మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం అభిమానుల నిరీక్షణకు మరికొన్ని గంటల్లో తెరపడబోతోంది. ఎప్పుడో నాలుగేళ్ల కిందట మొదలైన ఆచార్య సినిమా ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చిరుతో చరణ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం.. వరుసగా నాలుగు బ్లాక్బస్టర్లు అందించిన కొరటాల శివ ఈ చిత్రాన్ని రూపొందించడంతో అంచనాలు మామూలుగా లేవు.
సినిమాలో చాలా హైలైట్లే ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. చిరు-చరణ్ కాంబినేషన్లో సినిమా అంటే ప్రేక్షకులు కోరుకునే మాస్, యాక్షన్ అంశాలకు లోటే ఉండదని అంతా అంటున్నారు. సినిమాలో మేజర్ హైలైట్ ఏంటి అని రామ్ చరణ్ను అడిగితే.. క్లైమాక్స్ అని చెప్పాడు ఓ ఇంటర్వ్యూలో. అలాంటి క్లైమాక్స్ చిత్రీకరించడం అంత తేలిక కాదని.. చూసే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలుగుతుందని అతను అభిప్రాయపడ్డాడు.
ఆచార్య టీజర్లోనే రెడ్ కలర్ బ్యాక్డ్రాప్లో చిరు శూలంతో రౌడీల్ని చీల్చి చెండాడే ఒక షాట్ హైలైట్ అయిన సంగతి తెలిసిందే. అది క్లైమాక్స్లోని దృశ్యమేనట. ఆచార్య దేవాలయాల రక్షణ చుట్టూ నడిచే కథాంశం కావడంతో అందుకు తగ్గట్లే కుంకుమ బ్యాక్డ్రాప్తో పతాక ఘట్టాన్ని తీర్చిదిద్దినట్లు చరణ్ తెలిపాడు.
ఐతే అంత పెద్ద ఎత్తున లొకేషన్లో కుంకుమ పోసి దాని మధ్య ఫైట్ చిత్రీకరించడం అంటే సామాన్యమైన విషయం కాదని.. ఆ కుంకుమ పీలుస్తూ నిలబడ్డమే కష్టమంటే.. షూటింగ్ ఇంకా కష్టమని.. రెండు మూడు రోజులకే అందరూ దాని దెబ్బకు కింద పడిపోతారనుకున్నానని.. అలాంటిది తొమ్మిది రోజులు చిత్రీకరణ జరిపారంటే ఎంత కష్టపడి ఉంటారో అర్థం చేసుకోవచ్చని చరణ్ అన్నాడు. కుంకుమ హైలైట్ అవుతూనే.. అది మనుషులను డామినేట్ చేయకుండా చాలా జాగ్రత్తగా కెమెరామన్ తిరు, ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ క్లైమాక్స్ ఫైట్ పూర్తి చేశారని.. వాళ్లను ఎంత పొగిడినా తక్కువే అని.. థియేటర్లలో ఈ ఘట్టం చూసి ప్రేక్షకుల గొప్ప అనుభూతికి లోనవుతారని చెప్పాడు.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…