మాములుగా తెలుగు సినిమాలకు తమిళనాడులో ఆదరణ తక్కువ. ఒక్క రాజమౌళి డబ్బింగ్ చిత్రాలు మాత్రమే దానికి మినహాయింపుగా నిలిచాయి. అది కూడా బాహుబలి, ఆర్ఆర్ఆర్ లు రెండే. మగధీరను అక్కడివాళ్ళు అంతగా పట్టించుకోలేదు. ఈగ పాస్ అనిపించుకుంది. వీటి పరిస్థితి ఇలా ఉంటే ఇక స్ట్రెయిట్ గా రిలీజ్ చేసే టాలీవుడ్ మూవీస్ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ సర్కారు వారి పాట ఈ ట్రెండ్ ని బ్రేక్ చేస్తూ సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేయబోతోంది.
చెన్నైలోని రోహిణి సిల్వర్ స్క్రీన్ థియేటర్లో తెల్లవారుఝామున 4 గంటలకు ఫ్యాన్స్ బెనిఫిట్ షో వేయబోతున్నట్టు ఆ యాజమాన్యం ప్రకటించింది. ఇప్పటిదాకా ఏ టాలీవుడ్ హీరో ఈ ఘనతను అందుకోలేదు. ఆర్ఆర్ఆర్ కూడా ఆ టైంకు వేశారు కానీ అది తమిళంలోకి అనువాదం చేసిన ప్రింట్ . సో సర్కారు వారి పాట ఈ రకంగా ప్రత్యేకత సంతరించుకుంది. ఏపి తెలంగాణాతో సమానంగా చెన్నైలోనూ షోలు పడటం అంటే అక్కడ ఉన్న మహేష్ బాబు అభిమానులను అంతకన్నా కానుక ఏముంటుంది.
ఏదో ఆషామాషీ థియేటర్లో ఈ ప్రీమియర్ జరగడం లేదు. రోహిణి అంటే మూడు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్నది. ఉదయం నాలుగు గంటలకు కేవలం విజయ్, అజిత్, రజినీకాంత్ సినిమాలకు మాత్రమే స్పెషల్ షోలు వేస్తారు. అలాంటిది సర్కారు వారి పాటకు నేరుగా తెలుగు వెర్షనే వేయడం అంటే సంథింగ్ స్పెషలే. 12న విడుదల కాబోతున్న ఈ ఎంటర్ టైనర్ మీద టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. సరిలేరు నీకెవ్వరు తర్వాత రెండేళ్లకు పైగా వచ్చిన గ్యాప్ కావడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు
This post was last modified on May 4, 2022 1:29 pm
ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, ఆ పార్టీ తరఫున ఎంపీగా కూడా గెలిచిన రఘురామ కృష్ణం రాజు తర్వాత…
వైసీపీ అధినేత జగన్.. రాష్ట్రంలోని ఓ వర్గం మీడియాపై తరచుగా విమర్శలు చేయడంతోపాటు.. వాటిని గేలి కూడా చేస్తుంటారు. ఆయన…
ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న తమిళ స్టార్ హీరో ధనుష్, అగ్ర కథానాయిక నయనతార.. కొన్ని కారణాల వల్ల శత్రువులుగా…
ఎప్పుడు ఎవరి కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. తమిళ కుర్రాడు ప్రదీప్ రంగనాథన్కు... నాలుగేళ్ల ముందు వరకు తమిళనాడులోనే…
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత ఈ నెలలో…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ల విధ్వంసం ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తోకముడిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో…