తమిళంలో ఇప్పుడు నంబర్ వన్ హీరో ఎవరు అంటే.. మరో మాట లేకుండా విజయ్ పేరు చెప్పేయాల్సిందే. దశాబ్దాల పాటు అక్కడ ఆధిపత్యం చలాయించిన రజినీకాంత్ గత కొన్నేళ్లలో బాగా డౌన్ అయిపోయాడు. వరుసగా ఆయన సినిమాలు తుస్సుమనిపించడంతో మార్కెట్ బాగా పడిపోయింది. అదే సమయంలో వరుస బ్లాక్బస్టర్లతో విజయ్.. ఆయన్ని దాటి ముందుకెళ్లిపోయాడు.
అజిత్ గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ.. విజయ్ సినిమాల బడ్జెట్లు, బిజినెస్, వసూళ్లు వేరుగా ఉంటున్నాయి. ఇటీవలి బీస్ట్ మూవీ ఒక్కటి తేడా కొట్టింది కానీ.. అంతకుముందు అతను వరుసగా బ్లాక్బస్టర్లు కొట్టాడు. ప్రస్తుతం అతను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్కు వచ్చిన విజయ్.. మధ్యలో గ్యాప్ తీసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ సంతోష్లను కలవడం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ విజయ్కి సాదర స్వాగతం పలికి అతడితో కాసేపు ముచ్చటించారు కూడా. విజయ్ వెంట వంశీ పైడిపల్లి కూడా ఉన్నాడు. అతడికి తెలంగాణ ప్రభుత్వ పెద్దలు కొందరితో మంచి సంబంధాలున్నాయి. ఇది మామూలు మీటింగేనా.. ఏమైనా ప్రత్యేకత ఉందా అని సినీ, రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
హైదరాబాద్ వచ్చి షూటింగ్ చేసే ప్రతి పర భాషా హీరో ముఖ్యమంత్రిని కలవడం జరగదు. అసలు వాళ్లందరికీ కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టమే. ఐతే విజయ్ను వేరే యాంగిల్లో చూడాలిక్కడ. అతడికి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం బలంగా ఉంది. ఆ దిశగా కొన్నేళ్లుగా సంకేతాలు ఇస్తూనే ఉన్నాడు. రజినీ ముందే అస్త్రసన్యాసం చేశాడు. కమల్ ఫెయిలయ్యాడు. ప్రస్తుతం తమిళనాట ప్రతిపక్షం మరీ బలహీనంగా ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో విజయ్ పార్టీ పెట్టడం, ప్రస్తుతం చాలా బలంగా కనిపిస్తున్న డీఎంకే పార్టీకి ఎదురు నిలబడడం ఖాయమనే అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్, కేసీఆర్ మధ్య రాజకీయ చర్చలేమైనా జరిగి ఉంటాయా అన్న చర్చ నడుస్తోంది.
This post was last modified on May 19, 2022 8:12 am
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…