బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన పరిస్థితులు నెలకొన్నాయి. థియేటర్లకు వస్తున్న ప్రేక్షకుల మనోగతం అంత సులభంగా అంతు చిక్కడం లేదు. బాలేదనే మాట వస్తే చాలు మెగాస్టార్ మెగాపవర్ స్టార్ కలిసి నటించిన సినిమా అయినా సరే ఒక్కసారి చూసేందుకు కూడా ఇష్టపడటం లేదని కలెక్షన్లు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్. కెజిఎఫ్ 2 లాంటి గ్రాండియర్లు చూసిన కళ్ళకు రొటీన్ కంటెంట్ ఆనడం లేదన్నది వాస్తవం.
ఏదో ఒక ప్రత్యేకత లేనిదే టికెట్లు కొని హాలు దాకా రామని వసూళ్ల రూపంలో తేల్చి చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మే 6న టాలీవుడ్ నుంచి మూడు స్ట్రెయిట్ సినిమాలు రాబోతున్నాయి. అవి అశోకవనంలో అర్జున కళ్యాణం, భళా తందనాన, జయమ్మ పంచాయితీ. దేనికీ మినిమం బజ్ లేదు. టాక్ ని బట్టో రివ్యూలను చూసో వెళ్లాలా వద్దాని జనం నిర్ణయించుకుంటారు.
కానీ ఆ లెక్కలేవి లేకుండా టికెట్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న హాలీవుడ్ మూవీ డాక్టర్ స్ట్రేంజ్ మల్టీ వర్స్ అఫ్ మ్యాడ్ నెస్. ఇదీ మే 6నే రిలీజ్ కాబోతుండటం ఎంత లేదన్నా పైన చెప్పిన వాటి నిర్మాతలను ఇబ్బంది పెట్టేదే. హైదరాబాద్ తో సహా కీలక నగరాల్లో డాక్టర్ స్ట్రేంజ్ బుకింగ్స్ ఫైర్ మీదున్నాయి. మొదటి మూడు రోజులు దాదాపు హౌస్ ఫుల్స్ పడ్డాయి.
వేసవి సెలవుల్లో ఉన్న పిల్లలకు ఇదే వన్ అండ్ ఓన్లీ ఛాయస్ గా నిలుస్తోంది. అసలే వారం తర్వాత 12న రిలీజయ్యే సర్కారు వారి పాట రాకముందే సొమ్ము చేసుకుందామని ఆశపడిన విశ్వక్ – శ్రీవిష్ణు – సుమలకు డాక్టర్ గట్టి టెన్షనే పెడుతున్నాడు. కాకపోతే వీటికి చాలా బాగుందనే టాక్ వస్తే వాటి బిజినెస్ కు తగ్గట్టు వసూళ్లు తెచ్చుకోవచ్చు. అంత సీన్ ఉందా లేదనేది నాలుగు రోజుల్లో తేలనుంది
This post was last modified on May 2, 2022 12:14 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…