అజయ్ దేవగణ్ ఏదో అనుకున్నాడు. కానీ ఏదో జరిగిపోయింది. హైప్ లేని తన సినిమాకు ప్రమోషన్ కోసం చేశాడో.. లేక వేరే ఉద్దేశమో కానీ.. ఆయన వేసిన ట్వీట్ కారణంగా అనవసర వివాదంలో చిక్కుకుని ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇటీవల కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్.. ఓ సినిమా వేడుకలో మాట్లాడుతూ హిందీ ఇంకెంత మాత్రం జాతీయ భాష కాదని, సౌత్ సినిమాలు ఉత్తరాదిన అదరగొడుతుంటే.. తెలుగు, తమిళంలోకి డబ్ అవుతున్న హిందీ సినిమాలు ఇక్కడ ప్రభావం చూపట్లేదని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
ఐతే ఈ వ్యాఖ్యలకు భలే కౌంటర్ ఇస్తున్నా అనుకుంటూ అజయ్ వేసిన ట్వీట్ ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. హిందీ జాతీయ భాష కాకుంటే మీ సినిమాలను హిందీలోకి ఎందుకు అనువాదం చేస్తున్నారు అని ప్రశ్నిస్తూ.. హిందీ మన మాతృభాష, మన జాతీయ భాష అని స్టేట్మెంట్ ఇచ్చాడు అజయ్. దీనికి సుదీప్ ఏం సమాధానం ఇచ్చాడు.. వీరి మధ్య తర్వాత జరిగిన సంభాషణ ఏంటన్నది పక్కన పెడితే.. సౌత్ ఇండియన్స్ ఈ ట్వీట్ మీద తీవ్రంగానే స్పందించారు. అందులో కర్ణాకట మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహా ప్రముఖులు కూడా చాలామందే ఉన్నారు.
హిందీ అసలు జాతీయ భాష కాదు అనడానికి రుజువులు చూపిస్తూ.. హిందీ మీకు మాతృభాష కానీ, మాకు కాదు అంటూ అజయ్కి కౌంటర్లు ఇచ్చారు చాలామంది. ఇలా ఇంకెంత కాలం హిందీని మా మీద రుద్దుతారు.. ఏమిటి మీ ఆధిపత్యం అంటూ అజయ్ని కడిగిపారేస్తున్నారు సౌత్ నెటిజన్లు. అసలు అజయ్ హిందీలో ట్వీట్ వేయడాన్నే చాలామంది తప్పుబట్టారు. మీరు హిందీలో రాస్తే మేం అర్థం చేసుకుంటున్నాం, మరి మా భాషల్లో ట్వీట్లు వేస్తే మీకు అర్థమవుతుందా అన్న సుదీప్ ప్రశ్నను ఉటంకిస్తూ అజయ్ని చాలామంది నెటిజన్లు నిలదీశారు.
ఇంగ్లిష్ సినిమాలు ఇక్కడ అనువాదం అయి రిలీజవుతాయి.. మన సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో పలు భాషల్లో అనువాదం అవుతాయి.. అంతమాత్రాన అవన్నీ మాతృభాషలు అవుతాయా.. మాతృభాషల్లో కాకుండా వేరే భాషల్లో సినిమాలు అనువాదం చేయకూడదా.. మరి మీరెదుకు వేరే భాషల్లోకి సినిమాలను అనువాదం చేస్తున్నారు అని నెటిజన్లు అజయ్కి ప్రశ్నలు సంధిస్తున్నారు. మొత్తానికి తన ట్వీట్తో అజయ్ దక్షిణాది జనాలతో బాగానే సున్నం పెట్టుకున్నాడు. ఇది అతడి సినిమాలకు చేటు చేసేదే.
This post was last modified on April 28, 2022 2:22 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…