ఆల్రెడీ మహేష్ బాబు లాంటి టాప్ స్టార్తో ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి భారీ సినిమా చేశాడు అనిల్ రావిపూడి. ఈ సినిమాతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్టులో అతను చేరిపోయినట్లే. ఐతే మార్కెట్ పరంగా చాలా పెద్ద స్థాయిలో ఉన్న మహేష్ బాబుతో సినిమా చేశాక కూడా.. నందమూరి బాలకృష్ణతో సినిమా చేయడం తన కల అని ఎప్పట్నుంచో చెబుతూ వస్తున్నాడు.
ఈ మధ్య అంటే బాలయ్య ‘అఖండ’తో భారీ విజయం సాధించాడు కానీ.. దానికి ముందు ఆయన కెరీర్ ఎంత ఇబ్బందికర స్థితిలో ఉందో తెలిసిందే. అప్పుడు కూడా అనిల్.. బాలయ్యను డైరెక్ట్ చేయడం కోసం ఎంతో ఆశగా ఎదురు చూశాడు. గతంలో బాలయ్య హీరోగా ‘రామారావు’ అనే సినిమా చేయడానికి ప్రయత్నించి విఫలమైన అనిల్.. కొన్ని నెలల కిందటే తన అభిమాన కథానాయకుడితో సినిమాకు కమిట్మెంట్ తీసుకున్నాడు. బాలయ్య సైతం అనిల్తో సినిమా చేయబోతున్న విషయాన్ని ధ్రువీకరించాడు.
ఐతే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందన్న దాని మీదే క్లారిటీ లేదు. ఇటు బాలయ్య, అటు అనిల్ వేర్వేరు సినిమాలతో బిజీగా ఉండటంతో దీనిపై స్పష్టత లేకపోయింది. కాగా తన కొత్త చిత్రం ‘ఎఫ్-3’ ప్రమోషన్లలో భాగంగా తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి క్లారిటీ ఇచ్చేశాడు అనిల్. ఈ చిత్రం సెప్టెంబరులో సెట్స్ మీదికి వెళ్తనున్నట్లు చెప్పాడు. బాలయ్యతో కథా చర్చలు జరుగుతున్నాయని, స్క్రిప్టు పనులు చివరి దశలో ఉన్నాయని అతను వెల్లడించాడు. ఐతే ఈ సినిమా ఏ బేనర్లో తెరకెక్కేది అనిల్ చెప్పలేదు.
ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చకచకా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం జులై-ఆగస్టు మధ్య పూర్తయ్యే అవకాశముంది. దసరా రిలీజ్ ఉండొచ్చు. కొంచెం గ్యాప్ తీసుకుని.. అనిల్ సినిమాను బాలయ్య మొదలుపెట్టేసే అవకాశముంది. ‘ఎఫ్-3’ రిలీజ్ తర్వాత అనిల్ బాలయ్య సినిమా స్క్రిప్టు మీదే పూర్తి స్థాయిలో దృష్టిసారించబోతున్నాడు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్తోనూ ఓ సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నానని.. దీనికి సంబంధించి ఏదీ ఫైనలైజ్ కాలేదని అనిల్ చెప్పడం విశేషం.
దేశంలో తెలుగు ప్రేక్షకులంత పెద్ద మనసు ఇంకెవరికీ ఉండదంటూ ఇతర భాషల ఫిలిం మేకర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా తమిళ…
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…
బేబీ సినిమాతో పెద్ద సంచలనమే రేపాడు దర్శక నిర్మాత సాయిరాజేష్. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్…
హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక…