Movie News

సర్కారు … నో మెస్సేజ్

మహేష్ బాబు హీరోగా పరశురాం డైరెక్షన్ లో వస్తున్న ‘సర్కారు వారి పాట’ హంగామా మొదలైంది. సాంగ్స్ రిలీజ్ ఓ వైపు టీం ఇంటర్వ్యూలు మరో వైపు జరుగుతున్నాయి. దర్శకుడు పరశురాం మీడియాకి ఇంటర్వ్యూ లు ఇస్తూ సినిమా గురించి కొన్ని విశేషాలు షేర్ చేసుకుంటున్నాడు. సర్కారు వారి పాట మీద ఆడియన్స్ కి ఉన్న కొన్ని ప్రశ్నలకు సమాదానం ఇచ్చాడు.

సినిమలో ఎలాంటి సందేశం ఉండదని ఇది పక్కా కమర్షియల్ సినిమా అని క్లారిటీ ఇచ్చాడు. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు కథ కూడా ఉంటుందని చెప్పుకున్నాడు. ఇక బ్యాంకుల గురించి కేవలం టాపిక్ మాత్రమే ఉంటుంది తప్ప ఎలాంటి సెటైర్లు ఉండవని పేర్కొన్నాడు. మహేష్ కేరెక్టర్ కి కనెక్ట్ అవుతూ అందులో తమని చూసుకుంటారని తెలిపాడు.

ఇక గోపి సుందర్ ని కాదని తమన్ ని పెట్టుకోవడం గురించి కూడా స్పందించాడు పరశురాం. ఆ టైంలో గోపి సుందర్ చాలా బిజీగా ఉన్నాడని ఏడెనిమిది సినిమాలు చేస్తున్నాడని అందుకే తమకి టీం ఇచ్చి అప్పటికప్పుడు సినిమాకి ట్యూన్స్ చేసిచ్చే తమన్ ని తీసుకున్నామని అన్నారు. ఇక కీర్తి ని రెండేళ్ళ క్రితం కథ అనుకున్నప్పుడే ఫిక్స్ అయ్యానని, ఆ పాత్రకు తనే పర్ఫెక్ట్ అని ఆడియన్స్ ఫీలవుతారని చెప్పుకున్నాడు.

సో సర్కారు వారి పాటలో మహేష్ క్లాసులు పీకుతూ సందేశాలు ఇవ్వడని క్లారిటీ ఇచ్చేశాడు పరశురాం. ఇక సినిమా రిలీజ్ తర్వాత పెద్ద హిట్ అవుతుందని చాలా నమ్మకంతో ఉన్నాడు పరశురాం. ఇన్నాళ్ళకి ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఓ పెద్ద స్టార్ హీరో దొరికాడు. ఇక మహేష్ తో సాదా సీదా సినిమా చేస్తాడా మంచి కంటెంట్ తో తీసి ఉంటాడు. ఇప్పటికే ట్రైలర్ సినిమా మీద మంచి బజ్ తీసుకొచ్చి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేసింది. మరి మే 12న ఈ సినిమాతో పరశురాం దర్శకుడిగా ఎలాంటి హిట్ అందుకుంటాడో వేచి చూడాల్సిందే.

This post was last modified on May 6, 2022 9:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జూనియర్ రమేష్ బాబు సౌండ్ పెంచాలి

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…

1 hour ago

పవన్ కళ్యాణ్ సినిమాలకు దారి దొరికేనా

ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…

7 hours ago

ఈసారి మెజారిటీ తగ్గకూడదు తమ్ముళ్లు

టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…

7 hours ago

రాజీకి వస్తారా… రచ్చ చేస్తారా

ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…

11 hours ago

కేటీఆర్ కు మళ్ళీ ఉచ్చు బిగిసినట్టేనా…?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నిజంగానే ఉచ్చు బిగుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.…

15 hours ago

రండి బాబూ రండి.. డబ్బులిచ్చి జైల్లో ఉండండి

జైలు.. ఈ మాట వినగానే సామాన్యులకు వామ్మో అనిపిస్తుంది. అక్కడి పరిస్థితుల గురించి అనుభవం ఉన్న వాళ్లు చెబుతుంటే.. సినిమాల్లో…

15 hours ago