గత వారం ‘ఆచార్య’ లాంటి భారీ చిత్రం రిలీజైంది. వచ్చే వారం ‘సర్కారు వారి పాట’ అనే పెద్ద సినిమా వస్తోంది. మధ్యలో పెద్ద, మీడియం రేంజ్ సినిమాలేవీ బాక్సాఫీస్ బరిలోకి దిగలేదు. దీంతో చిన్న సినిమాలకు ఇది మంచి అవకాశంలా కనిపించింది.
ఎప్పట్నుంచో రిలీజ్ కోసం ఎదురు చూస్తూ, అవకాశం దొరక్క వాయిదాల మీద వాయిదాలు పడుతున్న మూడు చిన్న సినిమాలు ఈ వారానికి కర్చీఫ్ వేశాయి. ఐతే మొన్నటిదాకా ఈ మూడు చిత్రాలకూ పెద్దగా బజ్ కనిపించలేదు. కానీ ఇప్పుడు అందులో ఒక చిత్రానికి కాస్త హైప్ కనిపిస్తోంది.
ఆ చిత్రం.. అశోకవనంలో అర్జున కళ్యాణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యువ కథానాయకుడు విశ్వక్సేన్ తన ఇమేజ్కు భిన్నంగా సున్నితమైన యువకుడి పాత్రలో కనిపించిన సినిమా ఇది. అతడి పెళ్లి చుట్టూ నడిచే కథను విద్యాసాగర్ చింతా అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తే.. ‘రాజావారు రాణివారు’ డైరెక్టర్ రవికిరణ్ కోలా దీనికి రచన చేశాడు.
టీజర్, ట్రైలర్లతో ప్రామిసింగ్గా కనిపించినప్పటికీ మొన్నటిదాకా ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో అంతగా ఆసక్తి కనిపించలేదు. వరుసగా భారీ చిత్రాలు వస్తుంటే.. ఇలాంటి చిన్న సినిమాలపై ప్రేక్షకుల ఫోకస్ నిలవడం కష్టమే. ఐతే ఓవైపు జోరుగా ప్రమోషన్లు చేయడం, మరోవైపు టీవీ9 స్టూడియోలో విశ్వక్కు, యాంకర్ దేవికి జరిగిన గొడవ-తదనంతర పరిణామాలతో ఈ చిత్రం బాగానే ప్రేక్షకుల నోళ్లలో నానింది.
ఈ వారం ఈ సినిమా రిలీజవుతోంది అనే విషయం జనాల్లోకి వెళ్లింది. ఇదంతా ప్లాన్ చేసి చేసిన కాంట్రవర్శీ కాకపోవచ్చు కానీ.. సినిమాకు కోరుకున్న ప్రచారం అయితే లభించింది. ఈ వారం బాక్సాఫీస్ లీడర్గా నిలిచే అవకాశాలు విశ్వక్ చిత్రానికే ఉన్నాయన్నది స్పష్టం. ఇక సుమ సినిమా ‘జయమ్మ పంచాయితీ’ కంటెంట్ పరంగా టాప్లో ఉండేలా కనిపిస్తోంది. దాని ట్రైలర్లు భలేగా అనిపిస్తున్నాయి.
కాకపోతే సుమ సినిమా చూడ్డానికి ప్రేక్షకులు ఏమేర థియేటర్లకు వస్తారన్నదే సందేహం. ఇక శ్రీ విష్ణు సినిమా ‘భళా తందనాన’ ట్రైలర్తో అంతగా ఆకర్షించలేకపోయింది. కానీ అతడి ట్రాక్ రికార్డు, చైతన్య దంతులూరి గత సినిమాలను బట్టి చూస్తే ఇది ఆషామాషీ సినిమా అయితే కాకపోవచ్చు. మరి ఈ మూడు చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి.
This post was last modified on May 4, 2022 6:01 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…