కన్నడ జనాలు దివంగత నటుడు రాజ్ కుమార్ను ఒక దేవుడిలాగా చూస్తారు. కన్నడ సినీ చరిత్రలో ఆయన్ని మించిన స్టార్ లేరు. తన సినిమాలతో అమితంగా అలరించడంతో పాటు తన వ్యక్తిత్వంతోనూ కన్నడిగుల మనసులను దోచారాయన. ఆయన వారసత్వాన్నందుకుని సినీ రంగంలోకి అడుగు పెట్టిన శివరాజ్ కుమార్, పునీత్ రాజ్కుమార్ సైతం చాలా పెద్ద స్టార్లయ్యారు.
ఐతే కొన్ని నెలల కిందట పునీత్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం కన్నడిగులను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. ఇటీవల పునీత్ చివరి సినిమా జేమ్స్ రిలీజ్ కాగా.. దానికి జనాలు బ్రహ్మరథం పట్టారు. ఆ సందర్భంగా పునీత్ పట్ల, రాజ్ కుమార్ పట్ల కన్నడిగుల ప్రేమ ఎలాంటిదో మరోసారి అందరికీ తెలిసిందే. ఇప్పుడు వారి ప్రేమను అందుకోవడానికి రాజ్ కుమార్ కుటుంబం నుంచి మరో నట వారసుడు వస్తున్నాడు.
అతడి పేరు.. యువరాజ్కుమార్.
శివరాజ్, పునీత్ల సోదరి కొడుకే ఈ యువరాజ్ కుమార్. రాజ్ కుమార్ కుటుంబం నుంచి వస్తున్న మూడో తరం కథానాయకుడు. యువరాజ్ తెరంగేట్రం కోసం శివ, పునీత్ కొన్నేళ్ల ముందు నుంచే ప్రణాళికలు రచించారు. ఐతే యువరాజ్ అందుకోసం ప్రిపేరవుతున్న తరుణంలోనే పునీత్ హఠాత్తుగా కన్నుమూశాడు. జేమ్స్ కంటే ముందు పునీత్ నటించిన యువరత్న చిత్రాన్ని రూపొందించిన సంతోష్ ఆనండ్రం ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు.
కేజీఎఫ్, కేజీఎఫ్-2, సలార్ చిత్రాలతో ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ బేనర్లలో ఒకటిగా ఎదిగిన హోంబలె ఫిలిమ్స్.. యువరాజ్కుమార్ను హీరోగా పరిచయం చేయబోతోంది. ఈ సంస్థ పునీత్తో ఒక భారీ పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేసింది గత ఏడాది. అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. కానీ ఇంతలో పునీత్ కన్నుమూశాడు. ఇప్పుడు యువరాజ్ బాధ్యతను ఆ సంస్థ తీసుకుంది.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…