సినీ రంగంలో సెంటిమెంట్లు బాగా ఎక్కువ. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా సినిమా తీస్తూ కూడా సెంటిమెంట్లను మాత్రం వదలరు సినీ జనాలు. హీరోయిన్లకు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఐరెన్ లెగ్ ముద్రలు వేయడం.. తొలి సినిమాతో హిట్ కొట్టిన దర్శకులు ద్వితీయ విఘ్నాన్ని దాటలేరనడం.. ఇలా చాలా సెంటిమెంట్లే ఉంటాయి సినీ రంగంలో. టాలీవుడ్ విషయానికి వస్తే.. ఇప్పటిదాకా అపజయమే ఎరుగని, సినిమా సినిమాకూ తన స్థాయిని పెంచుకుంటూ పోతున్న రాజమౌళి విషయంలోనూ ఒక నెగెటివ్ సెంటిమెంట్ ఉండటం విశేషం.
ఆయనతో సినిమా చేసి ఘనవిజయాన్ని అందుకున్న హీరో, మిగతా మెయిన్ ఆర్టిస్టులు తర్వాతి సినిమాతో చేదు అనుభవాన్ని ఎదుర్కొంటారనే సెంటిమెంట్ ఎప్పట్నుంచో ఉంది. కెరీర్ ఆరంభం నుంచి పరిశీలిస్తే ప్రతి సినిమాకూ దాదాపుగా ఇదే జరిగింది. ‘బాహుబలి’ లాంటి మెగా సక్సెస్ తర్వాత ప్రభాస్ వరుసగా రెండు డిజాస్టర్లు ఎదుర్కోవడంతో ఈ సెంటిమెంట్ ఇంకా బలపడింది. ఐతే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఏం జరుగుతుందా అని ఇప్పుడు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇందులో ఒక లీడ్ రోల్ చేసిన రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో నటించిన ‘ఆచార్య’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఐతే రాజమౌళి సెంటిమెంటు ఈ చిత్రానికి ప్రతికూలంగా మారుతుందేమో అని చిరు ముందే అలెర్ట్ అయ్యారు. ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ఆయన ఈ సెంటిమెంట్ ‘ఆచార్య’తో బ్రేక్ అవుతుందని స్టేట్మెంట్ ఇచ్చారు. చిరు తనకు తానుగా ఈ సెంటిమెంటు గురించి ప్రస్తావించి, చాలా నమ్మకంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వడంతో మెగా అభిమానుల్లో ధీమా వచ్చింది.
‘ఆచార్య’ మీద జక్కన్న నెగెటివ్ సెంటిమెంట్ ప్రభావం ఉండదనే అనుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్లు కోరుకున్నది జరగలేదు. చిరు జరగదన్నదే జరిగేట్లు కనిపిస్తోంది. నెగెటివ్ టాక్తో మొదలైన ‘ఆచార్య’ వీకెండ్లో ఎంత బాగా పెర్ఫామ్ చేసినా.. ఆ తర్వాత నిలవడం కష్టమే కావచ్చు. అంతిమంగా బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం ప్రతికూల ఫలితాన్నే అందుకుని రాజమౌళి సెంటిమెంటును కొనసాగించేలా ఉంది.
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…
ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని.. మళ్లీ మళ్లీ ప్రభుత్వం మారే పరిస్థితి కూడా ఉండదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆ…