మాస్ రాజా రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమా ‘క్రాక్’. గత ఏడాది సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా కొవిడ్ ప్రభావం కొనసాగుతున్నా, 50 శాతం ఆక్యుపెన్సీ నడుస్తున్నా.. చాలా పెద్ద హిట్ అయింది. రవితేజ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
ఐతే ఈ సినిమా రిలీజై ఏడాదిన్నర కావస్తుండగా.. ఇప్పుడు దీని మీద ఒక వివాదం నడుస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సినిమా కథను తన పుస్తకం నుంచి కాపీ కొట్టారంటూ హైదరాబాద్కు చెందిన శివ సుబ్రహ్మణ్యమూర్తి అనే రచయిత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
తాను 2015లో ‘బళ్లెం’ సినిమా మీడియా డైరెక్టరీ’ అనే పుస్తకం రాశానని.. ‘క్రాక్’ సినిమాలో కథ, కథనం, కీలక సన్నివేశాలన్నీ ఈ పుస్తకం నుంచి కాపీ కొట్టినవే అని ఆ రచయిత ఆరోపించాడు. ఈ విషయమై ‘క్రాక్’ నిర్మాత, దర్శకుడు, హీరోలకు ఫిలిం ఛాంబర్ నుంచి నోటీసులు పంపించినా.. పట్టించుకోలేదని శివ సుబ్రహ్మణ్య మూర్తి చెప్పాడు.
దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తాను పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పాడు. ఐతే ఇలాంటి కాపీ వివాదాలు సినిమాల రిలీజ్ టైంలో బయటికి వస్తుంటాయి. విడుదలకు ముందు, లేదా రిలీజైన వెంటనే కాపీ ఆరోపణతో వార్తల్లోకి వస్తుంటారు రచయితలు. కానీ ఇలా సినిమా రిలీజైన 16 నెలలకు ఇలా కేసు నమోదు కావడం ఆశ్చర్యం.
కాగా ‘క్రాక్’ ఆంధ్రా ప్రాంతంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా అల్లుకున్నట్లు దర్శకుడు గోపీచంద్ మలినేని అప్పట్లో చెప్పాడు. ఈ సినిమాకు కొంత మేర తమిళ చిత్రం ‘సేతుపతి’ ప్రేరణగా నిలిచింది. విడుదలకు ముందైతే ఆ చిత్రానికిది అఫీషియల్ రీమేక్ అనే ప్రచారం కూడా జరిగింది.
కానీ ఆ కథ, ఈ కథ వేరు. కొన్ని సన్నివేశాలు, హీరో క్యారెక్టరైజేషన్ వరకు కొంత పోలికలు కనిపిస్తాయి. మరి ఇప్పుడీ రచయిత సినిమా అంతా తన పుస్తకం నుంచి కాపీ కొట్టారని చేస్తున్న ఆరోపణలపై దర్శకుడు, నిర్మాత ఠాగూర్ మధు ఎలా స్పందిస్తారో చూడాలి.
This post was last modified on May 14, 2022 4:36 pm
దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ మీద ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. టీజర్ కన్నా బాగుందనే కామెంట్స్ ట్రైలర్ మీద…
తమిళనాడులో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే అధినేత, నటుడు విజయ్.. నేతృత్వంలోని సర్కారు.. తొలి బడ్జెట్ను(2026-27)ను బుధవారం అసెంబ్లీలో…
అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష…
రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సన్ స్ట్రోక్ తప్పేలా లేదు. బండిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని…
మంత్రులు మౌనంగా ఉంటే సహించేది లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ముఖ్యంగా టీడీపీ మంత్రులకు ఆయన ఈ విషయంలో…