కన్నడ జనాలు దివంగత నటుడు రాజ్ కుమార్ను ఒక దేవుడిలాగా చూస్తారు. కన్నడ సినీ చరిత్రలో ఆయన్ని మించిన స్టార్ లేరు. తన సినిమాలతో అమితంగా అలరించడంతో పాటు తన వ్యక్తిత్వంతోనూ కన్నడిగుల మనసులను దోచారాయన. ఆయన వారసత్వాన్నందుకుని సినీ రంగంలోకి అడుగు పెట్టిన శివరాజ్ కుమార్, పునీత్ రాజ్కుమార్ సైతం చాలా పెద్ద స్టార్లయ్యారు.
ఐతే కొన్ని నెలల కిందట పునీత్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం కన్నడిగులను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. ఇటీవల పునీత్ చివరి సినిమా జేమ్స్ రిలీజ్ కాగా.. దానికి జనాలు బ్రహ్మరథం పట్టారు. ఆ సందర్భంగా పునీత్ పట్ల, రాజ్ కుమార్ పట్ల కన్నడిగుల ప్రేమ ఎలాంటిదో మరోసారి అందరికీ తెలిసిందే. ఇప్పుడు వారి ప్రేమను అందుకోవడానికి రాజ్ కుమార్ కుటుంబం నుంచి మరో నట వారసుడు వస్తున్నాడు.
అతడి పేరు.. యువరాజ్కుమార్.
శివరాజ్, పునీత్ల సోదరి కొడుకే ఈ యువరాజ్ కుమార్. రాజ్ కుమార్ కుటుంబం నుంచి వస్తున్న మూడో తరం కథానాయకుడు. యువరాజ్ తెరంగేట్రం కోసం శివ, పునీత్ కొన్నేళ్ల ముందు నుంచే ప్రణాళికలు రచించారు. ఐతే యువరాజ్ అందుకోసం ప్రిపేరవుతున్న తరుణంలోనే పునీత్ హఠాత్తుగా కన్నుమూశాడు. జేమ్స్ కంటే ముందు పునీత్ నటించిన యువరత్న చిత్రాన్ని రూపొందించిన సంతోష్ ఆనండ్రం ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు.
కేజీఎఫ్, కేజీఎఫ్-2, సలార్ చిత్రాలతో ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ బేనర్లలో ఒకటిగా ఎదిగిన హోంబలె ఫిలిమ్స్.. యువరాజ్కుమార్ను హీరోగా పరిచయం చేయబోతోంది. ఈ సంస్థ పునీత్తో ఒక భారీ పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేసింది గత ఏడాది. అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. కానీ ఇంతలో పునీత్ కన్నుమూశాడు. ఇప్పుడు యువరాజ్ బాధ్యతను ఆ సంస్థ తీసుకుంది.
This post was last modified on April 28, 2022 7:48 am
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…