తెలుగు వారికి కూడా బాగా ఇష్టుడైన తమిళ కథానాయకుడు కార్తి కెరీర్లో ‘ఖైదీ’ చాలా స్పెషల్ మూవీ. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మైలురాయిలా నిలిచిన సినిమా టైటిల్ పెట్టుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖైదీ బాక్సాఫీస్ దగ్గర అద్భుత ఫలితాన్నందుకున్నాడు. రిలీజ్ ముంగిట ఈ చిత్రంపై మరీ అంచనాలేమీ లేవు కానీ.. మౌత్ టాక్ చాలా బాగా రావడంతో జనాలు ఎగబడి చూశారీ చిత్రాన్ని. ఇందులో ఓవర్ ద టాప్ హీరోయిజం ఏమీ ఉండదు. చాలా వరకు రియలిస్టిగ్గానే సాగుతుందీ చిత్రం.
ఈ చిత్రంలో హీరోయిన్ కూడా లేకపోయినా సరే.. ఆద్యంతం ఆసక్తికరంగా సాగి ప్రేక్షకులను థ్రిల్ చేసింది. అటు తమిళంలో, ఇటు తెలుగులో ‘ఖైదీ’ పెద్ద హిట్టయింది. ఈ చిత్రాన్ని హిందీలో అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఖైదీ’ రిలీజైనపుడే దీనికి సీక్వెల్ ఉంటుందనే సంకేతాలు వచ్చాయి. హీరో బ్యాక్ స్టోరీని చూపిస్తూ కథను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఉన్నాడు. ‘ఖైదీ’ టీం అంతా కూడా సీక్వెల్ గురించి ఎప్పటికప్పుడు సంకేతాలు ఇస్తూనే ఉంది.
కాగా అతి త్వరలోనే ‘ఖైదీ-2’ పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం. ‘ఖైదీ’ తర్వాత మాస్టర్, విక్రమ్ లాంటి భారీ చిత్రాలతో లోకేష్ రేంజ్ మారిపోయింది. ఈ నేపథ్యంలో ‘ఖైదీ-2’ను ఆషామాషీగా తీయాలనుకోవట్లేదట అతను. కార్తికి తోడు అతడి అన్నయ్య, టాప్ స్టార్లలో ఒకడైన సూర్యను కూడా ఇందులో నటింపజేయనున్నాడట. సూర్య కోసం అతను ఒక స్పెషల్ క్యారెక్టర్ డిజైన్ చేశాడట.
ప్రాపర్ సీక్వెల్లా కాకుండా ఈ కథను కొత్త మలుపు తిప్పబోతున్నాడని.. చాలా పెద్ద స్థాయిలో సినిమాను రూపొందించబోతున్నారని సమాచారం. ‘ఖైదీ’ని నిర్మించిన సురేశ్ ప్రభునే సీక్వెల్ను కూడా నిర్మించబోతున్నాడు. లోకేష్ కొత్త చిత్రం ‘విక్రమ్’ జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దాని తర్వాతి చిత్రం అతనింకా ప్రకటించలేదు. అది ‘ఖైదీ-2’నే అని. సూర్య-కార్తి కలిసి ఈ చిత్రంలో సందడి చేయడం ఖాయమని కోలీవుడ్ వర్గాలంటున్నాయి.
ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు కేంద్రంలోని పెద్దలు బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం…
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సరస్వతి’ సినిమాకు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…