ఆచార్య ఫలితం దాదాపుగా తేలిపోయింది. అద్భుతాలు చేసే అవకాశం లేనట్టే. కాకపోతే ఫ్లాప్ గా మిగులుతుందా లేక వేసవి సెలవుల అడ్వాంటేజ్ ని వాడుకుని యావరేజ్ గా మారుతుందానేది ఇంకో వారం ఆగితే డిసైడ్ అవుతుంది. సరే సినిమా చూశాక కలిగిన అభిప్రాయాలు కాసేపు పక్కనపెడితే ఆచార్యకు నెగటివ్ ప్రీ పబ్లిసిటీ రావడంలో సోషల్ మీడియా పాత్ర ఉందని అభిమానులు ఆరోపిస్తున్నారు.
ఒక వర్గం అదే పనిగా సినిమా బాగారాలేదని ముందు నుంచి ప్రచారం చేస్తూ వచ్చారని అంటున్నారు. ఇందులో నిజమెంతుందనేది పక్కనపెడితే ఆచార్య ట్రైలర్ కట్ చేసిన విధానం, చివరి పది రోజులు మినహాయించి ముందు నుంచి ఒక బజ్ ని తీసుకురావడంలో ఎదురుకున్న వైఫల్యం పైన చెప్పిన ప్రచారానికి ప్రధాన కారణమని చెప్పొచ్చు.
చిరంజీవి చరణ్ కాంబినేషన్ అంటే ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ స్థాయిలో ప్రమోట్ కావాల్సిన మల్టీ స్టారర్. కానీ అలాంటిదేమి జరగలేదు. ఏదో రెగ్యులర్ మెగాస్టార్ మూవీ వస్తోందన్నట్టుగానే పబ్లిసిటీ చేశారు. దానికి తగ్గట్టే ఇప్పుడీ వీక్ కంటెంట్ మరింత దెబ్బ కొట్టింది. సినిమా బాగున్నా బాగాలేకపోయినా దాన్ని ఫైనల్ గా నిర్ణయించేది ప్రేక్షకులు. కానీ తొలి వారం పది రోజులు వీలైనంత ఎక్కువ పబ్లిక్ థియేటర్లకు వచ్చేలా చేయాలంటే మాత్రం ప్రమోషన్ హడావిడి చాలా అవసరం.
ఆ మాటకొస్తే ఆర్ఆర్ఆర్ కు ఎలాంటి హంగామా అక్కర్లేదు. కానీ రాజమౌళి కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ ఇద్దరు హీరోలతో దేశమంతా చుట్టొచ్చారు. ఆచార్యకు కనీసం తెలుగు రాష్ట్రాలు కూడా రౌండ్ వేయలేదు. సో సోషల్ మీడియా కన్నా ఎక్కువ డ్యామేజ్ దేనివల్ల జరిగిందో అర్థమవుతోందిగా!
This post was last modified on April 29, 2022 3:20 pm
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…