంట్ కలిగించారు. ఈ సినిమాకు సంబంధించి చాలా కేర్ తీసుకుంటున్నాడు కొరటాల. ‘ఆచార్య’ ఫెయిల్యుర్ నుండి ఎలాగైనా బయట పడి ఈ సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియా లెవెల్ లో ఓ భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా రేపు సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ లుక్ తో పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు. మిక్కిలినేని సుధాకర్ , కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దాదాపు 100 కోట్ల బడ్జెట్ పెట్టనున్నారని ఇన్సైడ్ టాక్.
This post was last modified on May 19, 2022 12:02 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…