వేరే భాషల చిత్రాలు తమ మార్కెట్ను కొల్లగొట్టేస్తుండటం.. అదే సమయంలో హిందీ చిత్రాలకు సరైన ఆదరణ లేకపోవడం బాలీవుడ్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది ఈ మధ్య. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి చిత్రాల డబ్బింగ్ వెర్షన్లు హిందీ మార్కెట్ను ఎలా కొల్లగొట్టాయో.. డైరెక్ట్ హిందీ సినిమాలు వాటి ధాటికి తట్టుకోలేక ఎలా చతికిలపడ్డాయో అందరూ చూశారు. దక్షిణాది చిత్రాల దాడి ఇలా ఉంటే.. అవి చాలదన్నట్లు ఇప్పుడు ఓ హాలీవుడ్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేయడానికి రెడీ అయింది.
అదే.. డాక్టర్ స్ట్రేంజ్. మామూలుగా చూస్తే ఎవెంజర్స్, స్పైడర్ మ్యాన్ లాంటి హాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంఛైజీలతో పోలిస్తే ‘డాక్టర్ స్ట్రేంజ్’ అంత క్రేజున్న సినిమా కాదు. అందుకే ఈ సినిమా రిలీజ్ గురించి ముందు ఇండస్ట్రీ జనాలు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. కానీ రిలీజ్ ముంగిట ఈ సినిమా క్రేజ్ ఇండియాలో మామూలుగా లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్స్ చూసి ట్రేడ్ పండిట్లు ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు.
‘డాక్టర్ స్ట్రేంజ్’కు ఇండియాలో కొన్ని సిటీల్లో తెల్లవారుజామున 4 గంటలకు షోలు వేస్తున్నారంటే, వాటికి టికెట్లు పెట్టినవి పెట్టినట్లే అయిపోతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇండియా మొత్తంలో ఉన్న ఐమాక్స్ స్క్రీన్లన్నింటికీ తొలి వీకెండ్కు దాదాగాపు టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. కేవలం ఐమాక్స్ స్క్రీన్ల నుంచే అడ్వాన్స్ సేల్స్ ద్వారా రూ.5 కోట్లు రాబట్టేసిందట ‘డాక్టర్ స్ట్రేంజ్’. ఇక మొత్తంగా తొలి వీకెండ్కు ‘డాక్టర్ స్ట్రేంజ్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజిలో జరుగుతున్నాయి.
ఈ వారానికి వివిధ భాషల్లో చాలా సినిమాలే రిలీజవుతున్నప్పటికీ.. వాటన్నింటి వీకెండ్ వసూళ్ల కంటే ‘డాక్టర్ స్ట్రేంజ్’ కలెక్షన్లు ఎక్కువ ఉండబోతున్నాయన్నది స్పష్టం. అడ్వాన్స్ బుకింగ్స్ ఊపు చూస్తుంటే తొలి రోజు ఇండియాలో ఈ చిత్రం రూ.30 కోట్ల దాకా నెట్ వసూళ్లు సాధిస్తుందని అంచనా. ఓవైపు అజయ్ దేవగణ్ లాంటి పెద్ద స్టార్ నటించిన ‘రన్ వే 34’ తొలి రోజు ఇండియాలో కేవలం రూ.3 కోట్ల వసూళ్లు సాధిస్తే.. మరీ పాపులర్ కాని ఓ హాలీవుడ్ మూవీ అంతకు పదింతలు కలెక్షన్లు రాబడుతుంటే బాలీవుడ్ వాళ్లకు కన్నీళ్లు రాకుండా ఎలా ఉంటాయి?
This post was last modified on May 3, 2022 3:28 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…