తెలుగు వారికి కూడా బాగా ఇష్టుడైన తమిళ కథానాయకుడు కార్తి కెరీర్లో ‘ఖైదీ’ చాలా స్పెషల్ మూవీ. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మైలురాయిలా నిలిచిన సినిమా టైటిల్ పెట్టుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖైదీ బాక్సాఫీస్ దగ్గర అద్భుత ఫలితాన్నందుకున్నాడు. రిలీజ్ ముంగిట ఈ చిత్రంపై మరీ అంచనాలేమీ లేవు కానీ.. మౌత్ టాక్ చాలా బాగా రావడంతో జనాలు ఎగబడి చూశారీ చిత్రాన్ని. ఇందులో ఓవర్ ద టాప్ హీరోయిజం ఏమీ ఉండదు. చాలా వరకు రియలిస్టిగ్గానే సాగుతుందీ చిత్రం.
ఈ చిత్రంలో హీరోయిన్ కూడా లేకపోయినా సరే.. ఆద్యంతం ఆసక్తికరంగా సాగి ప్రేక్షకులను థ్రిల్ చేసింది. అటు తమిళంలో, ఇటు తెలుగులో ‘ఖైదీ’ పెద్ద హిట్టయింది. ఈ చిత్రాన్ని హిందీలో అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఖైదీ’ రిలీజైనపుడే దీనికి సీక్వెల్ ఉంటుందనే సంకేతాలు వచ్చాయి. హీరో బ్యాక్ స్టోరీని చూపిస్తూ కథను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఉన్నాడు. ‘ఖైదీ’ టీం అంతా కూడా సీక్వెల్ గురించి ఎప్పటికప్పుడు సంకేతాలు ఇస్తూనే ఉంది.
కాగా అతి త్వరలోనే ‘ఖైదీ-2’ పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం. ‘ఖైదీ’ తర్వాత మాస్టర్, విక్రమ్ లాంటి భారీ చిత్రాలతో లోకేష్ రేంజ్ మారిపోయింది. ఈ నేపథ్యంలో ‘ఖైదీ-2’ను ఆషామాషీగా తీయాలనుకోవట్లేదట అతను. కార్తికి తోడు అతడి అన్నయ్య, టాప్ స్టార్లలో ఒకడైన సూర్యను కూడా ఇందులో నటింపజేయనున్నాడట. సూర్య కోసం అతను ఒక స్పెషల్ క్యారెక్టర్ డిజైన్ చేశాడట.
ప్రాపర్ సీక్వెల్లా కాకుండా ఈ కథను కొత్త మలుపు తిప్పబోతున్నాడని.. చాలా పెద్ద స్థాయిలో సినిమాను రూపొందించబోతున్నారని సమాచారం. ‘ఖైదీ’ని నిర్మించిన సురేశ్ ప్రభునే సీక్వెల్ను కూడా నిర్మించబోతున్నాడు. లోకేష్ కొత్త చిత్రం ‘విక్రమ్’ జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దాని తర్వాతి చిత్రం అతనింకా ప్రకటించలేదు. అది ‘ఖైదీ-2’నే అని. సూర్య-కార్తి కలిసి ఈ చిత్రంలో సందడి చేయడం ఖాయమని కోలీవుడ్ వర్గాలంటున్నాయి.
This post was last modified on May 12, 2022 8:03 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…