ఎల్లకాలం హీరోలుగా కొనసాగడం అందరికీ సాధ్యం కాదు. ఒక స్థాయికి మించి స్టార్ ఇమేజ్ సాధించలేకపోయినా, వయసు మళ్లాక హీరోలుగా చేసిన సినిమాలు వరుసగా పరాజయం పాలైనా.. క్యారెక్టర్, విలన్ రోల్స్లోకి మారక తప్పదు. నరేష్, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్.. ఇలా చాలామంది సీనియర్ హీరోలు ఇలా కెరీర్ను మార్చుకున్న వాళ్లే. కానీ ఆ తరం స్టార్ హీరోల్లో ఒకడైన రాజశేఖర్ మాత్రం ఇంకా అటు వైపు అడుగులు వేయట్లేదు. హీరో వేషాలు వదలట్లేదు. గత దశాబ్దన్నర కాలంలో రాజశేఖర్ కొట్టిన ఏకైక హిట్టు ‘గరుడవేగ’ మాత్రమే. నిజానికి బాక్సాఫీస్ లెక్కల్లో చూస్తే అది కూడా ఫ్లాపే. బడ్జెట్ ఎక్కువ కావడం వల్ల అది కాస్ట్ ఫెయిల్యూర్ అయింది.
ఈ నేపథ్యంలో రాజశేఖర్ క్యారెక్టర్, విలన్ రోల్స్లోకి మారితే బాగుంటుందని, అవి రాజశేఖర్కు ఉపయోగపడటంతో పాటు ఆ పాత్రలకూ విలువ చేకూరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ రాజశేఖర్ మాత్రం రూటు మార్చట్లేదు.
క్యారెక్టర్, విలన్ రోల్స్ గురించి ఎప్పుడు అడిగినా.. ఆయన చెబుతున్న సమాధానం ‘తనీ ఒరువన్’లో విలన్ తరహా పాత్ర వస్తే చేసేవాడినని. తన కొత్త సినిమా ఏది రిలీజైనా ప్రమోషన్లలో ఆయన అదే చెబుతున్నాడు. గతంలో రెండుమూడుసార్లు ఈ మాట అన్నాడు. ఇప్పుడు ‘శేఖర్’ రిలీజ్ ముంగిట కూడా ఓ ఇంటర్వ్యూలో ఇదే పునరావృతం అయింది. ‘తనీ ఒరువన్’ తెలుగు వెర్షన్ ‘ధృవ’లో అరవింద్ స్వామి పాత్ర చేయమని తనను అడిగితే కచ్చితంగా చేసేవాడినని రాజశేఖర్ తెలిపాడు. అలాంటి పాత్రలతో తనను రచయితలు, దర్శకులు సంప్రదిస్తే ఓకే అంటానని.. కానీ తనను ఎగ్జైట్ చేసే పాత్రలు ఎవరూ ఇవ్వట్లేదని ఆయనన్నాడు. తన నుంచి అభిమానులు కూడా ఇలాంటి పాత్రలే కోరుకుంటారని ఆయన చెప్పాడు.
ఐతే ‘తనీ ఒరువన్’ విలన్ పాత్రను మైండ్లో పెట్టేసుకుని.. ప్రతి పాత్రనూ దాంతో పోల్చి చూసుకుంటే చాలా కష్టం. అలాంటి అసాధారణ పాత్రలు రాయడం, వాటిని తెరమీద ప్రెజెంట్ చేయడం అంత సులువు కాదు. అలాంటివి అరుదుగానే పడతాయి. ముందు క్యారెక్టర్ లేదా విలన్ క్యారెక్టర్లు చేయడం మొదలుపెడితే.. తర్వాత రచయితలు, దర్శకులు ఇన్స్పైర్ అయి ఇంకా మంచి పాత్రలు తీర్చిదిద్దొచ్చు. అరవింద్ స్వామికైనా నేరుగా ఆ పాత్ర పడిపోలేదు. దాని కంటే ముందు వేరే క్యారెక్టర్ రోల్స్ చేశాడు. కాబట్టి రాజశేఖర్ ‘తనీ ఒరువన్’తో పోలికలు పక్కన పెట్టేసి రంగంలోకి దిగడం మంచిది.
This post was last modified on May 16, 2022 4:44 pm
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…