సినీ రంగంలో సెంటిమెంట్లు బాగా ఎక్కువ. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా సినిమా తీస్తూ కూడా సెంటిమెంట్లను మాత్రం వదలరు సినీ జనాలు. హీరోయిన్లకు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఐరెన్ లెగ్ ముద్రలు వేయడం.. తొలి సినిమాతో హిట్ కొట్టిన దర్శకులు ద్వితీయ విఘ్నాన్ని దాటలేరనడం.. ఇలా చాలా సెంటిమెంట్లే ఉంటాయి సినీ రంగంలో. టాలీవుడ్ విషయానికి వస్తే.. ఇప్పటిదాకా అపజయమే ఎరుగని, సినిమా సినిమాకూ తన స్థాయిని పెంచుకుంటూ పోతున్న రాజమౌళి విషయంలోనూ ఒక నెగెటివ్ సెంటిమెంట్ ఉండటం విశేషం.
ఆయనతో సినిమా చేసి ఘనవిజయాన్ని అందుకున్న హీరో, మిగతా మెయిన్ ఆర్టిస్టులు తర్వాతి సినిమాతో చేదు అనుభవాన్ని ఎదుర్కొంటారనే సెంటిమెంట్ ఎప్పట్నుంచో ఉంది. కెరీర్ ఆరంభం నుంచి పరిశీలిస్తే ప్రతి సినిమాకూ దాదాపుగా ఇదే జరిగింది. ‘బాహుబలి’ లాంటి మెగా సక్సెస్ తర్వాత ప్రభాస్ వరుసగా రెండు డిజాస్టర్లు ఎదుర్కోవడంతో ఈ సెంటిమెంట్ ఇంకా బలపడింది. ఐతే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఏం జరుగుతుందా అని ఇప్పుడు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇందులో ఒక లీడ్ రోల్ చేసిన రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో నటించిన ‘ఆచార్య’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఐతే రాజమౌళి సెంటిమెంటు ఈ చిత్రానికి ప్రతికూలంగా మారుతుందేమో అని చిరు ముందే అలెర్ట్ అయ్యారు. ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ఆయన ఈ సెంటిమెంట్ ‘ఆచార్య’తో బ్రేక్ అవుతుందని స్టేట్మెంట్ ఇచ్చారు. చిరు తనకు తానుగా ఈ సెంటిమెంటు గురించి ప్రస్తావించి, చాలా నమ్మకంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వడంతో మెగా అభిమానుల్లో ధీమా వచ్చింది.
‘ఆచార్య’ మీద జక్కన్న నెగెటివ్ సెంటిమెంట్ ప్రభావం ఉండదనే అనుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్లు కోరుకున్నది జరగలేదు. చిరు జరగదన్నదే జరిగేట్లు కనిపిస్తోంది. నెగెటివ్ టాక్తో మొదలైన ‘ఆచార్య’ వీకెండ్లో ఎంత బాగా పెర్ఫామ్ చేసినా.. ఆ తర్వాత నిలవడం కష్టమే కావచ్చు. అంతిమంగా బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం ప్రతికూల ఫలితాన్నే అందుకుని రాజమౌళి సెంటిమెంటును కొనసాగించేలా ఉంది.
This post was last modified on April 29, 2022 5:58 pm
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
తెలంగాణ పల్లె గీతాలకు ఆణిముత్యమైన జానపద గాయకుడు మొగిలయ్య ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…