తమిళంలో ఇప్పుడు నంబర్ వన్ హీరో ఎవరు అంటే.. మరో మాట లేకుండా విజయ్ పేరు చెప్పేయాల్సిందే. దశాబ్దాల పాటు అక్కడ ఆధిపత్యం చలాయించిన రజినీకాంత్ గత కొన్నేళ్లలో బాగా డౌన్ అయిపోయాడు. వరుసగా ఆయన సినిమాలు తుస్సుమనిపించడంతో మార్కెట్ బాగా పడిపోయింది. అదే సమయంలో వరుస బ్లాక్బస్టర్లతో విజయ్.. ఆయన్ని దాటి ముందుకెళ్లిపోయాడు.
అజిత్ గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ.. విజయ్ సినిమాల బడ్జెట్లు, బిజినెస్, వసూళ్లు వేరుగా ఉంటున్నాయి. ఇటీవలి బీస్ట్ మూవీ ఒక్కటి తేడా కొట్టింది కానీ.. అంతకుముందు అతను వరుసగా బ్లాక్బస్టర్లు కొట్టాడు. ప్రస్తుతం అతను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్కు వచ్చిన విజయ్.. మధ్యలో గ్యాప్ తీసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ సంతోష్లను కలవడం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ విజయ్కి సాదర స్వాగతం పలికి అతడితో కాసేపు ముచ్చటించారు కూడా. విజయ్ వెంట వంశీ పైడిపల్లి కూడా ఉన్నాడు. అతడికి తెలంగాణ ప్రభుత్వ పెద్దలు కొందరితో మంచి సంబంధాలున్నాయి. ఇది మామూలు మీటింగేనా.. ఏమైనా ప్రత్యేకత ఉందా అని సినీ, రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
హైదరాబాద్ వచ్చి షూటింగ్ చేసే ప్రతి పర భాషా హీరో ముఖ్యమంత్రిని కలవడం జరగదు. అసలు వాళ్లందరికీ కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టమే. ఐతే విజయ్ను వేరే యాంగిల్లో చూడాలిక్కడ. అతడికి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం బలంగా ఉంది. ఆ దిశగా కొన్నేళ్లుగా సంకేతాలు ఇస్తూనే ఉన్నాడు. రజినీ ముందే అస్త్రసన్యాసం చేశాడు. కమల్ ఫెయిలయ్యాడు. ప్రస్తుతం తమిళనాట ప్రతిపక్షం మరీ బలహీనంగా ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో విజయ్ పార్టీ పెట్టడం, ప్రస్తుతం చాలా బలంగా కనిపిస్తున్న డీఎంకే పార్టీకి ఎదురు నిలబడడం ఖాయమనే అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్, కేసీఆర్ మధ్య రాజకీయ చర్చలేమైనా జరిగి ఉంటాయా అన్న చర్చ నడుస్తోంది.
This post was last modified on May 19, 2022 8:12 am
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…