మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ టైంలోనే స్టార్డం అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆచార్య’ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. కానీ ఆ వెంటనే వచ్చిన ‘ఆచార్య’ చరణ్ సక్సెస్ కి బ్రేక్ వేసింది. నిజానికి రామ్ చరణ్ కి ఇది కామన్ అయిపోయింది. అవును రెండో సినిమా ‘మగధీర’తో రికార్డులు తిరగరాసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన చరణ్ ఆ వెంటనే ‘ఆరెంజ్’ తో డిజాస్టర్ అందుకున్నాడు. ఇక ‘రంగస్థలం’ తర్వాత కూడా ఇదే రిపీట్ అయింది. తన నటనతో, కంటెంట్ మెస్మరైజ్ చేసి నాన్ బాహుబలి రికార్డు కొట్టాడు చెర్రి. కానీ ఆ వెంటనే బోయపాటితో చేసిన ‘వినయ విధేయ రామ’ డిజాస్టర్ కే బాప్ అనిపించుకుంది.
ఇలా రామ్ చరణ్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ప్రతీ సారి ఆ వెంటనే ఓ ఫ్లాప్ వచ్చి కెరీర్ ని డౌన్ చేస్తుంది. నిజానికి ‘ఆచార్య’ ఇంపాక్ట్ చిరుతో పాటు చరణ్ మీద కూడా పడింది. ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ కూడా దాటలేకపోయింది. ఇక శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమాపై మంచి బజ్ ఉంది. ఇప్పటి వరకు తీసిన షూట్ అవుట్ పుట్ బాగానే వచ్చిందని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. కానీ ఆ సినిమా తర్వాత గౌతం తిన్ననూరితో సినిమా చేయనున్నాడు చరణ్. అంటే RC15 బిగ్గెస్ట్ హిట్టయితే ఆ బ్యాడ్ సెంటిమెంట్ గౌతం సినిమా మీద పడనుందన్నమాట.
కొన్ని సార్లు బ్యాడ్ సెంటిమెంట్ లని నమ్మలేం అంటూ కొట్టి పారేస్తాం కానీ అవి జరిగిపోతాయంతే. ఉదాహరణకి రాజమౌళి సినిమా తర్వాత ప్రతీ హీరో ఓ డిజాస్టర్ చవి చూస్తాడు. రామ్ చరణ్ కి కూడా అదే జరిగింది. మరి ఈ బ్యాడ్ సెంటిమెంట్ దృష్టిలో పెట్టుకొని రామ్ చరణ్ బిగ్గెస్ట్ హిట్ తర్వాత కచ్చితంగా జాగ్రత్త పడాలి. అదిరిపోయే ప్లానింగ్ తో సినిమా చేసుకోవాలి. లేదంటే ఇలా ఫ్లాప్స్ లు వస్తూనే ఉంటాయేమో.
This post was last modified on May 17, 2022 11:16 pm
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు ఎంత అవసరమో తేల్చి చెప్పే ఉదంతం ఇది. ఆయనను…
మనసుంటే మార్గాలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ నిరూపించారు. ఒక పారిశ్రామికవేత్త ట్విట్టర్లో పెట్టిన మెసేజ్ కు నిముషాల్లో స్పందించారు.…
నేచురల్ స్టార్ నాని కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. ది ప్యారడైజ్. ఇంతకుముందు నానికి ‘దసరా’ రూపంలో కెరీర్…
టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…