తమిళంలో ఇప్పుడు నంబర్ వన్ హీరో ఎవరు అంటే.. మరో మాట లేకుండా విజయ్ పేరు చెప్పేయాల్సిందే. దశాబ్దాల పాటు అక్కడ ఆధిపత్యం చలాయించిన రజినీకాంత్ గత కొన్నేళ్లలో బాగా డౌన్ అయిపోయాడు. వరుసగా ఆయన సినిమాలు తుస్సుమనిపించడంతో మార్కెట్ బాగా పడిపోయింది. అదే సమయంలో వరుస బ్లాక్బస్టర్లతో విజయ్.. ఆయన్ని దాటి ముందుకెళ్లిపోయాడు.
అజిత్ గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ.. విజయ్ సినిమాల బడ్జెట్లు, బిజినెస్, వసూళ్లు వేరుగా ఉంటున్నాయి. ఇటీవలి బీస్ట్ మూవీ ఒక్కటి తేడా కొట్టింది కానీ.. అంతకుముందు అతను వరుసగా బ్లాక్బస్టర్లు కొట్టాడు. ప్రస్తుతం అతను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్కు వచ్చిన విజయ్.. మధ్యలో గ్యాప్ తీసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ సంతోష్లను కలవడం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ విజయ్కి సాదర స్వాగతం పలికి అతడితో కాసేపు ముచ్చటించారు కూడా. విజయ్ వెంట వంశీ పైడిపల్లి కూడా ఉన్నాడు. అతడికి తెలంగాణ ప్రభుత్వ పెద్దలు కొందరితో మంచి సంబంధాలున్నాయి. ఇది మామూలు మీటింగేనా.. ఏమైనా ప్రత్యేకత ఉందా అని సినీ, రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
హైదరాబాద్ వచ్చి షూటింగ్ చేసే ప్రతి పర భాషా హీరో ముఖ్యమంత్రిని కలవడం జరగదు. అసలు వాళ్లందరికీ కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టమే. ఐతే విజయ్ను వేరే యాంగిల్లో చూడాలిక్కడ. అతడికి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం బలంగా ఉంది. ఆ దిశగా కొన్నేళ్లుగా సంకేతాలు ఇస్తూనే ఉన్నాడు. రజినీ ముందే అస్త్రసన్యాసం చేశాడు. కమల్ ఫెయిలయ్యాడు. ప్రస్తుతం తమిళనాట ప్రతిపక్షం మరీ బలహీనంగా ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో విజయ్ పార్టీ పెట్టడం, ప్రస్తుతం చాలా బలంగా కనిపిస్తున్న డీఎంకే పార్టీకి ఎదురు నిలబడడం ఖాయమనే అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్, కేసీఆర్ మధ్య రాజకీయ చర్చలేమైనా జరిగి ఉంటాయా అన్న చర్చ నడుస్తోంది.
This post was last modified on May 19, 2022 8:12 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…