మాములుగా తెలుగు సినిమాలకు తమిళనాడులో ఆదరణ తక్కువ. ఒక్క రాజమౌళి డబ్బింగ్ చిత్రాలు మాత్రమే దానికి మినహాయింపుగా నిలిచాయి. అది కూడా బాహుబలి, ఆర్ఆర్ఆర్ లు రెండే. మగధీరను అక్కడివాళ్ళు అంతగా పట్టించుకోలేదు. ఈగ పాస్ అనిపించుకుంది. వీటి పరిస్థితి ఇలా ఉంటే ఇక స్ట్రెయిట్ గా రిలీజ్ చేసే టాలీవుడ్ మూవీస్ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ సర్కారు వారి పాట ఈ ట్రెండ్ ని బ్రేక్ చేస్తూ సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేయబోతోంది.
చెన్నైలోని రోహిణి సిల్వర్ స్క్రీన్ థియేటర్లో తెల్లవారుఝామున 4 గంటలకు ఫ్యాన్స్ బెనిఫిట్ షో వేయబోతున్నట్టు ఆ యాజమాన్యం ప్రకటించింది. ఇప్పటిదాకా ఏ టాలీవుడ్ హీరో ఈ ఘనతను అందుకోలేదు. ఆర్ఆర్ఆర్ కూడా ఆ టైంకు వేశారు కానీ అది తమిళంలోకి అనువాదం చేసిన ప్రింట్ . సో సర్కారు వారి పాట ఈ రకంగా ప్రత్యేకత సంతరించుకుంది. ఏపి తెలంగాణాతో సమానంగా చెన్నైలోనూ షోలు పడటం అంటే అక్కడ ఉన్న మహేష్ బాబు అభిమానులను అంతకన్నా కానుక ఏముంటుంది.
ఏదో ఆషామాషీ థియేటర్లో ఈ ప్రీమియర్ జరగడం లేదు. రోహిణి అంటే మూడు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్నది. ఉదయం నాలుగు గంటలకు కేవలం విజయ్, అజిత్, రజినీకాంత్ సినిమాలకు మాత్రమే స్పెషల్ షోలు వేస్తారు. అలాంటిది సర్కారు వారి పాటకు నేరుగా తెలుగు వెర్షనే వేయడం అంటే సంథింగ్ స్పెషలే. 12న విడుదల కాబోతున్న ఈ ఎంటర్ టైనర్ మీద టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. సరిలేరు నీకెవ్వరు తర్వాత రెండేళ్లకు పైగా వచ్చిన గ్యాప్ కావడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…
ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…