కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ‘ఆచార్య’ ఎట్టకేలకు థియేటర్స్ లోకి వచ్చేసింది. మునపటిలా చిరంజీవి సినిమాకి ఉండే క్రేజ్ , బజ్ లేకుండానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే మార్నింగ్ షో కే నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది ఈ మెగా మూవీ. ముఖ్యంగా మ్యూజిక్ పై బాగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. మణిశర్మ సినిమాకు పెద్ద మైనస్ అంటూ ఉదయం నుండి సోషల్ మీడియాలో మెలోడీ బ్రహ్మ వర్క్ గురించి చెప్పుకుంటున్నారు.
నిజమే మణి నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలహీనతే ఇది ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే.
ఇక కొరటాల అంతో ఇంతో సినిమాలో యాక్షన్ వడ్డించాడు కానీ దానికి సరైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పడలేదు. పాటలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. నిజానికి ఆచార్య కి అవుట్ డేటెడ్ మ్యూజిక్ ఇచ్చాడు మణి.
రిలీజ్ కి ముందు కొరటాల – మణిశర్మ మధ్య రీ రికార్డింగ్ గురించి ఓ పెద్ద డిస్కషన్ కూడా జరిగిందట. మణి శర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నచ్చక ఏమి చేయలేని పరిస్థితిలో కొరటాల మణి తనయుడు మహతి సాగర్ తో లాస్ట్ పార్ట్ మ్యూజిక్ కంపోజ్ చేయించుకున్నాడని ఓ న్యూస్ చక్కర్లు కొట్టింది. అందుకే ఫస్ట్ కాపీ డిలే అంటూ ఇన్సైడ్ టాక్ వినిపించింది.
అసలు బ్యాక్ స్కోర్ కి పెట్టింది పేరు అయిన మణిశర్మ అలా చేసి ఉండరు. ఇది జస్ట్ రూమర్ అంటూ కొరటాల -మణి ఇష్యూ ని లైట్ తీసుకున్న వారు ఆచార్య సినిమా చూశాక అది నిజమే అయి ఉంటుందంటూ మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా మెగాస్టార్ – మణి శర్మ కాంబో అంటే ఒకప్పుడు ఆడియో క్యాసెట్స్ భారీగా సేల్ అయ్యేవి. మణి తన బ్యాక్ గ్రౌండ్ తో చిరు సినిమాలను నిలబెట్టిన సందర్భాలెన్నో. మరి ఈ రేంజ్ సూపర్ హిట్ కాంబో ఫర్ ది ఫస్ట్ టీం ఆడియన్స్ ని నిరాశ పరిచింది. ‘ఆచార్య’ తో అందుకున్న ఫీడ్ బ్యాక్ తో మణి ఇకపై బెస్ట్ వర్క్ ఇచ్చి మళ్ళీ ఒకప్పటి పనితనం చూపిస్తే బడా సినిమాలన్నీ అతన్ని వెతుక్కుంటూ వెళ్తాయనడంలో సందేహమే లేదు.
This post was last modified on April 30, 2022 5:34 pm
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…