మెగాస్టార్ చిరంజీవి కరోనా సమయంలో సినీ కార్మికుల కోసం ఎంత చేశాడో అందరికీ తెలుసు. సీసీసీ పేరుతో ఫౌండేషన్ పెట్టి ముందుగా తాను భారీ ఎత్తున విరాళం అందించి, మిగతా ఇండస్ట్రీ ప్రముఖులతోనూ విరాళాలు సేకరించి ఆ నిధితో కొన్ని నెలల పాటు కార్మికులకు నిత్యావసరాలు అందజేయడంలో చిరుది కీలక పాత్ర. అలాగే సామాన్య జనాల కోసం ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేయించి ఆ రకంగానూ ఎంతో సేవ చేశారు చిరు. దీనికి తోడు ఏపీలో టికెట్ల ధరల సమస్యను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించి ఇండస్ట్రీకి మేలు చేశాడు చిరు.
ఇప్పుడు ఆయన మరో బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలుగు సినీ కార్మికుల కోసం హైదరాబాద్లోని చిత్రపురి కాలనీలో ఆసుపత్రి నిర్మించే యోచనలో చిరు ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఆదివారం మేడే ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఈ దిశగా సంకేతాలు ఇచ్చారు.
చిరంజీవి ఇండస్ట్రీ కోసం, సినీ కార్మికుల కోసం ఎంతో చేశారని.. కరోనా టైంలో ఎంతో సాయపడ్డారని.. ఇప్పుడు ఆయన సినీ కార్మికుల కోసం ఆసుపత్రి నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారని తలసాని వ్యాఖ్యానించారు. ఇది జరిగితే వేలమంది కార్మికులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని.. చిరు ఆ పని తప్పకుండా చేయాలని తలసాని అన్నారు.
చిత్రపురి కాలనీలో సినీ కార్మికుల కోసం ఆసుపత్రి, పాఠశాల నిర్మించడానికి స్థలం అందుబాటులో ఉందని, వాటి కోసం ఆ స్థలాల్ని కేటాయించడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని తలసాని అన్నారు. మరి తలసాని మాట వరసకు అన్నారా.. నిజంగానే ప్రభుత్వం స్థలం ఇవ్వడం, చిరు నేతృత్వంలో ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం జరుగుతాయా అన్నది చూడాలి. ఇది నిజంగా జరిగితే మాత్రం ఇండస్ట్రీలో చిరు పేరు ఎప్పటికీ నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on May 2, 2022 10:30 am
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…
కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…