సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ కి సంబంధించి భారీ ప్రమోషన్ ప్లాన్ రెడీ అయింది. మే 2న రిలీజయ్యే ట్రైలర్ తో సినిమా మీద బజ్ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు మేకర్స్. అయితే మహేష్ కూడా ట్రైలర్ లాంచ్ నుండే రంగంలోకి దిగనున్నాడు. తన ప్రతీ సినిమాను మీడియా ముందుకొచ్చి స్పెషల్ గా ప్రమోట్ చేసుకునే మహేష్ ‘సర్కారు వారి పాట’ విషయంలో ఇంకాస్త ఎక్కువ జాగ్రత్త తీసుకొని ప్రమోషన్ చేయబోతున్నాడని తెలుస్తుంది.
మే మొదటి వారమంతా మహేష్ ప్రమోషన్స్ కి టైం ఇచ్చి షెడ్యుల్ లాక్ చేసుకున్నాడని సమాచారం. మే 10 వరకూ మహేష్ ఇంటర్వ్యూలు మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చేలా టీం ప్లాన్ రెడీ చేస్తున్నారట. అలాగే దర్శకులతో ఇంటర్వ్యూలు వగైరా లాంటివి కూడా ఏవో ప్లాన్ చేస్తున్నారట.
ముఖ్యంగా భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి ఫ్యాన్స్ ని మీట్ అవ్వబోతున్నాడట సూపర్ స్టార్. నిజానికి సినిమా ఓపెనింగ్స్ కి రాకపోయినా రిలీజ్ కి మాత్రం తన వంతుగా ప్రమోషన్ చేసి పెట్టడం మహేష్ లో బెస్ట్ క్వాలిటీ. తన స్టార్డం , క్రేజ్ పక్కన పెట్టి మీడియా ముందుకొచ్చి అందరికీ ఇంటర్వ్యూ లు ఇస్తూ సరదాగా ఉంటాడు.
రిలీజ్ కి ముందు ప్రమోషన్ చేశాకే తన ఫ్యామిలీతో టూర్ ప్లాన్ చేసుకుంటాడు మహేష్. కానీ రిలీజ్ తర్వాత టాక్ ఏ మాత్రం తేడా వచ్చినా మళ్ళీ మీడియాకి కనబడడు. మరి ఈసారి మహేష్ ‘సర్కారు వారి పాట’ ని ఏ రేంజ్ లో ప్రమోట్ చేస్తాడో ? మహేష్ టీం ఎలాంటి ప్లాన్ రెడీ చేశారో చూడాలి.
This post was last modified on April 30, 2022 10:54 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…