కరోనా దెబ్బతో దేశీయ మార్కెట్ లాగే యుఎస్లో తెలుగు సినిమాల మార్కెట్ కూడా కొంత కాలం డల్లుగా సాగింది. ఇంకా చెప్పాలంటే అక్కడ కరోనా ప్రభావం బాక్సాఫీస్ మీద మరింతగా పడింది. అక్కడ సినిమా టికెట్ల రేట్లు చాలా ఎక్కువ. పైగా చాలా దూరం ప్రయాణించి వెళ్లి సినిమా చూడాలి. కరోనా భయాలు వెంటాడుతుంటే అంత ఖర్చు పెట్టి, అంత దూరం ప్రయాణించి సినిమా చూడాలన్న ఆసక్తి ఎలా ఉంటుంది. అందుకే వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గాక కానీ అక్కడి జనాల్లో కదలిక రాలేదు.
ఐతే ఈ మధ్య యుఎస్ బాక్సాఫీస్ కూడా బాగానే పుంజుకుంది. సరైన సినిమా పడితే వసూళ్ల మోత మోగుతోంది. ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, కేజీఎఫ్ లాంటి చిత్రాలు అక్కడ వాటి వాటి స్థాయిలో కలెక్షన్ల పండించుకున్నాయి. కేవలం వీకెండ్లోనే ‘ఆర్ఆర్ఆర్’ 9 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. రాజమౌళి సినిమాతో వేరే చిత్రాలను పోల్చలేం కానీ.. మెగాస్టార్ చిరంజీవి-రామ్ చరణ్ కలయికలో కొరటాల శివ లాంటి తిరుగులేని ట్రాక్ రికార్డున్న దర్శకుడు తీసిన సినిమా మామూలుగా అయితే యుఎస్లో వసూళ్ల మోత మోగించాలి.
వీకెండ్లో అత్యధిక వసూళ్లు వచ్చే రోజైన శనివారం పాజిటివ్ టాక్తో మిలియన్ డాలర్లు కొల్లగొట్టేయాలి. టాక్ బాగా లేకుంటే అందులో సగం వసూళ్లైనా రావాలి. కానీ శనివారం ఈ చిత్రానికి యుఎస్లో వచ్చిన వసూళ్లు ఎంతో తెలుసా? కేవలం 90 వేల డాలర్లు. ఎంత నెగెటివ్ టాక్ వచ్చినా సరే.. ఈ స్థాయి సినిమా శనివారం కనీసం లక్ష డాలర్లు కూడా రాబట్టలేకపోవడం మామూలు షాక్ కాదు.
ఒక రోజులో యుఎస్లో చిరు-చరణ్ల సినిమా కేవలం మన లెక్కల్లో ఏడు లక్షలకు అటు ఇటుగా వసూళ్లు రాబట్టిందంటే ఇది ఎంత అండర్ పెర్ఫామ్ చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ప్రిమియర్స్ కోసం ఆసక్తి చూపేవారిని పక్కన పెడితే.. యుఎస్ ప్రేక్షకులు రివ్యూలను అనుసరించే వీకెండ్లో సినిమాలకు వెళ్తారు. ముఖ్యగా వారికి సినిమాలు చూడటానికి ఫేవరెట్ డే. కానీ ‘ఆచార్య’కు బ్యాడ్ రివ్యూలు రావడంతో ఈ సినిమాను అక్కడి వాళ్లు అవాయిడ్ చేస్తున్నారని అర్థమైంది. మెగా ఫ్యాన్స్ సైతం ఈ సినిమా పట్ల ఆసక్తి చూపించట్లేదన్నది స్పష్టం.
This post was last modified on May 2, 2022 10:29 am
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…