Movie News

అర్జున్ డైరెక్షన్ – విశ్వక్ యాక్షన్

ఇటీవలే విడుదలైన అశోకవనంలో అర్జున కళ్యాణంతో డీసెంట్ సక్సెస్ అందుకున్న విశ్వక్ సేన్ దాని ఫలితం పట్ల సంతృప్తిగానే ఉన్నట్టు కనిపిస్తోంది. సర్కారు వారి పాట కేవలం వారం గ్యాప్ తో రావడం వల్ల వసూళ్ల మీద ప్రభావం పడింది కానీ లేదంటే రిజల్ట్ ఇంకాస్త మెరుగ్గా ఉండేదన్న మాట వాస్తవం. ఇదిలా ఉండగా విశ్వక్ సేన్ త్వరలో యాక్షన్ కింగ్ అర్జున్ డైరక్షన్ లో నటించబోతున్నట్టు ఫిలింనగర్ టాక్. అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ ప్రాధమికంగా చర్చలు జరిగి ఒక అంగీకారానికి వచ్చినట్టు సమాచారం.

ఇప్పటి జెనెరేషన్ కి అంతగా అవగాహన ఉండకపోవచ్చు కానీ అర్జున్ నటుడిగానే కాదు దర్శకుడిగా రచయితగానూ చెప్పుకోదగ్గ సినిమాలు చేశారు. ముఖ్యంగా 1994లో తీసిన జైహింద్ అప్పట్లో తమిళ తెలుగు రెండు భాషల్లోనూ సూపర్ హిట్. 2002లో బాలకృష్ణ నరసింహనాయుడుని అక్కడ ఎజుమలై పేరుతో రీమేక్ చేసి తనే దర్శకత్వం వహించారు. దాన్నే తిరిగి సింహబలుడు పేరుతో డబ్బింగ్ చేసి వదిలారు. మరీ ఇండస్ట్రీ హిట్లు తీయలేదు కానీ అర్జున్ ఎప్పటికప్పుడు ఈ ప్రయత్నాలైతే చేస్తూ వచ్చారు.

అర్జున్ చివరిగా డైరెక్ట్ చేసిన సినిమాల్లో 2014లో వచ్చిన జైహింద్ 2. ఇదేమంత ఆశించిన స్థాయిలో ఆడలేదు. 2018 ప్రేమబరహా అనే కన్నడ తమిళ్ బైలింగ్వల్ మూవీ తీశారు కానీ అది తెలుగు దాకా రాలేదు. సో మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత మెగా ఫోన్ చేపట్టనుండటం విశేషం. అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు కాబట్టి కన్ఫర్మ్ చేయలేం కానీ ఊరికే ప్రచారం జరగదుగా. అర్జున్ లాంటి అనుభవజ్ఞుడితో కలిసి పనిచేయడం వ్యక్తిగతంగా తానూ దర్శకుడిగా ఎదుగుతున్న విశ్వక్ సేన్ కి ఖచ్చితంగా ఉపయోగపడేదే.

This post was last modified on May 18, 2022 2:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

7 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

13 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

44 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago