Movie News

సినీ కార్మికుల కోసం చిరు ఆసుప‌త్రి?

మెగాస్టార్ చిరంజీవి క‌రోనా స‌మ‌యంలో సినీ కార్మికుల కోసం ఎంత చేశాడో అంద‌రికీ తెలుసు. సీసీసీ పేరుతో ఫౌండేష‌న్ పెట్టి ముందుగా తాను భారీ ఎత్తున విరాళం అందించి, మిగ‌తా ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల‌తోనూ విరాళాలు సేక‌రించి ఆ నిధితో కొన్ని నెల‌ల పాటు కార్మికుల‌కు నిత్యావ‌స‌రాలు అంద‌జేయ‌డంలో చిరుది కీల‌క పాత్ర‌. అలాగే సామాన్య జ‌నాల కోసం ఆక్సిజ‌న్ బ్యాంకులు ఏర్పాటు చేయించి ఆ ర‌కంగానూ ఎంతో సేవ చేశారు చిరు. దీనికి తోడు ఏపీలో టికెట్ల ధ‌ర‌ల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డంలో కీల‌క పాత్ర పోషించి ఇండ‌స్ట్రీకి మేలు చేశాడు చిరు.

ఇప్పుడు ఆయ‌న మరో బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. తెలుగు సినీ కార్మికుల కోసం హైద‌రాబాద్‌లోని చిత్ర‌పురి కాల‌నీలో ఆసుప‌త్రి నిర్మించే యోచ‌న‌లో చిరు ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.
ఆదివారం మేడే ఉత్స‌వాల్లో భాగంగా తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ ఈ దిశ‌గా సంకేతాలు ఇచ్చారు.

చిరంజీవి ఇండ‌స్ట్రీ కోసం, సినీ కార్మికుల కోసం ఎంతో చేశార‌ని.. క‌రోనా టైంలో ఎంతో సాయ‌ప‌డ్డార‌ని.. ఇప్పుడు ఆయ‌న సినీ కార్మికుల కోసం ఆసుప‌త్రి నిర్మించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని త‌ల‌సాని వ్యాఖ్యానించారు. ఇది జ‌రిగితే వేల‌మంది కార్మికుల‌కు ఎంతో ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని.. చిరు ఆ ప‌ని త‌ప్ప‌కుండా చేయాల‌ని త‌ల‌సాని అన్నారు.

చిత్ర‌పురి కాల‌నీలో సినీ కార్మికుల కోసం ఆసుప‌త్రి, పాఠ‌శాల నిర్మించ‌డానికి స్థ‌లం అందుబాటులో ఉందని, వాటి కోసం ఆ స్థ‌లాల్ని కేటాయించ‌డానికి ప్ర‌భుత్వం కూడా సిద్ధంగా ఉంద‌ని త‌ల‌సాని అన్నారు. మ‌రి త‌ల‌సాని మాట వ‌ర‌స‌కు అన్నారా.. నిజంగానే ప్ర‌భుత్వం స్థ‌లం ఇవ్వ‌డం, చిరు నేతృత్వంలో ఆసుప‌త్రి నిర్మాణం చేప‌ట్ట‌డం జ‌రుగుతాయా అన్న‌ది చూడాలి. ఇది నిజంగా జ‌రిగితే మాత్రం ఇండ‌స్ట్రీలో చిరు పేరు ఎప్ప‌టికీ నిలిచిపోతుంద‌న‌డంలో సందేహం లేదు.

This post was last modified on May 2, 2022 10:30 am

Share

Recent Posts

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

28 minutes ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

1 hour ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

2 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

2 hours ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

3 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

3 hours ago