కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న NTR30 కి సంబంధించి ఇంకా హీరోయిన్ ఫైనల్ అవ్వలేదు. కొరటాల అండ్ టీం ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ని లిస్టౌట్ చేశారు. అందులో ఎక్కువ మంది బాలీవుడ్ నుంచే ఉన్నారు. అవును ఈసారి ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని పెట్టే ఆలోచనలో ఉన్నాడు కొరటాల. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొందరు హీరోయిన్స్ ని అనుకున్నారు. అందులో కియరా అద్వానీ పేరు కూడా ఉంది. అయితే కియరా రామ్ చరణ్ -శంకర్ సినిమాకు సైన్ చేయడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింది.
ప్రస్తుతం కొరటాల దీపిక పదుకొనే ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఇటివలే ఆమెకి స్క్రిప్ట్ పంపించి చర్చలు జరిపారట. ప్రస్తుతం దీపిక ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ కే’ సినిమా చేస్తుంది. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వనుంది. అందుకే కొరటాల ఎన్టీఆర్30 కి ఆమెను ఫిక్స్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. ప్రస్తుతానికయితే దీపికా ఇంకా ప్రాజెక్ట్ ఫైనల్ చేయలేదు. ఇంకా డిస్కషన్ స్టేజిలో ఉంది.
‘జనతా గ్యారేజ్’ తర్వాత కాస్త గ్యాప్ తో వస్తున్న ఈ కాంబో సినిమా మీద భారీ అంచనాలున్నాయి. పైగా ఈసారి పాన్ ఇండియా లెవెల్ కంటెంట్ అంటూ ఎనౌన్స్ మెంట్ తోనే ఎగ్జైట్ మెంట్ కలిగించారు. ఈ సినిమాకు సంబంధించి చాలా కేర్ తీసుకుంటున్నాడు కొరటాల. ‘ఆచార్య’ ఫెయిల్యుర్ నుండి ఎలాగైనా బయట పడి ఈ సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియా లెవెల్ లో ఓ భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా రేపు సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ లుక్ తో పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు. మిక్కిలినేని సుధాకర్ , కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దాదాపు 100 కోట్ల బడ్జెట్ పెట్టనున్నారని ఇన్సైడ్ టాక్.
This post was last modified on May 19, 2022 12:02 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…