దేశవ్యాప్తంగా ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న సినిమాల్లో ముందువరుసలో ఉన్న బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్. దీని ప్రీమియర్ కు డేట్ లాక్ అయ్యిందని సమాచారం. ఈ నెల 20 తెలుగుతో పాటు సౌత్ ఇండియన్ ల్యాంగ్వేజెస్ జీ5లో, హిందీ వర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్నాయట. అఫీషియల్ గా ఇంకా చెప్పలేదు కానీ మరికొద్ది రోజుల్లో ప్రకటన రాబోతోంది. బిగ్ స్క్రీన్ మీద ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు, అభిమానులు రిపీట్ రన్ లో చూసేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఓటిటిలోనూ హయ్యెస్ట్ వ్యూస్ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆర్ఆర్ఆర్ మొదట పే పర్ వ్యూ మోడల్ లో రిలీజ్ చేస్తారని తెలిసింది. అంటే కొంత మొత్తాన్ని చెల్లించి నిర్దేశిత సమయంలోగా చూసేయడం పూర్తి చేయాలి. గతంలో కెపే రణసింగం, సల్మాన్ ఖాన్ రాధే, ఖాలీ పీలిలు ఈ తరహాలో జీ4 మల్టీప్లెక్స్ అమలు పరిచింది. అయితే అవి డైరెక్ట్ ఓటిటి రిలీజులు. కానీ ట్రిపులార్ అలా కాదు. థియేటర్లో వచ్చి 50 రోజులవుతోంది. అలాంటప్పుడు డబ్బులు పెట్టి ఎందరు చూస్తారనేది ఆసక్తికరం. ఇంకా చూడనివాళ్ళ సంఖ్య గట్టిగానే ఉంటుంది కాబట్టి రెవిన్యూ ఎంతొస్తుందో చూడాలి.
ఇవాళ ఉదయం ఆర్ఆర్ఆర్ తమిళ వర్షన్ HD పైరసీ ప్రింట్ ఆన్ లైన్ లో ప్రత్యక్షమవ్వడం ఫ్యాన్స్ ని నివ్వెరపరిచింది. ఏదో విదేశీ సర్వర్ నుంచి అక్కడ డిజిటల్ హక్కులు కొన్న సంస్థ ద్వారా బయటికి వచ్చిందని టాక్. కెజిఎఫ్ 2 కూడా ఇదే తరహాలో హ్యాకింగ్ బారిన పడినట్టు వినికిడి. ఒకవేళ ఆర్ఆర్ఆర్ పే పర్ వ్యూ మోడల్ లో కనక వస్తే జూన్ 3 నుంచి కామన్ వర్షన్ లో అందుబాటులో ఉంచుతారట. రాజమౌళి ఆవిష్కరించిన విజువల్ గ్రాండియర్ అఫీషియల్ ఓటిటి ప్రకటన కోసం లెట్ వెయిట్ అండ్ సీ.
This post was last modified on May 6, 2022 4:50 pm
డ్రగ్స్ కేసులో పట్టుబడి జైలుపాలైన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వ్యవహారం నుంచి బీఆర్ ఎస్ పార్టీ బయట పడేదెలా?…
అన్యోన్య కాపురమే.. వైవాహిక బంధానికి.. చూడముచ్చటైన జంటకు.. నిదర్శనం. అయితే.. కారణాలు ఏవైనా ఇప్పుడు ఈ బంధానికి ఇప్పుడు `స్లీప్…
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. 2026-27 వార్షిక బడ్జెట్ను ఈ నెల 20 లేదా 21న సభలో…
నిన్న జరిగిన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ చెప్పిన ఒక పాయింట్ ఇండస్ట్రీ వర్గాలతో…
ఈ నెల 19న జరిగే ఉగాది తర్వాత ఏ క్షణమైనా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన…
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయాలపై జనసేన పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ నాగబాబుకు ఇంకా మక్కువ పోలేదని…