మాములుగా తెలుగు సినిమాలకు తమిళనాడులో ఆదరణ తక్కువ. ఒక్క రాజమౌళి డబ్బింగ్ చిత్రాలు మాత్రమే దానికి మినహాయింపుగా నిలిచాయి. అది కూడా బాహుబలి, ఆర్ఆర్ఆర్ లు రెండే. మగధీరను అక్కడివాళ్ళు అంతగా పట్టించుకోలేదు. ఈగ పాస్ అనిపించుకుంది. వీటి పరిస్థితి ఇలా ఉంటే ఇక స్ట్రెయిట్ గా రిలీజ్ చేసే టాలీవుడ్ మూవీస్ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ సర్కారు వారి పాట ఈ ట్రెండ్ ని బ్రేక్ చేస్తూ సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేయబోతోంది.
చెన్నైలోని రోహిణి సిల్వర్ స్క్రీన్ థియేటర్లో తెల్లవారుఝామున 4 గంటలకు ఫ్యాన్స్ బెనిఫిట్ షో వేయబోతున్నట్టు ఆ యాజమాన్యం ప్రకటించింది. ఇప్పటిదాకా ఏ టాలీవుడ్ హీరో ఈ ఘనతను అందుకోలేదు. ఆర్ఆర్ఆర్ కూడా ఆ టైంకు వేశారు కానీ అది తమిళంలోకి అనువాదం చేసిన ప్రింట్ . సో సర్కారు వారి పాట ఈ రకంగా ప్రత్యేకత సంతరించుకుంది. ఏపి తెలంగాణాతో సమానంగా చెన్నైలోనూ షోలు పడటం అంటే అక్కడ ఉన్న మహేష్ బాబు అభిమానులను అంతకన్నా కానుక ఏముంటుంది.
ఏదో ఆషామాషీ థియేటర్లో ఈ ప్రీమియర్ జరగడం లేదు. రోహిణి అంటే మూడు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్నది. ఉదయం నాలుగు గంటలకు కేవలం విజయ్, అజిత్, రజినీకాంత్ సినిమాలకు మాత్రమే స్పెషల్ షోలు వేస్తారు. అలాంటిది సర్కారు వారి పాటకు నేరుగా తెలుగు వెర్షనే వేయడం అంటే సంథింగ్ స్పెషలే. 12న విడుదల కాబోతున్న ఈ ఎంటర్ టైనర్ మీద టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. సరిలేరు నీకెవ్వరు తర్వాత రెండేళ్లకు పైగా వచ్చిన గ్యాప్ కావడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు
This post was last modified on May 4, 2022 1:29 pm
కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…