ఇంకో పదే రోజుల్లో ఎఫ్3 థియేటర్లలో అడుగు పెట్టనుంది. అప్పటికి సర్కారు వారి పాట రెండు వారాలు పూర్తి చేసుకుని ఉంటుంది కాబట్టి టెన్షన్ పడటానికి ఏమి లేదు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 తరహాలో వారాల తరబడి ఇంపాక్ట్ ఉండే అవకాశం లేదని తేలిపోయింది. సో ఫ్యామిలీ ఆడియన్స్ కి బెస్ట్ ఛాయస్ గా ఎఫ్3 నే నిలుస్తుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రమోషన్లలో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఎడతెరిపి లేకుండా ఇంటర్వ్యూలు, టీవీ షోలు, ఛానల్స్ కు వెళ్లే కార్యక్రమాలు నాన్ స్టాప్ గా ప్లాన్ చేసుకుంది దిల్ రాజు టీమ్.
ఇక అనుమతులు వస్తున్నాయి కదాని టికెట్ రేట్లు ఇష్టారీతిన పెంచుకోవడం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో గమనిస్తున్న దిల్ రాజు దీనికి మాత్రం అలాంటి రిస్క్ చేయరట. తెలంగాణలో సింగల్ స్క్రీన్ గరిష్టంగా 150, మల్టీ ప్లెక్సులో మాగ్జిమమ్ 250 రూపాయల లోపే ఉండేలా ధరలు నిర్ణయిస్తారట. ఇదే నిజమైతే జిఓలతో పని లేదు. రెండు మూడు రోజుల్లో ఆన్ లైన్ బుకింగ్స్ మొదలుపెట్టేసుకోవచ్చు. ఏపిలోనూ పెంపుతో పనుండకపోవచ్చు. అదేమీ లేకుండానే భీమ్లా నాయక్ యావరేజ్ టాక్ తోనే మంచి వసూళ్లు తెచ్చుకుంది.
ఇప్పుడీ ఎఫ్3కి బాగానే ఉందనే టాక్ వచ్చినా చాలు దూసుకుపోవచ్చు. కాకపోతే చాలా తక్కువ గ్యాప్ లో జూన్ 3న విక్రమ్, పృథ్విరాజ్, మేజర్ లు వస్తున్నాయి. వాటికి ధీటుగా నిలవాలంటే కుటుంబ ప్రేక్షకుల మద్దతు చాలా అవసరం. జానర్ పరంగా పోల్చుకుంటే ఆ మూడింటికన్నా ఎఫ్3కే క్లాస్ ఆడియన్స్ లో కాస్త ఎక్కువ ఎడ్జ్ వస్తుంది. అనిల్ రావిపూడి ఎంటర్ టైన్మెంట్ ని ఎలా డీల్ చేశాడో చూడాలి. ఇవాళ రిలీజైన పూజా హెగ్డే ఐటెం సాంగ్ సోషల్ మీడియాలో బాగానే వెళ్తోంది. చూడాలి మరి వెంకీ వరుణ్ లు ఏం చేస్తారో
This post was last modified on May 17, 2022 11:04 pm
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు ఎంత అవసరమో తేల్చి చెప్పే ఉదంతం ఇది. ఆయనను…
మనసుంటే మార్గాలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ నిరూపించారు. ఒక పారిశ్రామికవేత్త ట్విట్టర్లో పెట్టిన మెసేజ్ కు నిముషాల్లో స్పందించారు.…
నేచురల్ స్టార్ నాని కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. ది ప్యారడైజ్. ఇంతకుముందు నానికి ‘దసరా’ రూపంలో కెరీర్…
టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…