కొడుకు మీద ప్రేమతో కొందరు తండ్రులు నిర్మాతగా మారి నష్టపోతున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా కొడుకుని హీరోగా నిలబెట్టాలని కోట్లు ఖర్చు పెడుతున్న నిర్మాతల్లో ఎమ్మెస్ రాజు ఒకరు. నిజానికి ఒకప్పుడు ఎమ్మెస్ రాజు పట్టిందల్లా బంగారమే. నిర్మాతగా కొన్ని నష్టాలు చూసినా ఎక్కువ శాతం సక్సెస్ అందుకున్నారు. ఒక టైంలో ఎమ్మెస్ రాజు నిర్మాణంలో ఒక్క సినిమా అయినా చేయాలనుకునే హీరోలెందరో. అయితే ఇప్పుడు కాలంతో పాటు ఆయన చరిష్మా కూడా మారిపోయింది. వరుసగా ఫ్లాపులు అందుకొని ఫైనల్ గా డైరెక్టర్ కం నిర్మాతగా చిన్న చిన్న సినిమాలు చేస్తూ కొడుకుని హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.
కొన్నాళ్ళ క్రితం ఎమ్మెస్ రాజు దర్శకుడిగా మారి కొడుకు సుమంత్ ని హీరోగా పరిచయం చేస్తూ ‘తునీగా తునీగా’ అనే సినిమా తీశాడు. దిల్ రాజుతో కలిసి ఆ సినిమాను స్వయంగా నిర్మించారు కూడా. ఆ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. అప్పటి నుండి కొడుకుతోనే మళ్ళీ మళ్ళీ సినిమాలు చేస్తూ డైరెక్టర్ కం నిర్మాతగా కొనసాగుతున్నాడు రాజు.
ఆ మధ్య ‘డర్టీ హరి’ అంటూ ఓ అడల్ట్ కంటెంట్ సినిమా తీశాడు రాజు. ఒకప్పుడు హనీ బాబుగా ఎంతో గౌరవం తెచ్చుకున్న రాజు గారు ఇలాంటి సినిమా చేయడం ఏమిటి ? డబ్బు కోసమేనా ? అంటూ ఇండస్ట్రీలో మాట్లాడుకున్నారు. ఆ సినిమా థియేటర్స్ లో ఒకే అనిపించుకొని OTT లో హిట్టయింది. నిర్మాతగా ఆ సినిమాతో కాస్త బిజినెస్ చేసుకొని కొంత లాభం పొందారు. మళ్ళీ తన కొడుకుని హీరోగా పెట్టి ‘7 డేస్ 6 నైట్స్’ అంటూ అదే తరహా అడల్ట్ సినిమా ప్లాన్ చేసి రిలీజ్ కి రెడీ చేశాడు.
ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అవ్వకుండానే మళ్ళీ సుమంత్ హీరోగా తన డైరెక్షన్ లో ‘సతి’ అనే సినిమా ఎనౌన్స్ చేశాడు ఎమ్మెస్ రాజు. హీరోయిన్ మెహర్ చాహల్ చేతిని పట్టుకొని సుమంత్ మాస్ గెటప్ తో జాతరలో నడుచుకుంటూ వస్తున్న స్టిల్ తో ఓ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మిగతా డీటెయిల్స్ ఏమి చెప్పలేదు కానీ కొంత పార్ట్ షూట్ చేసేశారని తెలుస్తుంది. మరి రాజు గారు ఈ సినిమాతో అయినా కొడుకు సుమంత్ కి దర్శకుడిగా ఓ సూపర్ హిట్ అందిస్తారా ? చూడాలి.
This post was last modified on May 10, 2022 12:54 pm
సినిమా థియేటర్లలో జనం కనిపించడం లేదనేది ఇప్పుడు ఇండస్ట్రీని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. సినిమా బాగుంటే వేరే సంగతి, కానీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఒక పెద్ద సినిమా వస్తుందంటే చాలు, మిగతా భాషల సినిమాలన్నీ తమ డేట్స్ మార్చుకునే…
ఈ మధ్య కాలంలో చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలనే ఉత్సాహంతో 'గెట్ టు గెదర్' పార్టీలు చేసుకోవడం ఒక ట్రెండ్గా మారింది.…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. నిన్న ఒకే రోజు ఐదు రాష్ట్రాల ఫలితాలు వచ్చినప్పటికీ.. దేశమంతా ఎక్కువ…
పెద్ది కౌంట్ డౌన్ నెలల నుంచి రోజుల్లోకి వచ్చేసింది. ఇంకో ఇరవై తొమ్మిది రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టేందుకు రామ్…
దక్షిణాది సినీ రంగంలో ఒక ధృవతార రాలిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించిన ఆర్.బి.చౌదరి కన్ను…