Movie News

మహేష్ ఎందుకంత ఎమోషనలయ్యాడు?

సూపర్ స్టార్ మహేష్ బాబు మామూలుగా తన సినిమాల వేడుకల్లో చాలా కూల్‌గా కనిపిస్తాడు. తన స్పీచుల్లో ఎలాంటి డ్రామా కానీ, మెలోడ్రామా కానీ అస్సలు ఉండదు. వేరే హీరోల్లాగా స్పీచ్‌ల కోసం తెగ ప్రిపేరై రాడు. అభిమానులతో ఈలలేయించాలనో, ఇంకో ఉద్దేశంతోనో స్పీచ్‌లను రక్తి కట్టించే ప్రయత్నం ఏదీ చేయడు. వేదిక మీదికొచ్చి క్యాజువల్‌గా, రొటీన్‌గా కొన్ని మాటలు మాట్లాడేసి వెళ్లిపోతుంటాడు. ఈ విషయంలో అభిమానులు డిజప్పాయింట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఐతే తన కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మాత్రం అభిమానులకు వేదిక మీద కొత్త మహేష్ కనిపించాడు. ఎన్నడూ లేని విధంగా మహేష్ ఎమోషనల్ అయి, ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటున్నట్లు కనిపించాడు. ఒక దశలో ఏడ్చేస్తాడేమో అనిపించింది కానీ.. వెంటనే తమాయించుకుని నార్మల్ అయ్యాడు.

కరోనా కారణంగా చాన్నాళ్ల పాటు ఇంటికి పరిమితం కావడం, అభిమానులతో పూర్తిగా కనెక్షన్ కట్ అయిపోవడంతో మహేష్ ఫీలైనట్లే ఉన్నాడు. మళ్లీ ఇంత మంది అభిమానుల మధ్యకు వచ్చి, వారి ప్రేమను చవి చూసేసరికి మహేష్ ఎమోషనల్ అయినట్లు కనిపించింది. అందుకే ప్రసంగం ఆరంభంలో ఎమోషనల్‌గా కనిపించాడు. ఇక చివరికి వచ్చేసరికి మహేష్‌లో మరోసారి ఎమోషన్ కనిపించింది. గత రెండేళ్లలో తనకు ఎంతో ముఖ్యమైన వ్యక్తుల్ని కోల్పోయానని మహేష్ అన్నాడు. అందులో ఒకరు ఆయన తోడబుట్టిన సోదరుడు రమేష్. మహేష్, రమేష్ బయట కలిసి పెద్దగా కనిపించకపోవచ్చు కానీ.. వాళ్లిద్దరూ చాలా క్లోజ్. తోడబుట్టిన వాడు తక్కువ వయసులోనే చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పేదేముంది?

ఇక మహేష్ కోల్పోయిన మరో దగ్గరి వ్యక్తి బీఏ రాజు. చిన్నతనం నుంచి సినీ రంగంలో ఆయన వేలు పట్టుకుని నడిచిన మహేష్‌కు ఆయన్ని కోల్పోవడం పెద్ద షాకే. రాజు కృష్ణ, మహేష్‌లకు కుటుంబ సభ్యుడి లాంటి వాడే. ఇలా తన జీవితంలో ఇద్దరు ముఖ్య వ్యక్తులను కోల్పోవడం మహేష్ ఎమోషనల్ అవ్వడానికి మరో కారణం.

This post was last modified on May 8, 2022 10:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

3 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

6 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

6 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

7 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

7 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

9 hours ago