కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న NTR30 కి సంబంధించి ఇంకా హీరోయిన్ ఫైనల్ అవ్వలేదు. కొరటాల అండ్ టీం ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ని లిస్టౌట్ చేశారు. అందులో ఎక్కువ మంది బాలీవుడ్ నుంచే ఉన్నారు. అవును ఈసారి ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని పెట్టే ఆలోచనలో ఉన్నాడు కొరటాల. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొందరు హీరోయిన్స్ ని అనుకున్నారు. అందులో కియరా అద్వానీ పేరు కూడా ఉంది. అయితే కియరా రామ్ చరణ్ -శంకర్ సినిమాకు సైన్ చేయడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింది.
ప్రస్తుతం కొరటాల దీపిక పదుకొనే ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఇటివలే ఆమెకి స్క్రిప్ట్ పంపించి చర్చలు జరిపారట. ప్రస్తుతం దీపిక ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ కే’ సినిమా చేస్తుంది. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వనుంది. అందుకే కొరటాల ఎన్టీఆర్30 కి ఆమెను ఫిక్స్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. ప్రస్తుతానికయితే దీపికా ఇంకా ప్రాజెక్ట్ ఫైనల్ చేయలేదు. ఇంకా డిస్కషన్ స్టేజిలో ఉంది.
‘జనతా గ్యారేజ్’ తర్వాత కాస్త గ్యాప్ తో వస్తున్న ఈ కాంబో సినిమా మీద భారీ అంచనాలున్నాయి. పైగా ఈసారి పాన్ ఇండియా లెవెల్ కంటెంట్ అంటూ ఎనౌన్స్ మెంట్ తోనే ఎగ్జైట్ మెంట్ కలిగించారు. ఈ సినిమాకు సంబంధించి చాలా కేర్ తీసుకుంటున్నాడు కొరటాల. ‘ఆచార్య’ ఫెయిల్యుర్ నుండి ఎలాగైనా బయట పడి ఈ సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియా లెవెల్ లో ఓ భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా రేపు సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ లుక్ తో పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు. మిక్కిలినేని సుధాకర్ , కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దాదాపు 100 కోట్ల బడ్జెట్ పెట్టనున్నారని ఇన్సైడ్ టాక్.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…