బాలీవుడ్లో కథలు పూర్తిగా అడుగంటిపోతున్నట్లున్నాయి. కొన్నేళ్లుగా వాళ్లు ప్రధానంగా రీమేక్ల మీదే ఆధారపడుతున్నాయి. వాటికే ఎక్కువ ఆదరణ దక్కుతుండటం కూడా వాటి పట్ల బాలీవుడ్ జనాలకు మోజు పెరగడానికి కారణం కావచ్చు. ఐతే రీమేక్ చేసినా.. కాస్త విషయం ఉన్న సినిమాలు, ప్రత్యేకమైనవి, కొత్తదనం ఉన్నవి ఎంచుకుంటే ఒక లెక్క. కానీ కమర్షియల్గా తెలుగులో బాగా ఆడింది కదా అని.. ఎంసీఏ అనే అతి సాధారణమైన సినిమాను కూడా హిందీ జనాలు వదలకపోవడమే ఆశ్చర్యం కలిగించే విషయం.
నాని హీరోగా వేణు శ్రీరామ్ రూపొందించిన ఎంసీఏకు విమర్శకుల నుంచి తిరస్కారం ఎదురైంది. నాని అప్పుడు సూపర్ ఫాంలో ఉండడం, సాయిపల్లవితో అతడికి మంచి కాంబినేషన్ కుదరడం, పాటలు బాగుండటంతో సినిమాకు హైప్ వచ్చింది. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ నాని కెరీర్లో చాలా మామూలు సినిమాల్లో ఇదొకటనడంలో సందేహం లేదు.
ఇలాంటి సినిమాను హిందీలో రీమేక్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. అభిమన్యు అనే కొత్త నటుణ్ని పెట్టి హీరోపంటి, బాగి చిత్రాల దర్శకుడు సబ్బీర్ ఖాన్ ఎంసీఏను రీమేక్ చేశాడు. ఆ సినిమా పేరు.. నికమ్మ. ఒరిజినల్లో భూమిక చేసిన వదిన పాత్రను హిందీలో శిల్పా శెట్టి చేసింది. సాయిపల్లవి పాత్రలో కృష్ణ వ్రింద విహారి హీరోయిన్ షెర్లీ నటించింది. జూన్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు.
అది మరీ పేలవంగా ఉండడంతో ఇంటర్నెట్లో ట్రోల్స్ తప్పట్లేదు. ట్రైలర్ కట్ విషయంలో ఏమాత్రం శ్రద్ధ పెట్టకపోవడం.. శిల్పా శెట్టిని పూర్గా ప్రెజెంట్ చేయడంతో అందరూ నెగెటివ్ కామెంట్లే చేస్తున్నారు. ఇమేజ్ లేని హీరోతో భారీ ఫైట్లు చేయించడం అతిగా ఉంది. పేరున్న హీరోలు చేసిన సినిమాలే హిందీలో తుస్సుమనిపిస్తుంటే.. ఇలాంటి సినిమా ఏం ఆడుతుందో చూడాలి మరి.
This post was last modified on May 18, 2022 8:01 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…