మరో రెండ్రోజుల్లో మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ రిలీజవుతుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ తో బిజీ అయిపోయాడు మహేష్. రెగ్యులర్ గా మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు సూపర్ స్టార్. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సాంగ్స్ బిహైండ్ స్టోరీస్ షేర్ చేసుకున్నాడు మహేష్.
ఆల్బం నుండి ఫస్ట్ సింగిల్ గా రిలీజై సెన్సేషనల్ హిట్ సాధించిన ‘కళావతి’ సాంగ్ ముందుగా మహేష్ కి అలాగే దర్శకుడు పరశురాంకి నచ్చలేదంట. మహేష్ లాంటి హీరోని పెట్టుకొని కళావతి అంటూ స్మూత్ సాంగ్ పెట్టడం కరెక్టేనా ? అంటూ పరశురాం తమన్ ని క్వశ్చన్ చేశాడట. ఇక మహేష్ కి కూడా ట్యూన్ ప్లస్ లిరిక్స్ అంతగా నచ్చలేదంట. ఆ టైంలో తమన్ ఇద్దరినీ కన్విన్స్ చేసి ప్రతీ పెళ్లిలో ఈ పాటే ప్లే అయ్యేలా ఉంటుంది. ఆల్బంలో బెస్ట్ సాంగ్ అవుతుందని భరోసా ఇచ్చాడట. దీంతో మహేష్ , పరశురాం ఇద్దరూ కన్విన్స్ అయ్యారట.
అలా ముందుగా నచ్చలేదనుకున్న సాంగ్ ఇప్పుడు మహేష్ కి అలాగే టీం అందరికీ ఫేవరేట్ అయిపోయింది. సినిమా మీద బజ్ తీసుకురావడానికి పిల్లర్ అయింది. ఎక్కడ చూసినా ఈ సాంగే ప్లే అవుతుంది. అలాగే సినిమాలో ‘మురారి’ అంటూ ఇంకో సాంగ్ పెట్టారట. కానీ సినిమా ఫ్లో చూసుకున్నాక ఒక స్విచువేషణ్ లో దానికి బదులు ఓ మాస్ సాంగ్ పడితే బాగుంటుందని ఫీలయ్యారట. అందుకే ఉన్నపళంగా “మురారి” సాంగ్ ని పక్కన పెట్టేసి “మమ మహేశా” సాంగ్ పెట్టి అప్పటికప్పుడు షూట్ చేసి రెడీ చేసి అటాచ్ చేశారట. ఇక త్వరలోనే మురారి సాంగ్ యూ ట్యూబ్ లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు. ఇదీ ‘సర్కారు వారి పాట’లో ఉన్న పాటల బిహైండ్ స్టోరీ అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు మహేష్.
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…