సినిమా థియేటర్లు మూసి వేసి ఉంచడంతో ఒక మాదిరి సినిమాలను ఓటిటీ ద్వారా విడుదల చేసేస్తున్నారు. అయితే ఇంత వరకు ఓటిటీ ద్వారా బయటకు వచ్చిన సినిమాల్లో ఒక్కటి కూడా ఆకట్టుకోలేదు. పేరుకి కొన్ని చెప్పుకోదగ్గ సినిమాలే వచ్చాయి కానీ ‘భలే ఉంది’ అనిపించేది మాత్రం ఏదీ రాలేదు. గులాబో సితాబో, పెంగ్విన్ సినిమాల తర్వాత ఇలా విడుదలయ్యే సినిమాల్లో విషయం ఉండదనే ఫీలింగ్ బలపడిపోయింది.
సినిమా బాగుంటే థియేటర్లో విడుదల చేసుకునే వరకు వేచి చూసే వాళ్ళు కదా, బాగోలేదని తెలిసే ఇలా వదిలించేసుకున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదితి రావు హైదరి నటించిన మలయాళ చిత్రం సుఫియుమ్ సుజాతయుమ్ జజులై 3న అమెజాన్ ద్వారా రిలీజ్ అవుతోంది. కనీసం ఈ సినిమా అయినా సినీ ప్రియుల ఆదరణ చూరగొంటే బాగుంటుంది. లేదా విషయం లేని సినిమాలే ఇలా విడుదల అవుతాయనే భావన బలపడి, కొత్త సినిమాలు కొనడానికి ఓటిటీ కంపెనీలు వెనక్కి తగ్గే ప్రమాదం ఉంటుంది.
This post was last modified on June 23, 2020 12:21 am
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…