మాములుగా తెలుగు సినిమాలకు తమిళనాడులో ఆదరణ తక్కువ. ఒక్క రాజమౌళి డబ్బింగ్ చిత్రాలు మాత్రమే దానికి మినహాయింపుగా నిలిచాయి. అది కూడా బాహుబలి, ఆర్ఆర్ఆర్ లు రెండే. మగధీరను అక్కడివాళ్ళు అంతగా పట్టించుకోలేదు. ఈగ పాస్ అనిపించుకుంది. వీటి పరిస్థితి ఇలా ఉంటే ఇక స్ట్రెయిట్ గా రిలీజ్ చేసే టాలీవుడ్ మూవీస్ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ సర్కారు వారి పాట ఈ ట్రెండ్ ని బ్రేక్ చేస్తూ సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేయబోతోంది.
చెన్నైలోని రోహిణి సిల్వర్ స్క్రీన్ థియేటర్లో తెల్లవారుఝామున 4 గంటలకు ఫ్యాన్స్ బెనిఫిట్ షో వేయబోతున్నట్టు ఆ యాజమాన్యం ప్రకటించింది. ఇప్పటిదాకా ఏ టాలీవుడ్ హీరో ఈ ఘనతను అందుకోలేదు. ఆర్ఆర్ఆర్ కూడా ఆ టైంకు వేశారు కానీ అది తమిళంలోకి అనువాదం చేసిన ప్రింట్ . సో సర్కారు వారి పాట ఈ రకంగా ప్రత్యేకత సంతరించుకుంది. ఏపి తెలంగాణాతో సమానంగా చెన్నైలోనూ షోలు పడటం అంటే అక్కడ ఉన్న మహేష్ బాబు అభిమానులను అంతకన్నా కానుక ఏముంటుంది.
ఏదో ఆషామాషీ థియేటర్లో ఈ ప్రీమియర్ జరగడం లేదు. రోహిణి అంటే మూడు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్నది. ఉదయం నాలుగు గంటలకు కేవలం విజయ్, అజిత్, రజినీకాంత్ సినిమాలకు మాత్రమే స్పెషల్ షోలు వేస్తారు. అలాంటిది సర్కారు వారి పాటకు నేరుగా తెలుగు వెర్షనే వేయడం అంటే సంథింగ్ స్పెషలే. 12న విడుదల కాబోతున్న ఈ ఎంటర్ టైనర్ మీద టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. సరిలేరు నీకెవ్వరు తర్వాత రెండేళ్లకు పైగా వచ్చిన గ్యాప్ కావడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు
This post was last modified on May 4, 2022 1:29 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న గోదారి గట్టుపైన సినిమా కోసం హీరో సుమంత్ ప్రభాస్ ఫుల్ ప్రమోషన్లు చేస్తున్నాడు. ఒకపక్క ఇంటర్వ్యూలు…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత నోట నుంచి వచ్చే మాటలు ఎప్పటికప్పుడు వైరల్…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం, మంచి రిలీజ్ ఉండేలా చూసుకోవడం సవాలుగా మారింది. తెలుగులో…
సినిమా థియేటర్లలో జనం కనిపించడం లేదనేది ఇప్పుడు ఇండస్ట్రీని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. సినిమా బాగుంటే వేరే సంగతి, కానీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఒక పెద్ద సినిమా వస్తుందంటే చాలు, మిగతా భాషల సినిమాలన్నీ తమ డేట్స్ మార్చుకునే…
ఈ మధ్య కాలంలో చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలనే ఉత్సాహంతో 'గెట్ టు గెదర్' పార్టీలు చేసుకోవడం ఒక ట్రెండ్గా మారింది.…