ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో అనిపించే ప్యాన్ ఇండియా మూవీ రాలేదు. ఈ నెల సర్కారు వారి పాట, ఎఫ్3లతో పాటు మరో నాలుగు చిన్న సినిమాలున్నాయి కానీ ఇవన్నీ కేవలం తెలుగు వెర్షన్ కు మాత్రమే పరిమితమైనవి. జూన్ నుంచి మళ్ళీ గ్రాండియర్ల సందడి మొదలుకానుంది. జూన్ 3న జరగబోయే బాక్సాఫీస్ క్లాష్ ట్రేడ్ వర్గాల్లో మంచి ఆసక్తిని రేపుతోంది. ఒకటి అడవి శేష్ మేజర్ కాగా రెండోది అక్షయ్ కుమార్ యుద్ధవీరుడిగా నటించిన పృథ్విరాజ్. రెండూ అయిదు భాషల్లో వస్తున్నాయి.
కాకతాళీయంగానో లేక అనుకుని ప్లాన్ చేసుకున్నారో ఏమో కానీ రెండు ట్రైలర్లూ నిన్నే విడుదలయ్యాయి. మేజర్ మీద ప్రశంసలు కురుస్తున్నాయి. మేజర్ ఉన్నికృష్ణన్ బయోపిక్ కి ముంబై టెర్రరిస్టు అటాక్ నేపధ్యంగా తీసుకుని మహేష్ బాబు సోనీ సంస్థలు భాగస్వాములుగా సంయుక్తంగా నిర్మించాయి. ప్రమోషన్ గట్రా చూస్తుంటే కంటెంట్ మీద టీమ్ నమ్మకం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ బ్యాక్ డ్రాప్ లో గతంలో సినిమాలు వచ్చినప్పటికీ వాటిలో లేని క్వాలిటీ ప్రెజెంటేషన్ ఇందులో కనిపిస్తోంది.
ఇక పృథ్విరాజ్ విషయానికి వస్తే ఇది కూడా చరిత్రలో నిలిచిపోయిన నిజజీవిత కథే. యష్ రాజ్ సంస్థ చాలా ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించింది. విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. సంజయ్ దత్, సోనూ సూద్, మానుషీ చిల్లర్ ఇలా క్యాస్టింగ్ కూడా గట్టిగా సెట్ చేసుకున్నారు. హిందూ సెంటిమెంట్ ని దట్టంగా వాడేశారు. ఒకరకంగా ఇది కూడా బయోపిక్కే. కథాకాలానికి సంబంధించి రెండు పూర్తి విరుద్ధమైనవే అయినప్పటికీ మెయిన్ పాయింట్ మాత్రం శత్రువులతో యుద్ధం చేయడం. మరి గెలుపు ఎవరిదో చూడాలి
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…