వేరే భాషల చిత్రాలు తమ మార్కెట్ను కొల్లగొట్టేస్తుండటం.. అదే సమయంలో హిందీ చిత్రాలకు సరైన ఆదరణ లేకపోవడం బాలీవుడ్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది ఈ మధ్య. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి చిత్రాల డబ్బింగ్ వెర్షన్లు హిందీ మార్కెట్ను ఎలా కొల్లగొట్టాయో.. డైరెక్ట్ హిందీ సినిమాలు వాటి ధాటికి తట్టుకోలేక ఎలా చతికిలపడ్డాయో అందరూ చూశారు. దక్షిణాది చిత్రాల దాడి ఇలా ఉంటే.. అవి చాలదన్నట్లు ఇప్పుడు ఓ హాలీవుడ్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేయడానికి రెడీ అయింది.
అదే.. డాక్టర్ స్ట్రేంజ్. మామూలుగా చూస్తే ఎవెంజర్స్, స్పైడర్ మ్యాన్ లాంటి హాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంఛైజీలతో పోలిస్తే ‘డాక్టర్ స్ట్రేంజ్’ అంత క్రేజున్న సినిమా కాదు. అందుకే ఈ సినిమా రిలీజ్ గురించి ముందు ఇండస్ట్రీ జనాలు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. కానీ రిలీజ్ ముంగిట ఈ సినిమా క్రేజ్ ఇండియాలో మామూలుగా లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్స్ చూసి ట్రేడ్ పండిట్లు ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు.
‘డాక్టర్ స్ట్రేంజ్’కు ఇండియాలో కొన్ని సిటీల్లో తెల్లవారుజామున 4 గంటలకు షోలు వేస్తున్నారంటే, వాటికి టికెట్లు పెట్టినవి పెట్టినట్లే అయిపోతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇండియా మొత్తంలో ఉన్న ఐమాక్స్ స్క్రీన్లన్నింటికీ తొలి వీకెండ్కు దాదాగాపు టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. కేవలం ఐమాక్స్ స్క్రీన్ల నుంచే అడ్వాన్స్ సేల్స్ ద్వారా రూ.5 కోట్లు రాబట్టేసిందట ‘డాక్టర్ స్ట్రేంజ్’. ఇక మొత్తంగా తొలి వీకెండ్కు ‘డాక్టర్ స్ట్రేంజ్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజిలో జరుగుతున్నాయి.
ఈ వారానికి వివిధ భాషల్లో చాలా సినిమాలే రిలీజవుతున్నప్పటికీ.. వాటన్నింటి వీకెండ్ వసూళ్ల కంటే ‘డాక్టర్ స్ట్రేంజ్’ కలెక్షన్లు ఎక్కువ ఉండబోతున్నాయన్నది స్పష్టం. అడ్వాన్స్ బుకింగ్స్ ఊపు చూస్తుంటే తొలి రోజు ఇండియాలో ఈ చిత్రం రూ.30 కోట్ల దాకా నెట్ వసూళ్లు సాధిస్తుందని అంచనా. ఓవైపు అజయ్ దేవగణ్ లాంటి పెద్ద స్టార్ నటించిన ‘రన్ వే 34’ తొలి రోజు ఇండియాలో కేవలం రూ.3 కోట్ల వసూళ్లు సాధిస్తే.. మరీ పాపులర్ కాని ఓ హాలీవుడ్ మూవీ అంతకు పదింతలు కలెక్షన్లు రాబడుతుంటే బాలీవుడ్ వాళ్లకు కన్నీళ్లు రాకుండా ఎలా ఉంటాయి?
This post was last modified on May 3, 2022 3:28 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…