సహజంగా హీరో పుట్టిన రోజు అంటే అతని సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పక్కా రిలీజ్ ఉంటుంది లేదా బర్త్ విషెస్ తో ఓ పోస్టర్ అయిన వదులుతారు. ఈరోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు. శివ నిర్వాణ డైరెక్షన్ లో విజయ్ నటిస్తున్న సినిమా నుండి ఫస్ట్ లుక్ ఉంటుందేమో అని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేశారు కానీ మేకర్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేదు. దీంతో సోషల్ మీడియాలో ఆ ప్రొడక్షన్ హ్యాండిల్ ని ట్యాగ్ చేసి షూటింగ్ కూడా మొదలైంది కదా లుక్ రిలీజ్ చేయొచ్చు కదా అంటూ ఫ్యాన్స్ ఒత్తిడి చేశారు. నిజానికి ఇవ్వాళ VD11 కి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలనుకున్నారట. కానీ ఉన్నపళంగా ఆ ప్లాన్ మార్చుకొని డేట్ పోస్ట్ పోన్ చేసుకున్నారని తెలుస్తుంది.
విషయం ఏమిటంటే… ఈరోజు టాలీవుడ్ నుండి చాలానే అప్ డేట్స్ ఉన్నాయి. F3 ట్రైలర్ తో పాటు మేజర్ ట్రైలర్ కూడా ఉంది. ఇక రానా , దుల్కర్ సినిమాల సాంగ్స్ రిలీజ్ కూడా ఇదే రోజు. ఇంకా కొన్ని అప్ డేట్స్ కూడా ఉన్నాయి. మరో వైపు చిరు , వెంకటేష్ క్లాసిక్ సినిమాల యానివర్సరి ట్రెండ్ తో ఫ్యాన్స్ బిజీ అయ్యారు. ఈ హడావుడిలో ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే అన్నిటిలో ఒకటిగా కలిసిపోతుందే తప్ప సెపరేట్ గా ఎటెన్షణ్ క్రియేట్ చేయడం కష్టమే. అందుకే హీరో విజయ్ దేవరకొండ నిర్మాతలను రిక్వెస్ట్ చేసి ఇవ్వాళ ఫస్ట్ లుక్ రిలీజ్ వద్దని తర్వాత ఏదైనా మంచి డేట్ లో సెపరేట్ గా రిలీజ్ చేయమని చెప్పాడట. దీంతో మైత్రి నిర్మాతలు విజయ్ దేవరకొండ , సమంత జంటగా నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ని వాయిదా వేసుకున్నారని తెలుస్తుంది.
ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ ని మే 16 కి షిఫ్ట్ చేశారు నిర్మాతలు. ఆ రోజు సినిమా నుండి విజయ్ బెస్ట్ లుక్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఫస్ట్ లుక్ ఉంటుందని ఎనౌన్స్ చేశారు. అదీ సంగతి ఇదంతా తెలియక ఫ్యాన్స్ ప్రొడక్షన్ పై సీరియస్ గా ఉన్నారు.
This post was last modified on May 9, 2022 5:47 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…