సినిమా థియేటర్లు మూసి వేసి ఉంచడంతో ఒక మాదిరి సినిమాలను ఓటిటీ ద్వారా విడుదల చేసేస్తున్నారు. అయితే ఇంత వరకు ఓటిటీ ద్వారా బయటకు వచ్చిన సినిమాల్లో ఒక్కటి కూడా ఆకట్టుకోలేదు. పేరుకి కొన్ని చెప్పుకోదగ్గ సినిమాలే వచ్చాయి కానీ ‘భలే ఉంది’ అనిపించేది మాత్రం ఏదీ రాలేదు. గులాబో సితాబో, పెంగ్విన్ సినిమాల తర్వాత ఇలా విడుదలయ్యే సినిమాల్లో విషయం ఉండదనే ఫీలింగ్ బలపడిపోయింది.
సినిమా బాగుంటే థియేటర్లో విడుదల చేసుకునే వరకు వేచి చూసే వాళ్ళు కదా, బాగోలేదని తెలిసే ఇలా వదిలించేసుకున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదితి రావు హైదరి నటించిన మలయాళ చిత్రం సుఫియుమ్ సుజాతయుమ్ జజులై 3న అమెజాన్ ద్వారా రిలీజ్ అవుతోంది. కనీసం ఈ సినిమా అయినా సినీ ప్రియుల ఆదరణ చూరగొంటే బాగుంటుంది. లేదా విషయం లేని సినిమాలే ఇలా విడుదల అవుతాయనే భావన బలపడి, కొత్త సినిమాలు కొనడానికి ఓటిటీ కంపెనీలు వెనక్కి తగ్గే ప్రమాదం ఉంటుంది.
This post was last modified on June 23, 2020 12:21 am
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…