బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన పరిస్థితులు నెలకొన్నాయి. థియేటర్లకు వస్తున్న ప్రేక్షకుల మనోగతం అంత సులభంగా అంతు చిక్కడం లేదు. బాలేదనే మాట వస్తే చాలు మెగాస్టార్ మెగాపవర్ స్టార్ కలిసి నటించిన సినిమా అయినా సరే ఒక్కసారి చూసేందుకు కూడా ఇష్టపడటం లేదని కలెక్షన్లు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్. కెజిఎఫ్ 2 లాంటి గ్రాండియర్లు చూసిన కళ్ళకు రొటీన్ కంటెంట్ ఆనడం లేదన్నది వాస్తవం.
ఏదో ఒక ప్రత్యేకత లేనిదే టికెట్లు కొని హాలు దాకా రామని వసూళ్ల రూపంలో తేల్చి చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మే 6న టాలీవుడ్ నుంచి మూడు స్ట్రెయిట్ సినిమాలు రాబోతున్నాయి. అవి అశోకవనంలో అర్జున కళ్యాణం, భళా తందనాన, జయమ్మ పంచాయితీ. దేనికీ మినిమం బజ్ లేదు. టాక్ ని బట్టో రివ్యూలను చూసో వెళ్లాలా వద్దాని జనం నిర్ణయించుకుంటారు.
కానీ ఆ లెక్కలేవి లేకుండా టికెట్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న హాలీవుడ్ మూవీ డాక్టర్ స్ట్రేంజ్ మల్టీ వర్స్ అఫ్ మ్యాడ్ నెస్. ఇదీ మే 6నే రిలీజ్ కాబోతుండటం ఎంత లేదన్నా పైన చెప్పిన వాటి నిర్మాతలను ఇబ్బంది పెట్టేదే. హైదరాబాద్ తో సహా కీలక నగరాల్లో డాక్టర్ స్ట్రేంజ్ బుకింగ్స్ ఫైర్ మీదున్నాయి. మొదటి మూడు రోజులు దాదాపు హౌస్ ఫుల్స్ పడ్డాయి.
వేసవి సెలవుల్లో ఉన్న పిల్లలకు ఇదే వన్ అండ్ ఓన్లీ ఛాయస్ గా నిలుస్తోంది. అసలే వారం తర్వాత 12న రిలీజయ్యే సర్కారు వారి పాట రాకముందే సొమ్ము చేసుకుందామని ఆశపడిన విశ్వక్ – శ్రీవిష్ణు – సుమలకు డాక్టర్ గట్టి టెన్షనే పెడుతున్నాడు. కాకపోతే వీటికి చాలా బాగుందనే టాక్ వస్తే వాటి బిజినెస్ కు తగ్గట్టు వసూళ్లు తెచ్చుకోవచ్చు. అంత సీన్ ఉందా లేదనేది నాలుగు రోజుల్లో తేలనుంది
This post was last modified on May 2, 2022 12:14 pm
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…