మరో రెండ్రోజుల్లో మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ రిలీజవుతుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ తో బిజీ అయిపోయాడు మహేష్. రెగ్యులర్ గా మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు సూపర్ స్టార్. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సాంగ్స్ బిహైండ్ స్టోరీస్ షేర్ చేసుకున్నాడు మహేష్.
ఆల్బం నుండి ఫస్ట్ సింగిల్ గా రిలీజై సెన్సేషనల్ హిట్ సాధించిన ‘కళావతి’ సాంగ్ ముందుగా మహేష్ కి అలాగే దర్శకుడు పరశురాంకి నచ్చలేదంట. మహేష్ లాంటి హీరోని పెట్టుకొని కళావతి అంటూ స్మూత్ సాంగ్ పెట్టడం కరెక్టేనా ? అంటూ పరశురాం తమన్ ని క్వశ్చన్ చేశాడట. ఇక మహేష్ కి కూడా ట్యూన్ ప్లస్ లిరిక్స్ అంతగా నచ్చలేదంట. ఆ టైంలో తమన్ ఇద్దరినీ కన్విన్స్ చేసి ప్రతీ పెళ్లిలో ఈ పాటే ప్లే అయ్యేలా ఉంటుంది. ఆల్బంలో బెస్ట్ సాంగ్ అవుతుందని భరోసా ఇచ్చాడట. దీంతో మహేష్ , పరశురాం ఇద్దరూ కన్విన్స్ అయ్యారట.
అలా ముందుగా నచ్చలేదనుకున్న సాంగ్ ఇప్పుడు మహేష్ కి అలాగే టీం అందరికీ ఫేవరేట్ అయిపోయింది. సినిమా మీద బజ్ తీసుకురావడానికి పిల్లర్ అయింది. ఎక్కడ చూసినా ఈ సాంగే ప్లే అవుతుంది. అలాగే సినిమాలో ‘మురారి’ అంటూ ఇంకో సాంగ్ పెట్టారట. కానీ సినిమా ఫ్లో చూసుకున్నాక ఒక స్విచువేషణ్ లో దానికి బదులు ఓ మాస్ సాంగ్ పడితే బాగుంటుందని ఫీలయ్యారట. అందుకే ఉన్నపళంగా “మురారి” సాంగ్ ని పక్కన పెట్టేసి “మమ మహేశా” సాంగ్ పెట్టి అప్పటికప్పుడు షూట్ చేసి రెడీ చేసి అటాచ్ చేశారట. ఇక త్వరలోనే మురారి సాంగ్ యూ ట్యూబ్ లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు. ఇదీ ‘సర్కారు వారి పాట’లో ఉన్న పాటల బిహైండ్ స్టోరీ అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు మహేష్.
This post was last modified on May 10, 2022 10:26 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…