రుక్సర్ ధిల్లాన్.. నాని లాంటి స్టార్ హీరోతో ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో ఓ కథానాయికగా నటించిన అమ్మాయి. అంతకంటే ముందు ‘ఆకతాయి’ అనే చిన్న సినిమాలో ఆమె నటించింది. నాని సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే ఆమె కెరీర్ మరో రకంగా ఉండేదేమో. కానీ అది ఫ్లాప్ అయింది. ఆ తర్వాత అల్లు శిరీష్తో ‘ఏబీసీడీ’ అనే చిత్రంలో నటించిందామె. ఓ మలయాళ హిట్ ఆధారంగా తెరకెక్కిన ఆ చిత్రమూ ఆమెకు నిరాశనే మిగిల్చింది.
తర్వాత ఎస్.ఎస్.కాంచి దర్శకత్వంలో ‘షో టైమ్’ అనే వైవిధ్యమైన సినిమాలో నటించింది రుక్సర్. కానీ ఆ చిత్రం ఎందుకో విడుదలకే నోచుకోలేదు. ఇలా రుక్సర్కు టాలీవుడ్లో వచ్చిన ఏ అవకాశమూ ఉపయోగపడలేదు. ఈ నేపథ్యంలో ఆమె ఆశలన్నీ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ మీదే నిలిచాయి. ఈ సినిమా ప్రోమోలు ప్రామిసింగ్గా కనిపించాయి. రుక్సర్ వాటిలో బాగానే హైలైట్ అయింది. ఇప్పుడీ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. సినిమా వీకెండ్లో బాగానే ఆడింది.
వీక్ డేస్లో కూడా ఓ మోస్తరుగానే వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. మొత్తానికి సినిమా హిట్ అనే విషయంలో సందేహం లేదు. కానీ కెరీర్లో తొలి హిట్ కొట్టిన ఆనందం రుక్సర్కు మిగిలేలా కనిపించడం లేదు. ఎందుకంటే సినిమాలో ఆమె పాత్ర ఎన్నో అంచనాలు రేకెత్తించి మధ్యలో సైడ్ అయిపోయింది. పోస్టర్ల మీద, ప్రోమోల్లో అసలేమాత్రం కనిపించని రితిక అనే మరో హీరోయిన్ సినిమాలో బాగా హైలైట్ అయింది. సినిమా చివరికొచ్చేసరికి అందరూ ఆమె ప్రేమలోనే పడిపోయేలా రచయిత, దర్శకుడు తన పాత్రను తీర్చిదిద్దారు.
ఇంటర్వెల్ దగ్గర్నుంచి రుక్సర్ పాత్ర పూర్తిగా పక్కకు వెళ్లిపోయి, ఆమెను అందరు మరిచిపోయే పరిస్థితి వస్తుంది. చివర్లో రీఎంట్రీ ఇచ్చినా ఆ పాత్ర ఇంపాక్ట్ ఉండదు. అసలు సినిమాలో రుక్సర్ లీడ్ హీరోయిన్ అని చెప్పలేని పరిస్థితి. పాత్ర ప్రాధాన్య పరంగా చూసినా.. స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో చూసుకున్నా రితికనే సినిమాలో హైలైట్ అయింది. రుక్సర్ నామమాత్రంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో సినిమా హిట్టయినా.. రుక్సర్కు దక్కాల్సిన ప్రయోజనం దక్కడం అనుమానమే.
This post was last modified on May 9, 2022 3:12 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…