కరోనా దెబ్బతో దేశీయ మార్కెట్ లాగే యుఎస్లో తెలుగు సినిమాల మార్కెట్ కూడా కొంత కాలం డల్లుగా సాగింది. ఇంకా చెప్పాలంటే అక్కడ కరోనా ప్రభావం బాక్సాఫీస్ మీద మరింతగా పడింది. అక్కడ సినిమా టికెట్ల రేట్లు చాలా ఎక్కువ. పైగా చాలా దూరం ప్రయాణించి వెళ్లి సినిమా చూడాలి. కరోనా భయాలు వెంటాడుతుంటే అంత ఖర్చు పెట్టి, అంత దూరం ప్రయాణించి సినిమా చూడాలన్న ఆసక్తి ఎలా ఉంటుంది. అందుకే వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గాక కానీ అక్కడి జనాల్లో కదలిక రాలేదు.
ఐతే ఈ మధ్య యుఎస్ బాక్సాఫీస్ కూడా బాగానే పుంజుకుంది. సరైన సినిమా పడితే వసూళ్ల మోత మోగుతోంది. ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, కేజీఎఫ్ లాంటి చిత్రాలు అక్కడ వాటి వాటి స్థాయిలో కలెక్షన్ల పండించుకున్నాయి. కేవలం వీకెండ్లోనే ‘ఆర్ఆర్ఆర్’ 9 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. రాజమౌళి సినిమాతో వేరే చిత్రాలను పోల్చలేం కానీ.. మెగాస్టార్ చిరంజీవి-రామ్ చరణ్ కలయికలో కొరటాల శివ లాంటి తిరుగులేని ట్రాక్ రికార్డున్న దర్శకుడు తీసిన సినిమా మామూలుగా అయితే యుఎస్లో వసూళ్ల మోత మోగించాలి.
వీకెండ్లో అత్యధిక వసూళ్లు వచ్చే రోజైన శనివారం పాజిటివ్ టాక్తో మిలియన్ డాలర్లు కొల్లగొట్టేయాలి. టాక్ బాగా లేకుంటే అందులో సగం వసూళ్లైనా రావాలి. కానీ శనివారం ఈ చిత్రానికి యుఎస్లో వచ్చిన వసూళ్లు ఎంతో తెలుసా? కేవలం 90 వేల డాలర్లు. ఎంత నెగెటివ్ టాక్ వచ్చినా సరే.. ఈ స్థాయి సినిమా శనివారం కనీసం లక్ష డాలర్లు కూడా రాబట్టలేకపోవడం మామూలు షాక్ కాదు.
ఒక రోజులో యుఎస్లో చిరు-చరణ్ల సినిమా కేవలం మన లెక్కల్లో ఏడు లక్షలకు అటు ఇటుగా వసూళ్లు రాబట్టిందంటే ఇది ఎంత అండర్ పెర్ఫామ్ చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ప్రిమియర్స్ కోసం ఆసక్తి చూపేవారిని పక్కన పెడితే.. యుఎస్ ప్రేక్షకులు రివ్యూలను అనుసరించే వీకెండ్లో సినిమాలకు వెళ్తారు. ముఖ్యగా వారికి సినిమాలు చూడటానికి ఫేవరెట్ డే. కానీ ‘ఆచార్య’కు బ్యాడ్ రివ్యూలు రావడంతో ఈ సినిమాను అక్కడి వాళ్లు అవాయిడ్ చేస్తున్నారని అర్థమైంది. మెగా ఫ్యాన్స్ సైతం ఈ సినిమా పట్ల ఆసక్తి చూపించట్లేదన్నది స్పష్టం.
This post was last modified on May 2, 2022 10:29 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…