కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ‘ఆచార్య’ ఎట్టకేలకు థియేటర్స్ లోకి వచ్చేసింది. మునపటిలా చిరంజీవి సినిమాకి ఉండే క్రేజ్ , బజ్ లేకుండానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే మార్నింగ్ షో కే నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది ఈ మెగా మూవీ. ముఖ్యంగా మ్యూజిక్ పై బాగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. మణిశర్మ సినిమాకు పెద్ద మైనస్ అంటూ ఉదయం నుండి సోషల్ మీడియాలో మెలోడీ బ్రహ్మ వర్క్ గురించి చెప్పుకుంటున్నారు.
నిజమే మణి నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలహీనతే ఇది ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే.
ఇక కొరటాల అంతో ఇంతో సినిమాలో యాక్షన్ వడ్డించాడు కానీ దానికి సరైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పడలేదు. పాటలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. నిజానికి ఆచార్య కి అవుట్ డేటెడ్ మ్యూజిక్ ఇచ్చాడు మణి.
రిలీజ్ కి ముందు కొరటాల – మణిశర్మ మధ్య రీ రికార్డింగ్ గురించి ఓ పెద్ద డిస్కషన్ కూడా జరిగిందట. మణి శర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నచ్చక ఏమి చేయలేని పరిస్థితిలో కొరటాల మణి తనయుడు మహతి సాగర్ తో లాస్ట్ పార్ట్ మ్యూజిక్ కంపోజ్ చేయించుకున్నాడని ఓ న్యూస్ చక్కర్లు కొట్టింది. అందుకే ఫస్ట్ కాపీ డిలే అంటూ ఇన్సైడ్ టాక్ వినిపించింది.
అసలు బ్యాక్ స్కోర్ కి పెట్టింది పేరు అయిన మణిశర్మ అలా చేసి ఉండరు. ఇది జస్ట్ రూమర్ అంటూ కొరటాల -మణి ఇష్యూ ని లైట్ తీసుకున్న వారు ఆచార్య సినిమా చూశాక అది నిజమే అయి ఉంటుందంటూ మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా మెగాస్టార్ – మణి శర్మ కాంబో అంటే ఒకప్పుడు ఆడియో క్యాసెట్స్ భారీగా సేల్ అయ్యేవి. మణి తన బ్యాక్ గ్రౌండ్ తో చిరు సినిమాలను నిలబెట్టిన సందర్భాలెన్నో. మరి ఈ రేంజ్ సూపర్ హిట్ కాంబో ఫర్ ది ఫస్ట్ టీం ఆడియన్స్ ని నిరాశ పరిచింది. ‘ఆచార్య’ తో అందుకున్న ఫీడ్ బ్యాక్ తో మణి ఇకపై బెస్ట్ వర్క్ ఇచ్చి మళ్ళీ ఒకప్పటి పనితనం చూపిస్తే బడా సినిమాలన్నీ అతన్ని వెతుక్కుంటూ వెళ్తాయనడంలో సందేహమే లేదు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…