కరోనా మహమ్మారి దాదాపు అందరు స్టార్ హీరోల కెరీర్లోనే అనుకోని గ్యాప్ తెచ్చిపెట్టింది. మెగాస్టార్ చిరంజీవి కూడా అందుకు మినహాయింపు కాదు. రాజకీయాల వల్ల పదేళ్లు గ్యాప్ తీసుకుని.. ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలతో పలకరించిన ఆయన.. ఆ తర్వాత రెండున్నరేళ్లకు కానీ కొత్త సినిమాతో రాలేకపోయారు. ఇంత విరామం తీసుకుని ‘ఆచార్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తే అది ఊహించని పరాభవాన్ని మిగిల్చింది. చిరు కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్ కావడం మామూలు షాక్ కాదు. ఈ చిత్రం చిరును, ఆయన అభిమానులను ఎంత నిరాశకు గురి చేసి ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.
ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఇంకో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం, దానితో అందరినీ మెప్పించడం చాలా అవసరం. చిరు చేతుల్లో ఉన్న వాటిలో కొంచెం ప్రామిసింగ్గా కనిపిస్తున్నది ‘గాడ్ ఫాదర్’ మూవీనే.
ఈ చిత్ర షూటింగ్ కూడా చకచకా నడుస్తోంది. ఇప్పటికే 60 శాతం దాకా చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది. మలయాళ హిట్ ‘లూసిఫర్’కు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగువాడైన తమిళ దర్శకుడు మోహన్ రాజా రూపొందిస్తున్నాడు. భార్య సురేఖతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన చిరు.. తిరిగి హైదరాబాద్ రాగానే ‘గాడ్ ఫాదర్’ చిత్రీకరణను కొనసాగించనున్నాడు. ఇంకో రెండు నెలల్లో సినిమాను పూర్తి చేసి ఆగస్టులోనే ‘గాడ్ ఫాదర్’ను ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నట్లు సమాచారం.
ఆగస్టు 15కు ముందు వచ్చే వీకెండ్కు చాలా సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. కాబట్టి ఆ నెల ద్వితీయార్ధంలోనే ‘గాడ్ ఫాదర్’ రిలీజయ్యే అవకాశాలున్నాయి. దీంతో పాటుగా చిరు.. బాబీ సినిమా చిత్రీకరణలోనూ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. మధ్యలో దానికి గ్యాప్ ఇచ్చి పూర్తిగా తన ఫోకస్ ‘గాడ్ ఫాదర్’ మీదే పెట్టనున్నారట. ఆ తర్వాత బాబీ సినిమాను పూర్తి చేసి దసరాకు లేదా ఏడాది చివర్లో రిలీజ్ చేసే యోచనలో చిరు ఉన్నట్లు సమాచారం. ‘గాడ్ ఫాదర్’లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒక క్యామియో రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on May 10, 2022 6:16 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…